NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన?
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన?
    ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన?

    Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 23, 2024
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ యాజమాన్యం దృష్టి సారించింది. ఇప్పటికే రిటైన్ చేసుకొనే ఆటగాళ్లపై ఓ అవగాహనకు వచ్చింది.

    ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండ్లీ ప్లవర్ నేతృత్వంలో ఐపీఎల్ 2025 సీజన్‌కు అన్ని విధాల సమాయత్తమవుతోంది.

    బీసీసీఐ కూడా మెగా వేలం నిర్వహించడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీల నుంచి సలహాలు, సూచలను తీసుకుంది.

    ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం జరగనుంది.

    వేలం రూల్స్ ప్రకారం గరిష్టంగా నలుగురు నుంచి ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొనే అవకాశం ఉంది.

    Details

    మెగా వేలానికి సిద్ధంగా ఆర్సీబీ

    విరాట్ కోహ్లీకి మళ్లీ సారథ్య బాధ్యతలను ఇచ్చి, జట్టుకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేస్తే బాగుంటుందని ఆర్సీబీ యాజమాన్యం ఆలోచిస్తోంది.

    కోహ్లీ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ నియమితులయ్యారు. అయితే 40 ఏళ్ల వయస్సు ఉన్న డుప్లెసిస్‌ను మళ్లీ రిటైన్ చేసుకొనే అవకాశం లేదు.

    ఒకవేళ రిటైన్ తీసుకున్న అతనికి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి.

    Details

    లండన్ లో విరాట్ కోహ్లీ

    ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టులో ఉన్న జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా ఉన్న కేఎల్ రాహుల్‌ లాంటి ఆటగాళ్లను వేలం కొనుగోలు చేసి, వీరిలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తోంది.

    ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యలను చేపట్టేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

    ఎలాగైనా అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ విరాట్ కోహ్లీని మళ్లీ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపడితే కోహ్లీ అభిమానుల సంతోషానికి హద్దే ఉండదు.

    ప్రస్తుతం విరాట్ కోహ్లీ, ఫ్యామిలీతో లండన్‌లో ఉన్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    ఐపీఎల్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    విరాట్ కోహ్లీ

    Virat Kohli Record: ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు  ప్రపంచ కప్
    Anushka Sharma: టీమిండియా ఓటమి.. విరాట్ కోహ్లీని హత్తుకొని ఓదార్చిన అనుష్క  టీమిండియా
    ICC Rankings లో దుమ్మురేపిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రోహిత్ శర్మ
    Virat Kohli: విరాట్ కోహ్లీ ముఖం నిండా గాయాలు.. ఫోటో వైరల్ క్రికెట్

    ఐపీఎల్

    IPL 2024: లక్నో జట్టులోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామర్ జోసెఫ్  లక్నో సూపర్‌జెయింట్స్
    IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్.. జెర్సీలో మార్పులు  క్రీడలు
    IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్, ఇతర వివరాలు క్రీడలు
    IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌  పాట్ కమిన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025