
Trump: ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరించాలి.. అది మా మిత్ర దేశం: నెతన్యాహూకు ట్రంప్ వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
గత వారం గాజాలో కాల్పుల విరమణపై అమెరికా చేసిన ప్రతిపాదనలను చర్చించేందుకు దోహాలో హమాస్ నేతలు సమావేశమయ్యారు. దీనిని 'సమ్మిట్ ఆఫ్ ఫైర్'గా వివరిస్తూ ఇజ్రాయెల్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఖతార్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశం అని గుర్తిస్తూ, ఇజ్రాయెల్ ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఖతార్ మద్దతుతో సంబంధిత మార్గంలో వ్యవహరించాల్సిందని ట్రంప్ హెచ్చరించారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని అద్భుత వ్యక్తిగా అభివర్ణిస్తూ, ఇజ్రాయెల్ హమాస్పై తీసుకునే చర్యలు ఖతార్పై ప్రభావితం కాకూడదని స్పష్టం చేశారు.
వివరాలు
ఇజ్రాయెల్ వైమానిక దాడులు
కాల్పుల విరమణకు సంబంధించిన యూఎస్ ప్రతిపాదన మేరకు, ఇటీవల దోహాలో ఖతార్ అధికారులు,హమాస్ నాయకులు సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చల మధ్యలోనే ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడుల్లో ఎవరూ ప్రాణాలను కోల్పోలేదు. ఈ దాడులను ఖతార్ తీవ్రంగా పరిగణిస్తూ, మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కలవరపెట్టేలా జరగిన చర్యగా పేర్కొంది. భారత్ సహా అనేక దేశాలు ఈ దాడులను ఖండించాయి. అంతే కాకుండా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం ఇజ్రాయెల్కు వెళ్లి గాజా సమస్య పరిష్కారం గురించి ఇజ్రాయెల్ అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.
వివరాలు
అమెరికా ప్రతిస్పందించిన విధానం ఆధారంగా.. ఇజ్రాయెల్ కూడా
ఇదే సమయంలో, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన దేశం చేపట్టిన దాడులను సమర్థిస్తూ, అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడులను అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోల్చారు. ఒక వీడియో ప్రసంగంలో ఆయన హమాస్ దాడి తర్వాత తీసుకున్న చర్యలను వివరించారు. అమెరికా 9/11 దాడులకు ప్రతిస్పందించిన విధానం ఆధారంగా, ఇజ్రాయెల్ కూడా అదే విధంగా స్పందించిందని చెప్పారు. ఆయా దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులను ఎక్కడ ఉన్నా వెంటనే శిక్షిస్తామని, నిన్న అమెరికా చెప్పిన విధానాన్ని తాము కూడా అమలు చేస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు.