NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / IPO: డిసెంబర్‌లో పబ్లిక్‌ ఇష్యూల సందడి.. రూ.20,000 కోట్ల పబ్లిక్‌ ఇష్యూలు! 
    తదుపరి వార్తా కథనం
    IPO: డిసెంబర్‌లో పబ్లిక్‌ ఇష్యూల సందడి.. రూ.20,000 కోట్ల పబ్లిక్‌ ఇష్యూలు! 

    IPO: డిసెంబర్‌లో పబ్లిక్‌ ఇష్యూల సందడి.. రూ.20,000 కోట్ల పబ్లిక్‌ ఇష్యూలు! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 25, 2024
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే నెలలో(డిసెంబర్‌) కూడా పబ్లిక్ ఇష్యూల హడావుడి కొనసాగనుంది.

    వివిధ రంగాల నుంచి కనీసం 10 కంపెనీలు దాదాపు రూ.20,000 కోట్ల నిధులను సమీకరించే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.

    ఈ ఐపీఓలలో కొత్త షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ విధానం కూడా ఉంటుందని తెలుస్తోంది.

    వివరాలు 

    మార్కెట్ సానుకూలత పెరుగుతోంది 

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు మార్కెట్ సానుకూల వాతావరణాన్ని తీసుకువచ్చాయని ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ ప్రతినిధి తెలిపారు.

    ఈ పరిణామాలు ఐపీఓ కార్యకలాపాలు, నిధుల సమీకరణ వేగవంతం కావడానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.

    వివరాలు 

    డిసెంబరులో ఐపీఓలకు సిద్ధంగా ఉన్న కంపెనీలు 

    విశాల్ మెగామార్ట్

    ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరిగే ఈ ఐపీఓలో ప్రమోటర్ సమాయత్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీ ద్వారా కంపెనీ రూ.8,000 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఇండియా) లిమిటెడ్

    బ్లాక్‌స్టోన్ యాజమాన్యం ఉన్న ఈ వజ్రాల గ్రేడింగ్ సంస్థ రూ.4,000 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఐపీఓలో రూ.1,250 కోట్ల తాజా షేర్లు, రూ.2,750 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ షేర్లు అందుబాటులో ఉంటాయి.

    అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్

    ఈ సంస్థ మొత్తం రూ.3,500 కోట్ల నిధులను ఐపీఓ ద్వారా సమీకరించాలనే ఉద్దేశ్యంతో ఉంది. ఇందులో రూ.1,000 కోట్ల తాజా షేర్లు, రూ.2,500 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ షేర్లు ఉంటాయి.

    వివరాలు 

    2024లో ఐపీఓల ప్రగతి 

    ఇతర సంస్థలు: సాయి లైఫ్ సైన్సెస్, పరాస్ హెల్త్‌కేర్, డీఏఎం కేపిటల్ అడ్వయిజర్స్, సురక్షా డయాగ్నొస్టిక్, మమతా మెషినరీ, ట్రాన్స్‌రైల్ లైటింగ్ వంటి సంస్థలు కూడా డిసెంబర్‌లో ఐపీఓలకు సిద్ధమవుతున్నాయి.

    ఈ సంవత్సరం ఇప్పటివరకు 75కి పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా మొత్తం రూ.1.3 లక్షల కోట్లు సమీకరించాయి.

    హ్యుందాయ్ మోటార్ ఇండియా, స్విగ్గీ, ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

    2023లో మాత్రం 57 కంపెనీలు రూ.49,436 కోట్ల నిధులను మాత్రమే సమీకరించాయి. ఇదే విధంగా 2024లో ఐపీఓల రన్ మరింత ఉత్సాహంగా కొనసాగనుందని నిపుణులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఓ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఐపీఓ

    Tata Tech IPO: అదరగొట్టిన టాటా ఐపీఓ.. నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్ ఫుల్  టాటా
    Ixigo :శుభారంభాన్నిచ్చిన ఇక్సిగో IPO ట్రావెల్  బిజినెస్
    భారత్‌లో SHEIN ఐపీఓను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    Hyundai IPO: పూర్తైన హ్యుందాయ్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ .. క్యూఐబీ కోటా నుంచి అత్యధిక బిడ్లు హ్యుందాయ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025