NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market today: లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 498, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభం 
    తదుపరి వార్తా కథనం
    Stock market today: లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 498, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభం 
    లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 498, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభం

    Stock market today: లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 498, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    04:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి.

    గత వారం భారీ నష్టాల తర్వాత, అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు ఈ రోజు మార్కెట్లకు లాభాలను తెచ్చాయి.

    దీంతో ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గినట్లు గణాంకాలు వెలువడడం, ఆసియా మార్కెట్లు సహా మన మార్కెట్లకు సానుకూల ప్రభావం చూపించింది.

    ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీల షేర్లు సూచీల పెరుగుదలలో కీలక పాత్ర పోషించాయి.

    వివరాలు 

    85.13 వద్ద జీవనకాల కనిష్ఠ స్థాయికి రూపాయి

    సెన్సెక్స్ ఉదయం 78,488.64 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,918.12 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన ఈ సూచీ, చివరికి 498.58 పాయింట్ల లాభంతో 78,540.17 వద్ద ముగిసింది.

    నిఫ్టీ కూడా 165.95 పాయింట్ల లాభంతో 23,753.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 13 పైసలు క్షీణించి 85.13 వద్ద జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరింది.

    సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, రిలయన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

    అయితే జొమాటో, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి.

    వివరాలు 

     బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది

    అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం ఔన్సు 2640 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    ఫిబ్రవరి 1న కూడా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ మార్కెట్లు యథాతథంగా పనిచేస్తాయని ప్రకటించారు.

    ఈ రోజు, శనివారం కూడా ట్రేడింగ్ నిర్వహించనట్లు రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలు ఓ సర్క్యులర్‌లో తెలిపారు.

    ఉదయం 9 గంటల నుంచి 3.30 గంటల వరకు ఈక్విటీ ట్రేడింగ్ జరగనుంది, అలాగే కమొడిటీ ట్రేడింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్
    Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం భారతదేశం

    స్టాక్ మార్కెట్

    Stock market: ముదుపర్ల లాభాల స్వీకరణ.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ వ్యాపారం
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ ఎంత పెరిగిందంటే.. బిజినెస్
    Stock Market: రెండోరోజు ఫ్లాట్‌గానే.. దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బిజినెస్
    Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025