NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Minister Uttam: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు.. ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Minister Uttam: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు.. ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్ 
    ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్

    Minister Uttam: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు.. ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    01:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కృష్ణ ట్రిబ్యునల్ సంబంధిత వాదనలు గురువారం నుంచి రెండు రోజుల పాటు సుప్రీంకోర్టులో జరిగే అవకాశముంది.

    తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్వకేట్ జనరల్‌తో పాటు సుప్రీం కోర్టు న్యాయవాది వైద్యనాథన్‌ను సూచించారు.

    గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 299టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల కేటాయింపుకు అనుమతి తెలిపిందని,కానీ నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని మంత్రి వ్యాఖ్యానించారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని,కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అవసరాలకు తగిన విధంగా కేటాయింపులు మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

    మంత్రి ప్రకారం,తెలంగాణ సాగు విస్తీర్ణం,నీటి అవసరాలు అధికంగా ఉన్నందున మెజారిటీ నీటిని తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

    వివరాలు 

    72 టీఎంసీల వాటాలో కేవలం 40 టీఎంసీల నీరు 

    ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి రంగంపై తగిన ప్రాధాన్యత చూపలేదని విమర్శలు వచ్చాయి.

    అంతర్రాష్ట్ర జల వివాదాలు రాయలసీమ ప్రాంతంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని, ఈ విషయంలో సమర్ధంగా ముందుకు సాగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచనలు వచ్చాయి.

    తుంగభద్ర జలాశయం పూడికతో నిల్వ సామర్థ్యం తగ్గడం, కర్ణాటక వరస రిజర్వాయర్లు నిర్మించడం వల్ల ఆంధ్రప్రదేశ్ వాటా నీటిలో కోత ఏర్పడింది.

    72 టీఎంసీల వాటాలో కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే అందుతోందని పేర్కొనడం గమనార్హం.

    వివరాలు 

     2022లో అప్పర్ భద్ర ప్రాజెక్టు ప్రారంభమైంది

    జగన్ హయాంలో 2022లో అప్పర్ భద్ర ప్రాజెక్టు ప్రారంభమైంది, దీని సామర్థ్యం 29 టీఎంసీలుగా ఉంది.

    ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా లభించింది. అప్పర్ భద్ర ప్రాజెక్టు వ్యతిరేకంగా రాయలసీమలో ఆందోళనలు జరిగినా, జగన్ ప్రభుత్వం స్పందించలేదని విమర్శలు వచ్చాయి.

    గంగావతి తాలూకాలో నావళి వద్ద 31 టీఎంసీల సామర్థ్యంతో మరో ప్రాజెక్టు ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది.

    ఈ ప్రాజెక్టు కారణంగా తుంగభద్ర జలాశయ సామర్థ్యం మరింత తగ్గుతుందనే వాదనలు ఉన్నాయి.

    సుప్రీం కోర్టులో ఈ ప్రాజెక్టులపై విచారణ జరుగుతున్న సమయంలో అనుభవం కలిగిన న్యాయవాదిని నియమించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    వివరాలు 

    అంతర్రాష్ట్ర జల వివాదాలపై విశ్లేషించి నివేదిక

    కర్ణాటక వరద నీటిని రిజర్వాయర్ల ద్వారా నిల్వ చేసుకుంటున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ వాటాను రక్షించేందుకు నావళి ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.

    చంద్రబాబు నాయుడు నిర్వహించే సాగునీటి సమీక్ష సమావేశాల్లో ఇంజనీరింగ్ అధికారులు అంతర్రాష్ట్ర జల వివాదాలపై మున్ముందు తలెత్తే సమస్యలను విశ్లేషించి నివేదిక అందించాల్సిన బాధ్యత ఉందని సూచనలు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తమ్ కుమార్‌రెడ్డి

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    ఉత్తమ్ కుమార్‌రెడ్డి

    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌  మల్లికార్జున ఖర్గే
    Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    #TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే  తెలంగాణ
    Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025