NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన
    తదుపరి వార్తా కథనం
    Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన
    నేహా హిరేమత్​ దారుణ హత్యకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు

    Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన

    వ్రాసిన వారు Stalin
    Apr 20, 2024
    02:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక(Karnataka) కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది.

    ఈ హత్య ఘటన కాంగ్రెస్ (Congress), బీజేపీ (Bjp)ల మధ్య ఉప్పు నిప్పుగా మారింది.

    హుబ్బళి (Hubbali)లో కాంగ్రెస్ నేత కుమార్తెను ఆమె చదువుతున్న కళాశాల పూర్వ విద్యార్థి కత్తితో దారుణంగా పొడిచాడు.

    అతడి కోర్కెలను తిరస్కరించినందుకే ఆ యువతిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

    నేహా హిరేమత్ (Neha Hiremath) (23) ఓ కళాశాలలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి ఏడాది చదువుతోంది.

    అంతకుముందు అతడి క్లాస్ మేట్ అయిన ఫయాజ్ ఖోండు నాయక్ స్నేహంగా ఉండేవారు.

    ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని పోలీసుల విచారణలో తేలింది.

    Karnataka-Bjp Vs Congress

    దూరంగా పెట్టడంతోనే కక్ష పెంచుకున్న ఫయాజ్​...

    గత కొద్దికాలంగా ఫయాజ్ ను నేహా హిరేమత్ కు దూరంగా ఉంటోంది.

    దీంతో నేహాపై కక్ష పెంచుకున్న ఫయాజ్ ఆమెను కత్తితో ఏడుసార్లు దారుణంగా పొడిచి దారుణంగా హత్య (Murder) చేశాడు.

    ఇప్పుడు ఈ ఘటన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ వివాదంగా మారింది.

    నేహా హత్యను వ్యక్తిగత కోణంలో జరిగిన ఘటనగా కాంగ్రెస్ చెబుతుంటే బీజేపీ మాత్రం ఇందులో లవ్ జిహాద్ కోణం ఉందని ఆరోపిస్తోంది.

    కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించిపోయాయని బీజేపీ విమర్శిస్తోంది.

    కేంద్ర మంత్రి, ధార్వాడ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ జోషి కూడా నేహా హత్య వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    Neha Hiremath-Fayaz

    మైనారిటీ వర్గాలపై బుజ్జగింపు రాజకీయాలు ఆపాలి: ప్రహ్లాద్​ జోషి

    కేవలం మైనారిటీ వర్గాలపై బుజ్జగింపు రాజకీయాలు ఆపాలని, ఆ వర్గానికి ప్రత్యేకంగా చూడటం తగదని వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రహ్లాద్​ జోషి కోరారు.

    దీనికి రాష్ట్ర హోం శాఖ మంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ...నేహా హత్య ఘటనలో లవ్ జిహాద్ కోణం లేదని స్పష్టం చేశారు.

    అయితే బాలిక తండ్రి నిరంజన్ హిరేమత్ మాత్రం ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.

    తన కూతురుని ట్రాప్ చేసేందుకు ఫయాజ్ ప్రయత్నించాడని చెప్పారు.

    చాలా కాలంగా తన కూతురిని ఈ ముఠా వెంబడిస్తోందని ఆరోపించారు.

    నేహాను బెదిరించారని అయితే వారి బెదిరింపులకు తన కూతురు లొంగలేదని అందుకే ఆమెను హత్య చేశాడని తెలిపారు.

    Neha Hiremath Murder

    గవర్నర్​ పాలన పెట్టాలని బీజేపీ చూస్తోంది: డీకే శివకుమార్

    రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని, కర్ణాటకలో గవర్నర్ పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ సమాధానమిచ్చింది.

    "బీజేపీ మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది... కర్ణాటకలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి..

    బీజేపీ నేత ఆర్ అశోక రాష్ట్రాన్ని గవర్నరు పాలనలో ఉంచాలని చూస్తున్నారు, కానీ అది అసాధ్యమ''ని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

    ఇదిలా ఉండగా...హుబ్బళ్లిలోని విద్యానగర్‌ పోలీస్‌స్టేషన్‌ వెలుపల పెద్ద ఎత్తున హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు ఆందోళణ చేపట్టారు.

    ముస్లిం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, నేహా హత్యపై పలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మీడియాతో మాట్లాడుతున్న నిరంజన్​ హిరేమత్

    Love jihad spreading, take care of your girls: K’taka Cong Corporator and father of murder victim pic.twitter.com/i6eXX5Jjom

    — IANS (@ians_india) April 19, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    హత్య
    కాంగ్రెస్
    బీజేపీ

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    కర్ణాటక

    మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం  హెచ్‌డీ కుమారస్వామి
    Karanataka: అమానవీయం.. దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయించిన ప్రిన్సిపల్ సిద్ధరామయ్య
    KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ సిద్ధరామయ్య
    Hijab ban row: కర్ణాటకలో నేటి నుంచి హిజాబ్ ధరించొచ్చు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు  సిద్ధరామయ్య

    హత్య

    UttarPradesh : యూపీలో ఘోరం.. 6నెలల్లో 9మంది మహిళల వరుస హత్య ఉత్తర్‌ప్రదేశ్
    ప్రియురాలిని గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని ఏం చేశాడంటే?  చెన్నై
    Karni Sena: కర్ణి సేన అధినేతను హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపు  రాజస్థాన్
    Karni Sena chief's murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్  రాజస్థాన్

    కాంగ్రెస్

    Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలోకి అధీర్ రంజన్?  భారతదేశం
    Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత  కర్ణాటక
    Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు బ్రిటన్

    బీజేపీ

    PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు  జేపీ నడ్డా
    Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్  చండీగఢ్
    Assam CM to Basara: బాసరకు అస్సాం సీఎం.. విజయ సంకల్ప రథయాత్రలకు శ్రీకారం హిమంత బిస్వా శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025