NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
    తదుపరి వార్తా కథనం
    బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
    వచ్చే 3 రోజులూ అలెర్ట్

    బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 12, 2023
    04:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిపోర్‌జాయ్‌ తుపాను అతి తీవ్ర రూపం దాల్చుతూ పెను ముప్పుగా రూపాంతరం చెందుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తుపాను గుజరాత్ వైపే దూసుకెళ్తోంది. ఈ మేరకు భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

    మరో 36 గంటల్లో తుపాను మరింత బలపడనుంది. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని కచ్‌, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15న తీరాన్ని దాటనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా గుజరాత్‌ సహా పలు తీర ప్రాంత రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

    ఈ నేపథ్యంలోనే బిపోర్‌జాయ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ సోమవారం హై లెవల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలిచ్చారు.

    DETAILS

    ముందస్తుగానే తీరప్రాంతాల ప్రజలు పునరావాసాలకు తరలింపు

    సమీక్షలో భాగంగా బిపోర్ జాయ్ తుపాను తాజా పరిస్థితి, ముందస్తు సహాయక చర్యలు, తుఫాన్ ముప్పు ప్రాంతాలపై నిఘా వివరాలను మోదీ ఆరా తీశారు. 3 రోజులూ అధికారులు నిరంతరం అలెర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు.

    వివిధ రకాల సహాయక చర్యలపై ప్రణాళికను ముందస్తుగానే ప్రారంభించాలన్నారు. తీర ప్రాంతంలోని ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని, ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల జనాలను సురక్షిత ప్రాంతాలకు ముందే తరలించాలని ఆదేశించారు.

    గుజరాత్‌, ముంబయి తీరంలో అలల ఉద్ధృతిని బిపోర్‌జాయ్ తుఫాన్ పెంచనుందని వాతావరణ రిపోర్ట్ చెబుతోంది. జూన్ 15 వరకు మత్స్యకారులు ఎట్టిపరిస్థిల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లకూడదంటూ అధికారులు ప్రకటించారు.

    DETAILS

    గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్​ లో ఎల్లో అలెర్ట్ 

    గుజరాత్ సహా అరేబియన్ తీర ప్రాంతాలు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్​లోని ఫిషర్మెన్ కమ్యూనిటీస్ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    తుపాను ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయా ప్రజలను ముందస్తుగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని గుజరాత్ అధికారులు స్పష్టం చేశారు.

    బిపోర్‌జాయ్ తుపాను :

    మధ్య అరేబియా సముద్రంలో పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతికి 480 కిలోమీటర్ల దూరంలో,

    ద్వారకకు దక్షిణ-నైరుతిగా 530 కిలోమీటర్ల దూరంలో,

    కచ్‌లోని నలియాకు దక్షిణ-నైరుతికి 610 కిలోమీటర్ల దూరంలో,

    పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణాన 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ
    తుపాను

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    ప్రధాన మంత్రి

    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ పాకిస్థాన్
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  రాహుల్ గాంధీ

    నరేంద్ర మోదీ

    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  ప్రధాన మంత్రి
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం  ప్రధాన మంత్రి
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ

    తుపాను

    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు తాజా వార్తలు
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025