NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్​ 
    తదుపరి వార్తా కథనం
    KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్​ 
    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

    KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్​ 

    వ్రాసిన వారు Stalin
    May 11, 2024
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్నికల పోలింగ్​ సమీపిస్తున్న వేళ బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

    కేంద్రంలో ఎన్డీఏ గానీ లేదా ఇండియా కూటమి గాని కేవలం ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు.

    తెలంగాణ లో బీఆర్​ఎస్​ పార్టీ అత్యధిక పార్లమెంట్​ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

    బీఆర్​ ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్​ రావు తరఫున కేసీఆర్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

    ఎన్నికల ఫలితాల తర్వాత ఈసారి దేశంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుందన్నారు.

    బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి గానీ, కాంగ్రెస్​ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిగానీ ప్రాంతీయ పార్టీల మద్దతు ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయని చెప్పారు.

    KCR-Election Campaign:

    హామీల అమలులో కాంగ్రెస్​ పూర్తిగా విఫలమైంది: కేసీఆర్​ 

    కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుందని తెలిపారు.

    రాష్ట్రంలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ వాటి అమలులో ఘోరంగా విఫలమైందని కేసీఆర్​ మండిపడ్డారు.

    కేవలం నాలుగు నెలల్లోనే రేవంత్​ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు.

    మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హామీ ఓ పెద్ద జోక్​ గా అభివర్ణించారు.

    బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారని, ఆటోడ్రైవర్లకు ఉపాధిలేక రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని వివరించారు.

    బీఆర్​ ఎస్​ పదేళ్ల పాలనలో రైతుల్లో ఆత్మవిశ్వాసం, సంతోషం వెల్లివిరిసిందని గుర్తు చేశారు.

    కాంగ్రెస్​ పాలనలో రైతుల్లో కన్నీళ్లుకనిపిస్తున్నాయని, ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఊగిపోతున్నారని కేసీఆర్​ చెప్పారు.

    KCR-Election Campaign

    అవకాశ వాద నేతలు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు

    అవకాశ వాద నేతలు మాత్రమే తమ పార్టీనుంచి బయటకు వెళ్లిపోయారని తెలిపారు.

    రాజకీయాల్లో ఇవి సాధారణమైపోయాయన్నారు.

    ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ అటువంటి పొద్దు తిరుగుడు పువ్వులాంటి నేతలు ఉన్నారని తెలిపారు.

    బీజేపీకి తెలంగాణలో సీట్లు ఒకటి కంటే ఎక్కువ రావన్నారు.

    ప్రధాని మోదీ తన ప్రజాకర్షణను కోల్పోయారని పేర్కొన్నారు.

    గతంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనమైపోయిందని, రైతులతోపాటు ఇతర వర్గాలు కూడా మోదీ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

    మోదీ విధాన పర నిర్ణయాలను వ్యతిరేకించిన తొలి సీఎంని తానేనని అందుకే తమను అణిచివేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.

    సంబంధంలేని కేసులో కవితను ఇరికించారని తెలిపారు.

    త్వరలోనే తన కుమార్తెకు కూడా బెయిల్​ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్
    నరేంద్ర మోదీ
    రైతుబంధు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు  తెలంగాణ
    తెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ తెలంగాణ
    TELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణ
    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    బీఆర్ఎస్

    KTR: కర్ణాటక నుండి తెలంగాణకు కాంగ్రెస్ కరెన్సీ కట్టలు.. కేటీఆర్ ట్వీట్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    Ponnala : పొన్నాలకు తెరుచుకున్న బీఆర్ఎస్ తలుపులు.. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    BRS Manifesto : నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్.. అభ్యర్థులకు బీఫామ్ ల అందజేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    CM KCR: ఎమ్మెల్యేనే ఫైన‌ల్ కాదు.. ఎన్నో అవ‌కాశాలు ఉంటాయి: సీఎం కేసీఆర్ తెలంగాణ

    నరేంద్ర మోదీ

    DRDO 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు  రక్షణ
    India- China: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్ చైనా
    PM-SURAJ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    PM Modi: తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్: ప్రధాని మోదీ  బీజేపీ

    రైతుబంధు

    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు తెలంగాణ
    Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం  తాజా వార్తలు
    Congress: రైతుబంధు నిధులను దారి మళ్లించకుండా చర్యలు తీసుకోండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు తాజా వార్తలు
    Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025