NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు
    ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు

    Andhrapradesh: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 29, 2025
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చింది.

    రాష్ట్రంలోని వివిధ పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.1,067 కోట్లను మంజూరు చేసింది.

    ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.

    యూఐడీఎఫ్ (Urban Infrastructure Development Fund) కింద ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.

    తొలుత రాష్ట్రం తరఫున 49 పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.422.36 కోట్లు మాత్రమే కేటాయించగా, కేంద్రంతో అనుసంధానం ద్వారా నిధులు పెంచి చివరికి 40 ప్రాజెక్టులకు మొత్తం రూ.1,067 కోట్లు కేటాయించేలా మార్పులు చేశామని చెప్పారు.

    వివరాలు 

    నెల్లూరు-బద్వేలు కారిడార్‌కు ఆమోదం - అభివృద్ధికి మరో ముందడుగు 

    ఇక నెల్లూరు నుంచి బద్వేలు వరకు 108 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న కారిడార్‌కు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది.

    ఈ కారిడార్ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఉపకారం చేస్తుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

    ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, నాలుగు లైన్ల బద్వేలు-నెల్లూరు కారిడార్‌కు కేంద్రం ఆమోదం ఇవ్వడం రాష్ట్రానికి అభివృద్ధి దిశగా కీలక అడుగు అని అన్నారు.

    ఈ కారిడార్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు అందుతాయని తెలిపారు.

    ప్రాజెక్టు మంజూరుకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    వివరాలు 

    పవన్ కళ్యాణ్,పురందేశ్వరి స్పందన 

    ఈ నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టు మంజూరుపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

    కృష్ణపట్నం పోర్ట్‌కు దూరం 33.9 కిలోమీటర్లు తగ్గడం వల్ల పరిశ్రమల అనుసంధానానికి ఇది ఎంతో ఉపయుక్తమవుతుందని పేర్కొన్నారు.

    ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు.

    ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో,రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ పురందేశ్వరి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    జగన్‌కు కేంద్ర పథకాలను వాడుకోవడం చేతకాలేదు:పెమ్మసాని

    కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి కేంద్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయిందని విమర్శించారు.

    మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగినట్లు తెలిపారు.ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు రాబడుతున్నాయని అన్నారు.

    పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు కేంద్రంలో చాలా కష్టపడ్డారని.. రైల్వే ప్రాజెక్టులకు ఈ ఏడాది రూ.9 వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.

    అమరావతి రింగురోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనను చంద్రబాబు కేంద్రానికి సమర్పించారని, ప్రతి నియోజకవర్గానికి రూ.20 కోట్లు కేటాయించి సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.

    రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని కేంద్ర నిధులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhrapradesh: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు ఆంధ్రప్రదేశ్
    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల అరెస్టు.. గ్రెనేడ్‌లు,మందుగుండు సామగ్రి స్వాధీనం జమ్ముకశ్మీర్
    Bakrid 2025: ధూల్ హిజ్జా ప్రారంభం.. బక్రీద్ పండుగ తేదీ ఖరారు! పండగ
    Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800 స్టాక్ మార్కెట్

    ఆంధ్రప్రదేశ్

     New Flight Services: విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు.. జూన్ 1 నుంచి సేవలు ప్రారంభం భారతదేశం
    Andhra Pradesh: బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా
    LG: ఆంధ్రప్రదేశ్‌లో ₹5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎల్జి.. 11,000+ వేల పరోక్ష ఉద్యోగాలు  బిజినెస్
    APSSC : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం.. ధాత్రి మధుకు 14రోజుల రిమాండ్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025