NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Terror Attack: టెర్రరిస్ట్‌ల దెబ్బకు.. సైనికులను చూసి ఉగ్రవాదులుగా భయపడ్డ టూరిస్ట్‌లు.. వీడియో
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Terror Attack: టెర్రరిస్ట్‌ల దెబ్బకు.. సైనికులను చూసి ఉగ్రవాదులుగా భయపడ్డ టూరిస్ట్‌లు.. వీడియో
    టెర్రరిస్ట్‌ల దెబ్బకు.. సైనికులను చూసి ఉగ్రవాదులుగా భయపడ్డ టూరిస్ట్‌లు.. వీడియో

    Terror Attack: టెర్రరిస్ట్‌ల దెబ్బకు.. సైనికులను చూసి ఉగ్రవాదులుగా భయపడ్డ టూరిస్ట్‌లు.. వీడియో

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో కొంతమంది పర్యాటకులు తీవ్ర భయంతో వణికిపోవడంతో, కొందరు కొండలపై, గుట్టల్లో పరిగెత్తి కుప్పకూలిపోయారు.

    ఈ సమయంలో వారు తమ కుటుంబ సభ్యులు, భర్తలు, పిల్లలు, తోబుట్టువులు, స్నేహితులను కోల్పోయిన బాధతో గుండెలవిసేలా ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ హృదయ విదారకమైన దృశ్యాలను చూసి, వారిని కాపాడటానికి వచ్చిన భారత సైనికులను కూడా చూసి వారు భయాందోళనకు గురయ్యారు.

    సైనికులను ఉగ్రవాదులు అనుకుని "మమ్మల్ని చంపొద్దు, దయచేసి!" అని వారిని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

    వివరాలు 

    మీరు భయపడాల్సిన అవసరం లేదు..

    భయంతో వణికిపోతున్న పర్యాటకులకు సైనికులు ధైర్యం చెప్పుతూ, "మేము మిమ్మల్ని కాపాడటానికి వచ్చాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు" అని తెలిపారు.

    ఈ వీడియోలో ఇదే ప్రతిధ్వనిస్తుంది. బైసరన్ లోయలో ఉన్న ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో రావడం, విచక్షణారహితంగా కాల్పులు జరపడం గుర్తించారు.

    హనీమూన్ కోసం వచ్చి, పెళ్లైన ఐదు రోజులకే నవ వధువు తన భర్తను కోల్పోయింది.

    ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

    सुबह उठते ही ये क्लिप देखी
    आँसू आ गए ...
    सरकार से निवेदन है कठोरतम कार्यवाही करे । स्थानीय सहायता के बिना ये हमला नहीं किया जा सकता था । #PahalgamTerroristAttack pic.twitter.com/QEduiPMOjN

    — V A S H I S T H A (@sushilvashisth) April 23, 2025

    వివరాలు 

    దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు

    పహల్గాంలో జరిగిన ఈ కాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

    హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే మనీష్ రంజన్, విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి చనిపోయారు.

    చంద్రమౌళి పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు, ఉగ్రవాదులు అతన్ని వెంబడించి కాల్పులు జరిపి హత్య చేశారంటూ సమాచారం అందింది.

    చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కాగా, ఆయన కుటుంబసభ్యులు కశ్మీర్‌కి బయలుదేరినట్టు తెలిసింది.

    ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

    పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ "లష్కరే తొయిబా" అనుబంధ సంస్థ "ది రెసిస్టెంట్ ఫ్రంట్" ఈ దాడికి బాధ్యులమని ప్రకటించింది.

    వివరాలు 

    భద్రతా వ్యవహరాల కమిటీ అత్యవసర సమావేశం

    13 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

    ఉగ్రవాదంపై పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

    పహల్గాంలోని పర్యాటకులే ఉగ్రవాదుల దాడికి లక్ష్యమయ్యారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలోని పర్యటనను అర్ధాంతరంగా ముగించి బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.

    విమానాశ్రయంలో ఉన్నతాధికారులతో ఈ ఘటనపై చర్చలు జరిపారు. బుధవారం ఉదయం, ప్రధాన మంత్రి అధ్యక్షతన భద్రతా వ్యవహరాల కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది.

    వివరాలు 

    పాకిస్థాన్ యుద్ధ విమానాలను సరిహద్దుల వైపు

    మరోవైపు, పాకిస్థాన్ సరిహద్దుల్లో అప్రమత్తమైనట్టు సమాచారం.

    ఈ ఉగ్రదాడి తరువాత 2019 పుల్వామా దాడి తరహాలో భారత్ మరోసారి దాడులు చేయాలనే అవకాశం ఉందని పాకిస్థాన్ భావిస్తున్నట్టు సమాచారం.

    అందుకే, పాకిస్థాన్ యుద్ధ విమానాలను సరిహద్దుల వైపు తరలించినట్టు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    జమ్ముకశ్మీర్

    Jammu Kashmir: లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి భారతదేశం
    Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్  భారతదేశం
    Snowfall: జమ్ముకశ్మీర్‌లో హిమపాతం వల్ల రవాణా సమస్యలు.. నిలిచిపోయిన 2వేల వాహనాలు శ్రీనగర్
    Heavy Snowfall: జమ్మూ కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యూనివర్సిటీ పరీక్షలు వాయిదా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025