NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #NewsBytesExplainer: తిరుగు ప్రయాణం మొదలెట్టిన పర్యాటకులు.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగ భవితవ్యం ఏమిటి?
    తదుపరి వార్తా కథనం
    #NewsBytesExplainer: తిరుగు ప్రయాణం మొదలెట్టిన పర్యాటకులు.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగ భవితవ్యం ఏమిటి?
    జమ్ముకశ్మీర్ పర్యాటక రంగ భవితవ్యం ఏమిటి?

    #NewsBytesExplainer: తిరుగు ప్రయాణం మొదలెట్టిన పర్యాటకులు.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగ భవితవ్యం ఏమిటి?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

    ఈ దాడి నేపథ్యంలో ఆ ప్రాంతమంతటా భయభ్రాంతులు నెలకొన్నాయి.

    ఈ ఘటనతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తిరిగి వెనుదిరుగుతున్నారు. శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకోవడానికి టాక్సీలు వరుసగా చేరుతుండగా, హైవే మార్గాల్లో పర్యాటకులను తీసుకెళ్తున్న వాహనాలు పెరిగాయి.

    జమ్ము కశ్మీర్‌లో గతంలో హింసాత్మక ఘటనలు అనేకం జరిగినా, పర్యాటకులపై దాడులు మాత్రం అరుదుగా జరిగాయి.

    ఈ దాడి సాధారణ పౌరులపై జరిగిన దాడుల్లో అత్యంత దారుణమైనదిగా నిలిచిందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.

    వివరాలు 

    పర్యాటకం జమ్ము కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన శక్తి

    1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కశ్మీర్ అంశంపై భారత్, పాకిస్థాన్ రెండు యుద్ధాలు చేశాయి.

    1980లు, 1990లలో భారత పాలనకు వ్యతిరేకంగా కశ్మీర్‌లో విప్లవాత్మక భావాలు చెలరేగాయి.

    ఈ తిరుగుబాటుకు పాకిస్తాన్ ఆర్థిక మద్దతు ఇస్తోందని భారత్ ఆరోపించింది. ఈ కాలంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

    అయితే ఇటీవలి కాలంలో హింస స్థాయిలో తగ్గుదల కనిపించిందని భారత ప్రభుత్వం చెబుతోంది.

    "2004-2014 మధ్య 7,217 ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకోగా, 2014-2024 మధ్య అవి 2,242కి తగ్గాయి," అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో తెలిపారు.

    పర్యాటకం జమ్ము కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన శక్తిగా నిలుస్తూ, గత కొద్ది కాలంగా మళ్లీ పుంజుకుంటోంది.

    వివరాలు 

    2023లో మొత్తం 2 కోట్ల మంది పర్యాటకులు

    2023లో మొత్తం 2 కోట్ల మంది పర్యాటకులు జమ్ము కశ్మీర్‌కి వచ్చారని పర్యాటక శాఖ తెలిపింది. ఇది కోవిడ్‌కు ముందు కాలంతో పోలిస్తే 20% అధికం.

    అయితే తాజా ఉగ్రదాడి ఈ పునరుద్ధరణకి పెద్ద ఆటంకంగా మారే అవకాశముంది.

    "ఇప్పుడంతా అయిపోయింది. కన్నీళ్లు ఆగడం లేదు," అని పహల్గాంలో శాలువాలు అమ్ముకునే షకీల్ అహ్మద్ బాధతో అన్నారు.

    "మా జీవనోపాధి పూర్తిగా పర్యాటకులపై ఆధారపడి ఉంది. బ్యాంకు నుంచి అప్పు తీసుకుని వ్యాపారం ప్రారంభించాను. కానీ ఇప్పుడు ఎవరూ కొనుగోలు చేయడం లేదు," అని ఆవేదన వ్యక్తం చేశారు.

    "ఈ దాడి పాశవికమైనది,కశ్మీర్ పర్యాటక రంగానికి చెడ్డ వార్త,"అని స్థానిక హోటల్‌ యజమాని జావెద్ అహ్మద్ వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    ఫోన్ ద్వారా హోటల్ బుకింగ్స్‌రద్దు

    ఆయన హోటల్‌లో జూన్ వరకు బుకింగ్స్ ఉండగా, ఇప్పుడు పర్యాటకులు రద్దు చేసుకుంటూ వెళ్లిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    వేసవి సెలవులలో కశ్మీర్ పర్యాటకానికి ముఖ్యమైన సీజన్. దేశమంతా పాఠశాలలకు సెలవులు ఉన్న కారణంగా కుటుంబాలతో ఇక్కడకు ప్రయాణిస్తారు.

    కానీ ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీనగర్ నగరంలో పర్యాటకులు భయభ్రాంతులకు లోనవుతుండగా, త్వరలో రావాలనుకున్న వారు మానుకుంటున్నట్లు తెలుస్తోంది.

    "ఫోన్ ద్వారా బుకింగ్స్‌ను రద్దు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది," అని ముంబై కేంద్రంగా టూర్స్ నిర్వహించే అభిషేక్ హాలిడేస్ అధిపతి అభిషేక్ సంసారే తెలిపారు.

    వివరాలు 

    కశ్మీరీలు నిరసన ప్రదర్శనలు

    ఈదాడిని ప్రపంచ దేశాల నేతలు ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

    బాధితులకు న్యాయం చేయాలంటూ కశ్మీరీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

    ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహించిందిగా ఏ ఉగ్రవాద సంస్థ ముందుకు రాలేదు.

    అయితే పాకిస్తాన్ ప్రమేయముందన్న ఆరోపణలను ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ఖండించారు.

    ఈదాడులు భారత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు.

    పహల్గాం లైన్ ఆఫ్ కంట్రోల్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది.

    వివరాలు 

    రూ. 6,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ 

    2023లో జీ20 టూరిజం వర్క్‌షాప్ గ్రూప్ సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించారు.ఈ సమావేశానికి అనేక మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు.

    2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్‌ను సందర్శించి, వ్యవసాయం, పర్యాటక రంగాలకు సంబంధించిన రూ. 6,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

    "ఆర్టికల్ 370 తొలగించడంతో జమ్ము కశ్మీర్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతం స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటోంది," అని ప్రధాని అన్నారు.

    ప్రత్యేక ప్రతిపత్తి రద్దయిన తర్వాత పర్యాటకుల సంఖ్య పెరగడం పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

    "పర్యాటకం అంటే శాంతి పరిస్థితికి సంకేతం.శాంతి అంటే భయం లేకపోవడం,ఉగ్రవాదం లేకపోవడం.ప్రజాస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది,"అని 2022లో ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    సినిమాలకు అద్భుతమైన లొకేషన్

    ఆయన 2024లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

    పహల్గాం దాడిపై స్పందిస్తూ ఎక్స్‌లో ఆయన, "ఉగ్రదాడి కారణంగా పర్యాటకులు కశ్మీర్ నుంచి వెళ్తుండటం హృదయాన్ని కలిచివేస్తోంది" అని పేర్కొన్నారు.

    పహల్గాం పచ్చిక బయళ్లతో, ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందింది. ఇది సినిమాలకు అద్భుతమైన లొకేషన్.

    సాధారణంగా హింసాత్మక ఘటనలు తక్కువగా జరుగుతాయి. అయినా మంగళవారం జరిగిన దాడి ప్రజలను షాక్‌కు గురిచేసింది.

    వివరాలు 

    అప్పుడు కూడా శాంతి లేదు 

    "ఇప్పుడైనా దేశం మొత్తం కశ్మీర్‌లో నిజమైన పరిస్థితిని గుర్తించాలి," అని కశ్మీర్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన మెహబూబ్ హుస్సేన్ మీర్ తెలిపారు.

    "ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడానికి ముందు, తొలగించిన తర్వాత కూడా ఇక్కడ శాంతి లేనేలేదు. దీని మూలంగా స్థానికులే బాధపడుతున్నారు. ప్రభుత్వం దీని పరిష్కారానికి కార్యాచరణ తీసుకోకపోతే, మా జీవితం ప్రమాదంలో పడుతూనే ఉంటుంది," అని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం
    జమ్ముకశ్మీర్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పర్యాటకం

    Nasik: నాసిక్ లో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు  లైఫ్-స్టైల్
    #Newbytesexplainer: డార్క్ టూరిజం అంటే ఏమిటి?.. వాయనాడ్ కొండచరియలు విరిగిపడటం కేసుకు సంబంధం ఏమిటి? భారతదేశం
    Water Fall In Rishikesh: భారతదేశంలో ఉన్న ఈ రహస్య జలపాతం గురించి మీకు తెలుసా..? ఉత్తరాఖండ్
    Laknavaram Lake: పర్యాటకులను ఆకర్షిస్తున్న లక్నవరం సరస్సు.. మీరు ఓ లుక్కేయండి.. తెలంగాణ

    జమ్ముకశ్మీర్

    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..ఏడుగురు ఉగ్రవాదులు హతం భారతదేశం
    Omar Abdullah: కొట్టుకుంటూ ఉండండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు ఒమర్ అబ్దుల్లా
    LOC : ఎల్ఓసీ వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఐదుగురు సైనికులు మృతి ఆర్మీ
    Karnataka: కర్ణాటక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌.. కాశ్మీరీ విద్యార్థిని కొట్టిన సీనియర్లు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025