NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ISRO: దేశ భద్రత కోసం రానున్న మూడేళ్లలో మరో 150 ఉపగ్రహాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    ISRO: దేశ భద్రత కోసం రానున్న మూడేళ్లలో మరో 150 ఉపగ్రహాలు 
    ISRO: దేశ భద్రత కోసం రానున్న మూడేళ్లలో మరో 150 ఉపగ్రహాలు

    ISRO: దేశ భద్రత కోసం రానున్న మూడేళ్లలో మరో 150 ఉపగ్రహాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాబోయే మూడు సంవత్సరాల్లో 100 నుండి 150 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోందని సంస్థ చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.

    ప్రస్తుతం భారత్‌కు సేవలందిస్తున్న 55 ఉపగ్రహాలు దేశ సరిహద్దులు,సుమారు 7500 కిలోమీటర్ల తీరప్రాంతంపై పర్యవేక్షణ కోసం పూర్తిగా సరిపోవని చెప్పారు.

    అయితే, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా అంతరిక్ష పరిశోధన,శాటిలైట్ డిజైన్, ప్రయోగాలలో ప్రైవేటు రంగం మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

    ఆయన ఈ వ్యాఖ్యలు స్థానిక కావేరీ ఆసుపత్రిలో జరిగిన ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థ ప్రారంభ కార్యక్రమంలో వెల్లడించారు.

    వివరాలు 

    శాటిలైట్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా..

    ఇస్రో ప్రస్తుత ప్రాజెక్టుల గురించి కూడా నారాయణన్ వివరించారు.శాటిలైట్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్లు గుర్తుచేశారు.

    ఈ సాంకేతికతను ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే సాధించగా, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరినట్లు చెప్పారు.

    వాతావరణ మార్పులపై లోతైన అధ్యయనం కోసం ఒక ప్రత్యేక ఉపగ్రహాన్ని డిజైన్ చేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారని తెలిపారు.

    ఈ ఉపగ్రహం ప్రధానంగా జీ20 దేశాల అవసరాల నిమిత్తం రూపొందించబడుతుందని, దాని రూపకల్పనలో 50 శాతం వరకు భారత్ భాగస్వామి కాగా, మిగిలిన భాగంలో ఇతర జీ20 దేశాలు కూడా సహకరిస్తాయని పేర్కొన్నారు.

    వివరాలు 

    మంగళ్‌యాన్-2 పేరిట మరో ప్రత్యేక మిషన్‌

    ఉపగ్రహ ప్రయోగాలకు తోడు, మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు గగన్‌యాన్ మిషన్‌పై ఇస్రో దృష్టిసారించిందన్న విషయం తెలిసిందే.

    చంద్రుడి ఉపరితలంపై మరింత పరిశోధనలు జరిపేందుకు చంద్రయాన్ 4 మిషన్ కోసం ఏర్పాట్లు జరుపుతున్నట్లు వెల్లడించారు.

    అలాగే శుక్రగ్రహ వాతావరణం,ఉపరితల లక్షణాలపై అధ్యయనం చేయడానికి శుక్రయాన్ మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి.

    అంతేగాక, అరుణ గ్రహాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు మంగళ్‌యాన్-2 పేరిట మరో ప్రత్యేక మిషన్‌కు కూడా ఇస్రో సిద్ధమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఇస్రో

    ISRO Chief: సోమనాథ్ కీలక ప్రకటన.. 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4 లాంచ్ టెక్నాలజీ
    Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్ ఆలస్యం.. కొత్త గడువు తేదీ ఎప్పుడో చెప్పిన ఇస్రో చీఫ్  చంద్రయాన్ 4
    Matsya-6000: సముద్రతలంలో 6,000 మీటర్ల లోతుకు ప్రయాణించే 'మత్స్య-6000'.. భారత్‌ ప్రగతిలో మరో ముందడుగు అంతరిక్షం
    Gaganyaan mission: గగనయాన్ మిషన్‌ వాయిదా.. కారణమిదే! అంతరిక్షం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025