Page Loader
ICC Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. కోహ్లీని అధిగమించిన రిషభ్‌ పంత్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. కోహ్లీని అధిగమించిన రిషభ్‌ పంత్

ICC Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. కోహ్లీని అధిగమించిన రిషభ్‌ పంత్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2024
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టుల్లో టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్ తన దూకుడైన ఆటతీరుతో మెప్పిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అనంతరం చాలా నెల్లల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న అతడు,తన పునరాగమనంలోనూ అద్భుత ప్రదర్శన అందిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో, పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు చేసి సెంచరీకి త్రుటిలో మిస్‌ అయ్యాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాటు, పంత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఆయన మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు, కాగా విరాట్ కోహ్లీ ఒక స్థానంలో దిగజారి ఎనిమిది స్థానంలో ఉన్నాడు.

వివరాలు 

 19వ స్థానానికి శుభ్‌మన్ గిల్..

యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి శ్రీలంక బ్యాటర్ కరుణరత్నెతో కలిసి 15వ స్థానాన్ని పంచుకుంటున్నాడు. శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు దిగజారి 19వ స్థానానికి చేరుకున్నాడు. బెంగళూరులో జరిగిన టెస్టులో భారత్‌పై శతకం బాదిన న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 36 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసిన డేవాన్ కాన్వే 12 స్థానాలు మెరుగుపరచుకొని 36వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

వివరాలు 

అగ్రస్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా..

టీమిండియాపై మొదటి టెస్టులో ఎనిమిది వికెట్లు పడగొట్టిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ రెండు స్థానాలు మెరుగుపరచుకొని తొమ్మిదో స్థానంలో నిలిచి, కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్నాడు. బ్యాటర్ల జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్, బౌలర్ల జాబితాలో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.