NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / China: హిందూ మహాసముద్రం భద్రతపై ఆందోళన పెరిగిన వేళ.. పాక్ తో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న చైనా
    తదుపరి వార్తా కథనం
    China: హిందూ మహాసముద్రం భద్రతపై ఆందోళన పెరిగిన వేళ.. పాక్ తో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న చైనా
    హిందూ మహాసముద్రం భద్రతపై ఆందోళన పెరిగిన వేళ.. పాక్ తో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న చైనా

    China: హిందూ మహాసముద్రం భద్రతపై ఆందోళన పెరిగిన వేళ.. పాక్ తో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న చైనా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 10, 2025
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ (Pakistan) నిర్వహిస్తున్న అమన్‌-2025 యుద్ధ విన్యాసాల్లో తాజాగా చైనా (China) కూడా భాగస్వామి అయింది.

    హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావం పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

    ఫిబ్రవరి 7-12 మధ్య జరుగుతున్న ఈ విన్యాసాల్లో మొత్తం 32 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో అమెరికా, జపాన్‌, ఇటలీ, మలేషియా వంటి దేశాలతో పాటు చైనా కూడా ఉంది.

    ఈ విన్యాసాల్లో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీకి చెందిన గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌,హెలికాప్టర్‌, మెరైన్‌ దళాలు పాల్గొన్నాయి.

    అంతేకాక,చైనా సీనియర్‌ మిలిటరీ అధికారులు కూడా హాజరయ్యారు.

    హిందూ మహాసముద్రంలో దొంగిలింపులు అరికట్టడం,సముద్ర మార్గాల భద్రతను మెరుగుపర్చడం వంటి కార్యక్రమాలకు ఈ విన్యాసాలు తోడ్పడతాయని అధికారులు తెలిపారు.

    వివరాలు 

    అరేబియా సముద్రంలో చైనాకు చెందిన రెండు భారీ నౌకలు

    ఇటీవలే,మత్స్య పరిశోధన పేరుతో చైనాకు చెందిన రెండు భారీనౌకలు అరేబియా సముద్రంలో ప్రవేశించాయి.

    వీటిని లాన్‌హై 101,లాన్‌హై 201గా గుర్తించారు.ఈఅంశాన్ని ఓపెన్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుడు డామియన్‌ సైమన్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు.

    మాల్దీవుల్లోని చైనా అనుకూల ప్రభుత్వ అనుమతితోనే ఈనౌకలు అక్కడకి వెళ్లినట్లు సమాచారం.

    నిపుణుల అభిప్రాయానికి అనుసరించి,మారిటైమ్‌ ఇంటెలిజెన్స్‌ సేకరణ కోసమే బీజింగ్‌ వీటిని పంపినట్లు అనుమానిస్తున్నారు.

    ఈ నౌకలు మత్స్యకారుల బోట్ల ద్వారా మిలిటరీకి అవసరమైన సమాచారాన్నిసేకరిస్తున్నట్లు భావిస్తున్నారు.

    లాన్‌హై 101 నౌకలో అండర్‌ వాటర్‌ డ్రోన్లు,రిమోట్‌ వెస్సల్స్‌ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

    ఇవి సముద్ర గర్భాన్ని మ్యాపింగ్‌ చేసే సామర్థ్యం కలిగినవని చెబుతున్నారు.ఇప్పటికే చైనా ఫిషింగ్‌ బోట్ల ప్రవేశాన్ని నిరోధించాలని పాకిస్తాన్‌,శ్రీలంకల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    పాకిస్థాన్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    చైనా

    India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ రాజ్‌నాథ్ సింగ్
    China: చైనాలో ఉన్మాది కత్తితో దాడి.. ఎనిమిది మంది మృతి ప్రపంచం
    Jaishankar: బ్రెజిల్‌ వేదికగా భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు భేటీ  బ్రెజిల్
    Maharaja: చైనాలో సందడి చేసేందుకు సిద్ధమైన 'మహారాజ'.. 40,000 స్క్రీన్‌లలో గ్రాండ్ రిలీజ్ కోలీవుడ్

    పాకిస్థాన్

    Imran Khan: సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదైన కేసులో.. పాకిస్థాన్‌ మాజీ ప్రధానికి ఊరట..  ఇమ్రాన్ ఖాన్
    Champions Trophy: నవంబర్ 16 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్‌ కవ్వింపు చర్యలు! క్రీడలు
    Champions Trophy tour: పీఓకేలో ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ రద్దు.. కారణం ఏంటంటే? ఐసీసీ
    Imsha Rehman: పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025