NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే 
    తదుపరి వార్తా కథనం
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే 
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే

    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే 

    వ్రాసిన వారు Stalin
    Jun 03, 2023
    09:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

    ఈ ప్రమాదంలో ఇప్పటికే 230కి పైగా మరణాలు, 900మందికి పైగా గాయాలైనట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

    ఇటీవల కాలంలో ఇంతటి భారీ రైలు ప్రమాదం జరగలేదు.

    భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.

    ఇదే సమయంలో దేశ చరిత్రలో జరిగిన భారీ రైలు ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    రైలు

    ఎక్కువ మంది చనిపోయింది భాగమతి నదిపై జరిగిన ప్రమాదంలోనే

    జూన్ 6, 1981: దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం బిహార్‌లో జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పి భాగమతి నదిలో పడిపోయింది.

    ఈ ప్రమాదంలో 750మంది చనిపోయారు. దేశంలోని రైలు ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణించిన ఘటన ఇదే.

    డిసెంబర్ 23, 1964: తమిళనాడులో రామేశ్వరం తుపాను విధ్వంసం సృష్టించింది. ఈ తుపాను కారణంగా పాంబన్ నుంచి ధనుష్కోడి మధ్య నడిచే ప్యాసింజర్ రైలు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 126మంది ప్రయాణికులు మరణించారు.

    ఆగస్టు 20, 1995: ఫిరోజాబాద్ సమీపంలో ఆగి ఉన్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ని పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 305 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

    రైలు ప్రమాదం

    భారీ సంఖ్యలో జవాన్లను పొట్టన పెట్టుకున్న 'గైసల్' ప్రమాదం

    26 నవంబర్ 1998: పంజాబ్‌లోని ఖన్నా వద్ద ఫ్రాంటియర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్‌కు చెందిన మూడు కోచ్‌లు పట్టాలు తప్పగా వాటిని జమ్ము తావి-సీల్దా ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 212 మంది మరణించారు.

    ఆగస్టు 2, 1999: పశ్చిమ బెంగాల్‌లోని గైసల్ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 285 మందికి పైగా మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.

    ఆగి ఉన్న అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్‌ను గైసల్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన స్టేషన్ నార్త్ ఫ్రాంటియర్ రైల్వేలోని కతిహార్ డివిజన్‌ పరిధిలోకి వస్తుంది.

    రైలు ప్రమాదం

    బిహార్, బెంగాల్‌, యూపీల్లో ప్రమాదాలు ఇలా

    సెప్టెంబర్ 9, 2002: బిహార్‌ రఫీగంజ్‌లోని ధావే నదిపై ఉన్న వంతెనపై హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రెండు కోచ్‌లు నదిలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో 140మందికి పైగా మరణించారు. అయితే ఈ రైలు పట్టాలు తప్పడం వెనుక మావోయిస్టుల హస్తం ఉందనే ప్రచారం జరిగింది.

    మే 28, 2010: ముంబైకి వెళ్తున్న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడమే కాకుండా గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 145మంది ప్రయాణికులు చనిపోయారు. బెంగాల్‌లోని జార్‌గ్రామ్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

    నవంబర్ 20, 2016: ఇండోర్-రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్‌లోని 14కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 152మంది మృతి చెందగా, 260మంది గాయపడ్డారు. కాన్పూర్‌కు సుమారు 60కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    ఒడిశా
    బిహార్
    భారతదేశం

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు నితీష్ కుమార్
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    భారతదేశం

    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి  సూడాన్
    బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు బెంగళూరు
    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు కరోనా కొత్త కేసులు
    May Day 2023: భారత్‌లో 'మే డే'ను మొదట ఎక్కడ నిర్వహించారు? తొలిసారి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025