NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NGT: భారతదేశంలో 13వేల చదరపు కి.మీ అటవీ భూమి ఆక్రమణ.. ఎన్జీటీకీ సమర్పించిన నివేదికలో కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    NGT: భారతదేశంలో 13వేల చదరపు కి.మీ అటవీ భూమి ఆక్రమణ.. ఎన్జీటీకీ సమర్పించిన నివేదికలో కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి 
    భారతదేశంలో 13వేల చదరపు కి.మీ అటవీ భూమి ఆక్రమణ

    NGT: భారతదేశంలో 13వేల చదరపు కి.మీ అటవీ భూమి ఆక్రమణ.. ఎన్జీటీకీ సమర్పించిన నివేదికలో కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 02, 2025
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా 2024 నాటికి ఆక్రమణకు గురైన మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 13,056 చదరపు కిలోమీటర్లు అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT)కు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.

    ఈ విస్తీర్ణం దిల్లీ,సిక్కిం,గోవా రాష్ట్రాల మొత్తం భూభాగం కంటే ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది.

    అటవీ భూముల ఆక్రమణపై పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంకా పూర్తి సమాచారం వెల్లడించలేదని నివేదిక పేర్కొంది.

    దేశవ్యాప్తంగా అటవీ భూములు అక్రమంగా ఆక్రమించబడుతున్నాయనే అంశాన్ని స్వప్రేరితంగా స్వీకరించిన NGT, ఈ మేరకు 2023లోనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలోని ఆక్రమణ వివరాలను సమర్పించాలంటూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

    వివరాలు 

    ఆక్రమణ వివరాలను సమర్పించిన రాష్ట్రాలు 

    కేంద్ర మంత్రిత్వ శాఖ సమర్పించిన తాజా నివేదిక ప్రకారం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, దాద్రానగర్ హవేలీ & దమణ్‌దీవ్, కేరళ, లక్షద్వీప్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, సిక్కిం, మధ్యప్రదేశ్, మిజోరం, మణిపూర్ వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అటవీ భూముల ఆక్రమణ వివరాలను సమర్పించాయి.

    ఇంకా సమాచారం ఇవ్వాల్సిన రాష్ట్రాలు

    బిహార్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, దిల్లీ, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ వంటి రాష్ట్రాలు ఇంకా తగిన వివరాలను సమర్పించాల్సి ఉంది.

    వివరాలు 

    అత్యధిక ఆక్రమణకు గురైన రాష్ట్రాలు 

    మధ్యప్రదేశ్ - 5,460 చదరపు కిలోమీటర్లు, అస్సాం - 3,620 చదరపు కిలోమీటర్లు, కర్ణాటక - 863.08 చదరపు కిలోమీటర్లు, తమిళనాడు - 157.68 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ - 133.18 చదరపు కిలోమీటర్లు.

    పూర్తి సమాచారాన్ని పట్టిక రూపంలో సమర్పించాలని కోరుతూ, ఇంకా వివరాలు పంపని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవల లేఖలు పంపినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ NGTకు తెలియజేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అటవీశాఖ

    తాజా

    MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు ముంబయి ఇండియన్స్
    Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Trump: $175 బిలియన్ల 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థను ఆవిష్కరించిన ట్రంప్  అమెరికా
    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్

    అటవీశాఖ

    ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ చంద్రబాబు నాయుడు
    అట‌వీ సంర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు 2023కి లోక్‌స‌భ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    తిరుమల: అలిపిరి నడకమార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత  తిరుమల తిరుపతి
    భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు  తిరుమల తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025