NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy 2025: కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు.. పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్‌ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy 2025: కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు.. పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్‌ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
    పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్‌ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!

    Champions Trophy 2025: కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు.. పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్‌ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    09:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది.

    ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంయుక్తంగా ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నారు.

    ఈ వేడుక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదికగా జరుగుతుంది.

    అయితే, ఈసారి ఐసీసీ టోర్నీ ప్రారంభానికి ముందు సాంప్రదాయంగా జరుగే అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశం నిర్వహించమని పీసీబీ వెల్లడించింది.

    వివరాలు 

    ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు బిజీ

    ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు ఇతర మ్యాచ్‌లతో బిజీగా ఉండడంతో కెప్టెన్ల ఫొటోషూట్‌ను నిర్వహించడాన్ని రద్దు చేయడం జరిగిందని పీసీబీ వర్గాలు తెలిపాయి.

    "ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అన్ని జట్లకు సమయం లేదు. భారత్‌తో ఇంగ్లండ్ వన్డే సిరీస్ జరగాలి, శ్రీలంకలో పర్యటనలో ఆస్ట్రేలియా ఉంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పాకిస్థాన్‌కు చేరుకుంటాయి. ఈ కారణంగా సమయం లేకపోవడంతో కెప్టెన్ల ఫొటోషూట్, విలేకర్ల సమావేశం నిర్వహించడాన్ని రద్దు చేస్తున్నాం" అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.

    కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు కావడంతో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోయింది.

    వివరాలు 

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎనిమిది జట్లు

    ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి.

    దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ టోర్నీ జరుగుతోంది. పాకిస్థాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది.

    గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

    ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ దుబాయ్ వేదికగా పోటీపడుతుంది.

    2013లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ ఈ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛాంపియన్స్ ట్రోఫీ
    రోహిత్ శర్మ

    తాజా

    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    Fat burning: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయం ఈ 5 అలవాట్లు పాటించండి జీవనశైలి
    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు

    ఛాంపియన్స్ ట్రోఫీ

    Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్ టీమిండియా
    Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం క్రీడలు
    Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ  రోహిత్ శర్మ
    Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..! క్రీడలు

    రోహిత్ శర్మ

    IND vs AUS 2024: ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం? బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌..  రోహిత్ శర్మ ముందు 5 రికార్డులు  క్రీడలు
    Rohit Sharma: టీమిండియా బిగ్ షాక్.. మహ్మద్ షమీ ఫిట్‌నెస్ రోహిత్ శర్మ కీలక ప్రకటన మహ్మద్ షమీ
    AUS vs IND: విరాట్‌ కోహ్లీని ఫోకస్‌ చేస్తూ పోస్టర్‌. ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ అభిమానులు  విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025