NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్? 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్? 
    ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్?

    Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 23, 2025
    02:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టును ప్రకటించనుంది.

    ఈ నేపథ్యంలో భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, నూతన సారథిని ఎవరిని ఎన్నుకుంటారు అన్న దానిపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

    కెప్టెన్సీ రేసులో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, స్టార్ బౌలర్ బుమ్రా పోటీలో ఉన్నారు.

    అయితే తాజా సమాచారం ప్రకారం టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతోందని తెలుస్తోంది.

    గిల్, ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చిన ప్రదర్శన అతడికి ప్రయోజనకరంగా మారింది. బీసీసీఐ నుంచి దీనిపై అధికారిక ప్రకటన కొద్దిగంటల్లో వెలువడనుంది.

    వివరాలు 

    వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ 

    ఆస్ట్రేలియా పర్యటనలో వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నా, అతడి ఫిట్‌నెస్ సంబంధిత అంశాల దృష్ట్యా తుది నిర్ణయం గిల్‌కు అనుకూలంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.

    బుమ్రా శరీర భారం నిర్వహణ, దీర్ఘకాలిక అందుబాటు అంశాలను బీసీసీఐ పరిశీలించినట్టు సమాచారం.

    ఇక వైస్ కెప్టెన్ పదవికి రిషబ్ పంత్ పేరు పరిశీలనలో ఉంది. ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా, టెస్ట్ ఫార్మాట్‌లో అతడు గత కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా ఆడుతున్నాడు.

    భవిష్యత్‌కు దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

    వివరాలు 

    మూడో స్థానంలో సాయి సుదర్శన్‌

    రోహిత్ రిటైర్మెంట్‌తో అతడి స్థానాన్ని పూరించేందుకు యశస్వి జైస్వాల్‌తో కలసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

    ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించిన సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో ఆడనున్నాడు.

    నాలుగో స్థానంలో గిల్‌ స్థానం ఖాయమవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్‌లు చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి.

    వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురేల్‌ను రిజర్వ్‌గా జట్టులో కొనసాగించనున్నారు.

    వివరాలు 

    స్పిన్ యూనిట్‌కు రవీంద్ర జడేజా నేతృత్వం

    బౌలింగ్ విభాగంలో స్పిన్ యూనిట్‌కు రవీంద్ర జడేజా నేతృత్వం వహించనున్నాడు.

    వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లకు కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం.

    పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు స్థిరమైన ఎంపికలుగా కనిపిస్తున్నారు.

    మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలుండటంతో, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లలో ఇద్దరిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్?  బీసీసీఐ
    Health Tips: అల్పాహారంలో దానిమ్మను చేర్చుకోవడం వల్ల లాభాలు అనేకం!  లైఫ్-స్టైల్
    Karnataka: కర్ణాటక గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ మంజూరు.. విజయోత్సవ ఊరేగింపుతో సంబరాలు కర్ణాటక
    IPL TOP 2 Race: ఐపీఎల్‌లో కొనసాగుతున్న టాప్‌ 2 రేసు.. తొలి రెండు స్థానాల్లోకి వచ్చేదెవరు.. నిలిచేదెవరు..?  ఐపీఎల్

    బీసీసీఐ

    Yuzvendra Chahal: చాహల్‌ ఫైల్‌ను బీసీసీఐ మూసివేసింది.. మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు చాహల్
    Champions Trophy: టీమిండియా ప్లేయ‌ర్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు.. బీసీసీఐ పై మండిపడిన ఐసీసీ ఐసీసీ
    Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ విరాట్ కోహ్లీ
    Team India New Jersey: భారత జట్టు జెర్సీలో పలు మార్పులు.. కొత్త జెర్సీ విడుదల చేసిన బీసీసీఐ  టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025