NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Private market yards: ఇక ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు.. తెలంగాణ ప్రభుత్వ అధ్యయనం
    తదుపరి వార్తా కథనం
    Private market yards: ఇక ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు.. తెలంగాణ ప్రభుత్వ అధ్యయనం
    ఇక ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు.. తెలంగాణ ప్రభుత్వ అధ్యయనం

    Private market yards: ఇక ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు.. తెలంగాణ ప్రభుత్వ అధ్యయనం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 09, 2025
    08:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ప్రైవేట్ హోల్‌సేల్ మార్కెట్ల ఏర్పాటు అనుమతికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

    ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, టోకు, చిల్లర వర్తకులు నేరుగా మార్కెట్లో కొనుగోళ్లు చేయడానికి వీలు కల్పించాలని, ప్రైవేట్, ఈ-ట్రేడింగ్ వేదికల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది.

    జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా విధానంలో ఈ ప్రతిపాదనలను కేంద్రం ప్రవేశపెట్టింది.

    ఈ విధానం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తోంది.

    ఇటీవల, ఏకీకృత, విస్తృత నేషనల్ మార్కెటింగ్ వ్యవస్థ పేరిట కేంద్రం ఈ ముసాయిదాను విడుదల చేసి, రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.

    వివరాలు 

    వ్యవస్థలో మార్పులే లక్ష్యం 

    ప్రస్తుత వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో అనేక లోపాలున్నాయి, రైతులు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

    కేంద్రం కొత్త విధానంతో వీటిని పరిష్కరించి, మార్కెట్ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించి, రైతులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయాలు అందించాలనుకుంటోంది.

    మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలకు ఈ విధానం ఉపయుక్తమవుతుందని పేర్కొంది.

    ఈ ముసాయిదా కేంద్ర మార్కెటింగ్ శాఖ అదనపు కార్యదర్శి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ నేతృత్వంలో రూపొందించబడింది.

    ఇది రైతుల ఉత్పత్తులకు ఉత్తమ ధరల సౌకర్యం కల్పించడాన్ని, పోటీని పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా, ఒప్పంద వ్యవసాయం, నేరుగా రైతుల నుంచి కొనుగోళ్లు వంటి అంశాలను ప్రతిపాదించింది.

    వివరాలు 

    దేశంలో పరిస్థితి 

    2023-24లో భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 332.29 మిలియన్ టన్నులుగా నమోదైంది, ఇది గత ఏడాదితో పోలిస్తే 2.6 మిలియన్ టన్నులు అధికం.

    ఈ ఉత్పత్తుల కోసం దేశవ్యాప్తంగా 7,057 మార్కెట్ యార్డులు ఉన్నాయి, వీటిలో 2,605 ప్రధాన మార్కెట్లు, 4,452 ఉప మార్కెట్లు ఉన్నాయి.

    చాలా మార్కెట్లలో మౌలిక వసతులు లేవు. ఈనామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) పరిధిలో 1,410 మార్కెట్లను మార్చినా, ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు జరగడం లేదు.

    వివరాలు 

    తెలంగాణలో పరిస్థితి 

    తెలంగాణలో 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి, వీటిలో 10 ప్రధాన యార్డులు కాగా, 100 యార్డుల్లో కొన్ని రకాల సరకుల క్రయవిక్రయాలు జరుగుతాయి.

    సీజన్ల వారీగా నడిచే 87 ఉప యార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు ₹50 వేల కోట్ల లావాదేవీలు జరుగుతాయి. యార్డులు ₹150 కోట్ల ఆదాయం పొందుతున్నాయి.

    అయితే, 2006లో ప్రైవేట్ యార్డులకు అనుమతి ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్కటి కూడా స్థాపించబడలేదు. వ్యాపారవర్గాలు యార్డుల నిర్మాణం, నిర్వహణ కష్టమని భావిస్తున్నాయి.

    వివరాలు 

    మార్పుల దిశగా ప్రణాళిక 

    ప్రైవేట్ మార్కెట్లు, ఆన్‌లైన్ ఈ-ట్రేడింగ్ వేదికలు, ఎలక్ట్రానిక్ కమోడిటీ ఎక్స్చేంజీల ఏర్పాటు

    ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, రిటైలర్లు నేరుగా రైతుల నుంచి ఉత్పత్తుల కొనుగోలు సౌకర్యం

    వ్యవసాయ వాణిజ్య ప్రక్రియల ఆటోమేషన్, డిజిటలైజేషన్

    ఫీజులు, లైసెన్సులు, నిబంధనల సులభతరం

    ఏకీకృత జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్

    రైతులకు ధరల అంచనా, మార్కెట్ ఇంటెలిజెన్స్, ఆన్‌లైన్ సమాచారం

    జీఎస్టీ మాదిరి రాష్ట్రాల భాగస్వామ్యంతో నిర్వహణ కమిటీ ఏర్పాటులు

    ఈ ప్రతిపాదనలు రైతులకు మార్కెట్ సదుపాయాలు పెంచడంలో, వ్యవసాయ రంగాన్ని కొత్త దిశగా తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్

    తెలంగాణ

    Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణశాఖ వాతావరణ శాఖ
    Telangana: కొత్త ఇల్లు కట్టుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌..  భారతదేశం
    Kamareddy: కామారెడ్డిలో విషాదం.. శ్రుతి, నిఖిల్‌ తర్వాత ఎస్సై మృతదేహం వెలికితీత కామారెడ్డి
    Manda Jannadham మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్యం విషమం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025