NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ 
    ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ

    CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 23, 2025
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు.

    శనివారం జరగబోయే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనడం కోసం ఆయన ఈ పర్యటన చేపట్టారు.

    శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలవనున్నారు.

    ఉదయం 10 గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో, 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, మధ్యాహ్నం 12 గంటలకు జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్నారు.

    వివరాలు 

    వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలవనున్న చంద్రబాబు 

    అదే రోజు ఒంటి గంటకు శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, 3 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాత్రి 9 గంటలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌లను కలవనున్నారు.

    ఈ భేటీల్లో గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం, రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, జల్ జీవన్ మిషన్ అమలులో సహకారం, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి కేంద్రం నుంచి మరింత సహాయం, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి, క్రిమినల్ చట్టాల అమలుపై చంద్రబాబు చర్చించనున్నారు.

    వివరాలు 

    తెలుగుదేశం పార్టీ ఎంపీలు చంద్రబాబుకు స్వాగతం

    అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం నుండి అవసరమైన సహకారం అందించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు.

    సాగునీరు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం తగిన నిధులు, అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించనున్నారు.

    పలు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అయి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించనున్నారు.

    న్యూఢిల్లీకి చేరుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.

    వివరాలు 

    నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనున్న చంద్రబాబు 

    భారత్ మండపంలో శనివారం జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.

    ఈ సమావేశం ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.

    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు,అడ్మినిస్ట్రేటర్లు హాజరవుతారు.

    ప్రధానమంత్రి ప్రారంభ ప్రసంగం అనంతరం అన్ని రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశం ఉంటుంది.

    ఈ సమావేశంలో 'వికసిత్ భారత్.. 2047' లక్ష్యంతో విస్తృతంగా చర్చలు జరుగనున్నాయి.

    పారిశ్రామిక అభివృద్ధి,యువత నైపుణ్యాభివృద్ధి,ఉపాధి సృష్టి,ద్వితీయ,తృతీయ శ్రేణి పట్టణాల్లో తయారీ,సేవా రంగాల ప్రోత్సాహం, గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి, హరిత ఇంధనం, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ  చంద్రబాబు నాయుడు
    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ!  కల్వకుంట్ల కవిత
    Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన బంగ్లాదేశ్

    చంద్రబాబు నాయుడు

    AP cabinet: చేనేత, పవర్ లూమ్ రంగాలకు ఉచిత విద్యుత్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆంధ్రప్రదేశ్
    Lulu Group: అమరావతి, తిరుపతిలో లులు మాల్స్‌ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ అమరావతి
    CM Chandrababu: అమరావతి నిర్మాణానికి నిధుల కోసం నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పవన్ కళ్యాణ్
    AP Cabinet: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్‌.. పేర్లు మార్పుతో కౌంటర్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025