NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Corona Virus: భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. కరోనాతో ఒక్కరోజు ఆరుగురు మృతి..
    తదుపరి వార్తా కథనం
    Corona Virus: భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. కరోనాతో ఒక్కరోజు ఆరుగురు మృతి..
    భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. కరోనాతో ఒక్కరోజు ఆరుగురు మృతి..

    Corona Virus: భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. కరోనాతో ఒక్కరోజు ఆరుగురు మృతి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కరోనా వైరస్ మళ్లీ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లో కోవిడ్-19 మళ్లీ ప్రభావం చూపిస్తూ,చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 6,133కి పెరిగింది.

    గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 378 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇదే సమయంలో కోవిడ్ కారణంగా 6 మంది మృతి చెందారు.

    వీరిలో కేరళలో 3 మంది, కర్ణాటకలో 2 మంది, తమిళనాడులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

    ఇప్పటివరకు వైరస్ బారిన పడి మరణించిన వారి మొత్తం సంఖ్య 65కి చేరుకుంది.

    ప్రస్తుతానికి కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం.

    ఆంధ్రప్రదేశ్‌లో 86 యాక్టివ్ కేసులు ఉండగా, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులను రాష్ట్ర ఆరోగ్య శాఖ గుర్తించింది.

    వివరాలు 

    అన్ని రాష్ట్రాల్లో ఆరోగ్య సదుపాయాల సమీక్ష కోసం మాక్ డ్రిల్

    ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచనలు పంపింది.

    మరోవైపు, దేశవ్యాప్తంగా చూస్తే కేరళలోనే అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    తర్వాత గుజరాత్,పశ్చిమ బెంగాల్,ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ కేసులు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

    తాజా గణాంకాల ప్రకారం,కేరళలో మొత్తం 1,957 పాజిటివ్ కేసులు ఉండగా,గుజరాత్‌లో 980, బెంగాల్‌లో 747, ఢిల్లీలో 728, మహారాష్ట్రలో 607 కేసులు నమోదయ్యాయి.

    దేశంలో కేసులు పెరుగుతుండటంతో, అన్ని రాష్ట్రాల్లో ఆరోగ్య సదుపాయాల సమీక్ష కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది.

    ఆక్సిజన్, ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, అలాగే అత్యవసర వైద్య సదుపాయాల లభ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా కొత్త కేసులు

    తాజా

    Corona Virus: భారత్‌లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు.. కరోనాతో ఒక్కరోజు ఆరుగురు మృతి.. కరోనా కొత్త కేసులు
    Chiyaan Vikram: 'SSMB29' నుంచి విక్రమ్ వెనక్కి..? రాజమౌళి ఆఫర్‌కు నో చెప్పిన చియాన్!  మహేష్ బాబు
    Airtel: వాట్సాప్,ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో ఆర్థిక సందేశాలను నిషేధించండి ..  RBI ని కోరిన ఎయిర్‌టెల్   ఎయిర్ టెల్
    Video: ఆర్డర్‌ ఆలస్యం.. ఘజియాబాద్‌లో రెస్టారెంట్‌ ధ్వంసం  ఉత్తర్‌ప్రదేశ్

    కరోనా కొత్త కేసులు

    కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ  కోవిడ్
    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కోవిడ్
    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29 కోవిడ్
    దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025