NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు 
    ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో..

    Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2025
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ అందజేస్తున్న మద్దతును అంతర్జాతీయంగా బయటపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్ అవుట్‌రీచ్‌' కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.

    ఈ కార్యక్రమానికి భాగంగా ఏర్పాటైన అఖిలపక్ష ప్రతినిధి బృందాల పర్యటనలు ఈ రోజు మొదలయ్యాయి.

    జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే నేతృత్వంలో ఏర్పాటైన రెండు బృందాలు విదేశాలకు బయలుదేరాయి.

    ఇందులో సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం జపాన్‌ పయనం కాగా, శ్రీకాంత్ శిందే బృందం రాత్రి తొమ్మిది గంటలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

    వివరాలు 

    బృందంలో మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్

    ఈ బృందంలో భాజపా ఎంపీలు అపరాజితా సారంగి, బ్రిజ్‌లాల్‌, హేమాంగ్ జోషి, ప్రధాన్ బారువా, తృణమూల్ కాంగ్రెస్‌ తరఫున అభిషేక్ బెనర్జీ, సీపీఎం తరఫున జాన్ బ్రిట్టాస్‌, కాంగ్రెస్‌ నేత సల్మాన్ ఖుర్షీద్‌ ఉన్నారు.

    మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ కూడా ఈ బృందంలో భాగంగా ఉన్నారు.

    ఈ బృందం ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌ వంటి ఆసియా దేశాల్లో పర్యటించనుంది.

    శిందే నేతృత్వంలోని బృందం మాత్రం ఆఫ్రికా ఖండానికి చేరుకోనుంది. ఈ బృందం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్‌, లైబీరియాల్లో పర్యటించనుంది.

    ఈ పర్యటనలు పాక్ ప్రోత్సాహంతో భారత్‌కు ముప్పుగా మారుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచానికి వివరించడమే లక్ష్యంగా జరుగుతున్నాయి.

    వివరాలు 

    ఆ 33 దేశాలే ఎందుకు..? 

    ఈ మొత్తం కార్యక్రమానికి ఏడుసార్లు ఎంపికైన బృందాలలో మూడింటికి మంగళవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక అంశాలను వివరించారు.

    భాజపా ఎంపీ అపరాజితా సారంగి మీడియాతో మాట్లాడుతూ, ఈ బృందాల పర్యటనకు ఎంపికైన 33 దేశాలలో 15 దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి చెందినవని చెప్పారు.

    అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా,మిగతా 10 తాత్కాలిక సభ్యదేశాలుగా ఉన్నాయి.

    మిగిలిన దేశాలు భవిష్యత్తులో భద్రతామండలిలో చోటు సంపాదించే అవకాశం ఉన్నవని చెప్పారు.

    అంతేకాక,భారత దృక్పథాన్ని అంతర్జాతీయంగా బలంగా వినిపించగల సామర్థ్యం ఉన్న దేశాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

    ఈ బృందాలు తమ పర్యటనలో ఆయా దేశాల ప్రభుత్వ ప్రధానులు,పార్లమెంటు సభ్యులు, చింతనకర్తలు,మేధావులు,మీడియా ప్రతినిధులను కలుసుకుని భారత భద్రతా ఆందోళనలను వివరించనున్నారు.

    వివరాలు 

    దౌత్యపరంగా పోరాటానికి సిద్దమైన భారత్ 

    పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం దెబ్బతీయగా, 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే), పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంది.

    పాక్ రెచ్చగొట్టే విధానాలను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ విదేశాంగ రంగంలో సీమాంతర ఉగ్రవాదం విషయంలో దౌత్యపరంగా పోరాటానికి సిద్ధమైంది.

    ఈ క్రమంలోనే ఈ విదేశీ పర్యటనల ద్వారా అంతర్జాతీయ వేదికలపై పాక్ పీడనాన్ని బహిర్గతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్! ఫెరారీ
    Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Sushmita Sen: 31 ఏళ్ల క్రితం ఫొటో షేర్‌ చేసిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్
    Shaktimaan: 'శక్తిమాన్‌' మరోసారి వస్తున్నాడు.. ఆడియో సిరీస్‌గా వచ్చేస్తున్న సూపర్‌హీరో! సినిమా

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు భారతదేశం
    Operation Sindoor: చండీగఢ్'​లో ఎయిర్ సైరన్​  హెచ్చరిక భారతదేశం
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ భారతదేశం
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025