
Team India: భారత్ టెస్టు షెడ్యూల్.. విండీస్ నుంచి ఆసీస్ వరకు ఐదు టెస్టు సిరీస్లు
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 నాలుగో సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో భారత్ తన తొలి టెస్టు సిరీస్ను సమంగా ముగించింది. ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో 2-2 ఫలితం నమోదైంది. ఇప్పుడు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా టాప్-2 స్థానాల్లో ఉండాల్సిందే. తొలి రెండు ఎడిషన్లలో టీమిండియా ఫైనల్కు చేరినా విజయం సాధించలేకపోయింది. మూడో సీజన్లో అయితే ఫైనల్కు అర్హత పొందలేకపోయింది. ప్రస్తుతం గంభీర్, గిల్ నేతృత్వంలో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ దిశగా పయనిస్తోంది. ఇంకా ఐదు టెస్టు సిరీస్లు భారత్ ఆడాల్సి ఉంది.
వివరాలు
విండీస్తో రెండు టెస్టులు..
ఇంగ్లాండ్తో సిరీస్ ముగిశాక భారత ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల విరామం లభించింది. సెప్టెంబరులో ఆసియా కప్ వరకు భారత్కు ఎలాంటి మ్యాచ్లు లేవు.మొదట బంగ్లాదేశ్తో వన్డే, టీ20 సిరీస్లు ప్లాన్ చేసినా.. అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేక వాయిదా పడ్డాయి. టీమ్ఇండియా ఆసియా కప్లో పాల్గొనకపోతే,ఇంకెదైనా దేశంతో టెస్టు లేదా లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఏర్పాటు చేసే అవకాశముంది. అయినా డబ్ల్యూటీసీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 2 నుంచి విండీస్తో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఇది స్వదేశంలో జరుగుతుంది.అహ్మదాబాద్లో అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్టు,ఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్టు జరుగుతాయి. చివరిసారిగా ఇరు జట్లూ 2023 జులైలో విండీస్ వేదికగా తలపడ్డాయి.
వివరాలు
దక్షిణాఫ్రికాతో మళ్లీ ఇక్కడే..
విండీస్తో సిరీస్ అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. అయితే ఈ పర్యటనలో వన్డేలు, టీ20లే ఉన్నా టెస్టులు లేవు. ఈ పర్యటన అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరుగుతుంది. అనంతరం తిరిగి స్వదేశంలోనే దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్లో నవంబర్ 14 నుంచి 18 వరకు మొదటి టెస్టు, గువాహటిలో నవంబర్ 22 నుంచి 26 వరకు రెండో టెస్టు జరుగుతాయి. వీటి తర్వాత వన్డే, టీ20 సిరీస్లు కూడా షెడ్యూల్లో ఉన్నాయి. డిసెంబర్ 19 వరకు దక్షిణాఫ్రికా జట్టు భారత్లోనే పర్యటించనుంది.
వివరాలు
వచ్చే ఏడాదే రెండో విదేశీ పర్యటన..
డబ్ల్యూటీసీలో ఇప్పటికే భారత్ ఓ పెద్ద టెస్టు సిరీస్ను విదేశాల్లో పూర్తి చేసింది. ఇక వచ్చే ఏడాది మళ్లీ ఓవర్సీస్ టూర్ జరగనుంది. అది శ్రీలంక పర్యటనే. జులై 2026లో ఈ సిరీస్ జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ రెండు జట్లు చివరిసారిగా మార్చి 2022లో టెస్టుల్లో తలపడ్డాయి, అప్పట్లో రోహిత్ శర్మనే కెప్టెన్. శ్రీలంక పర్యటనకు భారత్ చివరిసారిగా 2017లో టెస్టుల కోసం వెళ్లింది.
వివరాలు
న్యూజిలాండ్తో రెండు టెస్టులు
గత డబ్ల్యూటీసీ సీజన్లో న్యూజిలాండ్ భారత్ పర్యటనకు వచ్చి మూడు టెస్టుల సిరీస్ను గెలుచుకుంది. ఈ ఫలితం అప్పట్లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మీద తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు టీమ్ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తోంది. ఈ సిరీస్ 2026 నవంబర్లో జరగనుంది. అప్పటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే కివీస్ను వారి గడ్డపై ఓడించాల్సిందే. ఇది సాధిస్తే భారత జట్టుకు గొప్ప విజయంగా నిలుస్తుంది.
వివరాలు
చివరి సిరీస్ - ఆస్ట్రేలియాతో కీలక పోరు
డబ్ల్యూటీసీ 2025-27 సీజన్లో భారత జట్టు ఫైనల్ చేరాలంటే చివరి సిరీస్లో విజయం అత్యవసరం. ఈ చివరి సిరీస్ మాత్రం ఆసీస్తో. ఇది అత్యంత బలమైన జట్టు కావడంతో భారత్ కోసం ఇది ఒక రివేంజ్ పోరుగా మారుతుంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ సిరీస్ భారత గడ్డపై జరగనుంది. భారత్ ఆసీస్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇదే 2023లో భారత్ వేదికగా జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత్ విజయం సాధించిన ఘట్టాన్ని గుర్తుకు తెస్తుంది.