నెల్లూరు రూరల్: వార్తలు

ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు.

వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొన్నిరోజులుగా వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలతోపాటు, ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

'నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు', వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.