
SRH vs MI: పవాల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ - సన్ రైజర్స్ - ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ వేళ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పవాల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది.
ఈ దాడిలో పెద్ద ఎత్తున అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ముష్కరుల దాడిని దేశవ్యాప్తంగా విస్తృతంగా ఖండిస్తున్నారు.
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బాధితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండడంతో పాటు,ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ దారుణ ఘటనపై క్రికెట్ రంగం నుంచి తీవ్ర స్పందనలు వచ్చాయి.
పలువురు క్రికెటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నేరస్థులు తప్పించుకోలేరని హెచ్చరించారు.
ఇదే సమయంలో ఐపీఎల్లో భాగంగా ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
చీర్ గర్ల్స్ ఉండరు
పవాల్గాం ఉగ్రదాడిలో దాదాపు 30 మంది నిరాయుధ పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ రోజు జరిగే మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ వారికి నివాళి అర్పించనుంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటించి దాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించనున్నారు.
అంతేగాక, మైదానంలో ఆడే రెండు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు చేతులకు నల్ల రంగు ఆర్మ్ బ్యాండ్లు ధరించనున్నారు. ఈ సందర్భంగా చీర్ గర్ల్స్ను కూడా ఉండకూడదని నిర్ణయంచారు.
వివరాలు
స్పదించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు
ఈ దాడిపై టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు.
"ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. ఈ అఘాయిత్యానికి బాధ్యులు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారతదేశం దీన్ని సహించదు." అని ఆయన పేర్కొన్నారు.
అలాగే, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ కూడా స్పదించారు. "పవాల్గాం ఉగ్రదాడి నా మనసును కలచివేసింది. బాధితుల కుటుంబాల కోసం నా ప్రార్థనలు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు మన దేశంలో ఎప్పటికీ చోటు ఉండకూడదు." అంటూ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.