NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / SRH vs MI: పవాల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ - సన్ రైజర్స్ - ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ వేళ కీలక నిర్ణయం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SRH vs MI: పవాల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ - సన్ రైజర్స్ - ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ వేళ కీలక నిర్ణయం 
    పవాల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ - సన్ రైజర్స్ - ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ వేళ కీలక నిర్ణయం

    SRH vs MI: పవాల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ - సన్ రైజర్స్ - ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ వేళ కీలక నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    02:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పవాల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది.

    ఈ దాడిలో పెద్ద ఎత్తున అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ముష్కరుల దాడిని దేశవ్యాప్తంగా విస్తృతంగా ఖండిస్తున్నారు.

    ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బాధితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండడంతో పాటు,ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది.

    ఈ దారుణ ఘటనపై క్రికెట్ రంగం నుంచి తీవ్ర స్పందనలు వచ్చాయి.

    పలువురు క్రికెటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నేరస్థులు తప్పించుకోలేరని హెచ్చరించారు.

    ఇదే సమయంలో ఐపీఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

    వివరాలు 

    చీర్ గర్ల్స్‌ ఉండరు 

    పవాల్గాం ఉగ్రదాడిలో దాదాపు 30 మంది నిరాయుధ పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ రోజు జరిగే మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ వారికి నివాళి అర్పించనుంది.

    మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటించి దాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించనున్నారు.

    అంతేగాక, మైదానంలో ఆడే రెండు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు చేతులకు నల్ల రంగు ఆర్మ్ బ్యాండ్లు ధరించనున్నారు. ఈ సందర్భంగా చీర్ గర్ల్స్‌ను కూడా ఉండకూడదని నిర్ణయంచారు.

    వివరాలు 

    స్పదించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు 

    ఈ దాడిపై టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు.

    "ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. ఈ అఘాయిత్యానికి బాధ్యులు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారతదేశం దీన్ని సహించదు." అని ఆయన పేర్కొన్నారు.

    అలాగే, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ కూడా స్పదించారు. "పవాల్గాం ఉగ్రదాడి నా మనసును కలచివేసింది. బాధితుల కుటుంబాల కోసం నా ప్రార్థనలు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు మన దేశంలో ఎప్పటికీ చోటు ఉండకూడదు." అంటూ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    బీసీసీఐ

    తాజా

    SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల! సాయి ధరమ్ తేజ్
    Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల!  నితిన్
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100  స్టాక్ మార్కెట్
    Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష విశాఖపట్టణం

    ఐపీఎల్

    IPL 2025 : వాంఖ‌డే స్టేడియం వేదికగా ముంబై, ఆర్సీబీ మ్యాచ్  క్రీడలు
    MI vs RCB: ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం క్రీడలు
    PBKS vs CSK: పంజాబ్ విజయం.. చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి  క్రీడలు
    Digvesh Rathi: దిగ్వేశ్ స్టైల్ ఏమాత్రం తగ్గడం లేదు.. నోట్‌బుక్ తర్వాత గ్రౌండ్‌పై రాసిన స్పిన్నర్ (వీడియో)  లక్నో సూపర్‌జెయింట్స్

    బీసీసీఐ

    Harbhajan Singh: పాకిస్థాన్‌కు హర్భజన్‌ గట్టి కౌంటర్.. ఇష్టం లేకపోతే భారత్‌కు రాకండి! టీమిండియా
    Yusuf Pathan : భద్రతపై బీసీసీఐ నిర్ణయం సరైనది.. యూసఫ్ పఠాన్ యూసఫ్ పఠాన్
    Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌.. భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో..! ఐసీసీ
    BCCI: బీసీసీఐకి కొత్త కార్యదర్శి, కోశాధికారి.. జనవరి 12న ఎన్నికలు క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025