భారత్ మహిళల క్రికెట్ జట్టు: వార్తలు

దక్షిణాఫ్రికా సిరీస్‌పై‌ కన్నేసిన షఫాలీ వర్మ

అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇంగ్లాండ్ పై ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌటైంది.

Women's Under 19 T20 World Cup ఫైనల్లో ఇండియా

అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ చేరుకుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్తును ఇండియా ఖరారు చేసుకుంది.

ముక్కొణపు సిరీస్‌లో అదరగొట్టిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించింది. స్టార్ బ్యాట్ మెన్స్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ భారత్‌ అద్భుతమైన విజయాన్ని అందించారు. దీంతో టీమిండియా మహిళల జట్టు 20 ఓవర్లలో 167/5 స్కోరు సాధించింది.

వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహిళలు 20 ఓవర్లలో 167/2 స్కోర్ చేశారు.

ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు

మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ 11 మంది మహిళల టీ20 జట్టును ఎంపిక చేసింది. ఈ లిస్టులో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లకు అవకాశం దక్కింది.

ఐపీఎల్ మహిళ టీం కొనుగోలుపై బడా ఫ్రాంచైసీలు ఆసక్తి..!

ఐపీఎల్ మహిళను టీం కొనుగోలు చేయడానికి బడా ఫ్రాంచైసీలు ఆసక్తిని చూపుతున్నాయి. ఎలాగైనా టీంను కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేడు ఏ ఫ్రాంచైసీలు ముందుకు రానున్నాయో ఓ కొలక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు ఎంత మొత్తం పెట్టుబడి పెడుతున్నారు, ఎవరు ఆసక్తి చూపుతున్నారో నేడు తెలిసే అవకాశం ఉంటుంది.

ముక్కోణపు సిరీస్‌లో అదరగొట్టిన భారత్ అమ్మాయిలు

టీ20 ట్రై సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మహిళలపై భారత్ మహిళలు అదరగొట్టారు. ఈస్ట్ లండన్ లో గురువారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్ లో భారత్ 27 పరుగుల తేడాతో ధక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.

20 Jan 2023

బీసీసీఐ

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభ ఎడిషన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అనుమతిచ్చింది. ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చిలో జరిగే అవకాశం ఉంది. మొదటి మూడేళ్లలో ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా.. చివరి రెండేళ్లలో ఆరు జట్లకు అవకాశం కల్పించారు.

షఫాలి వర్మ సూపర్ బ్యాటింగ్

ఐసీపీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా మహిళా కెప్టెన్ షఫాలీ వర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో 34 బంతుల్లో 78 పరుగులు చేసి సంచలనం సృష్టించింది.