బహుజన్ సమాజ్ పార్టీ/ బీఎస్పీ: వార్తలు

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం మాఫియా నాయకుడు అతిక్ అహ్మద్‌ను దోషిగా తేల్చింది. అతిక్ అహ్మద్‌తో పాటు దినేష్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్‌లకు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్‌ ప్రధాన సాక్షి కావడం గమనార్హం.