హర్యానా ముస్లింలు భారత్లోనే గౌరవంగా బతకాలని అనుకుంటున్నారు : యూఎస్ కాంగ్రెస్ రో ఖన్నా
హర్యానాలో జరిగిన తీవ్ర అల్లర్ల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇక్కడి ముస్లింలు భారతదేశంలోనే గౌరవంగా బతకాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దిల్లీకి ద్వైపాక్షిక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న రో ఖన్నా(US CONGRESS MEMBER) హర్యానాకి చెందిన ముస్లింల బృందంతో బుధవారం సమావేశమయ్యారు. అనంతరం నుహ్,గురుగ్రామ్ల్లో జరిగిన ఘటనలపై బృందం సభ్యులు ఖన్నాకు వివరించారు. హింసాకాండకు సంబంధించి మణిపూర్ బృందం, హర్యానా ముస్లింలతో కలిసి ఉమర్ ఖలిద్ తండ్రి తుషార్ గాంధీ బుధవారం రో ఖన్నాతో భేటీ అయ్యారు. తాము ఈ దేశాన్ని ప్రేమిస్తున్నామని, ఇక్కడే గౌరవంగా జీవించాలని అనుకుంటున్నట్లు ముస్లింలు తనతో చెప్పిన మొదటి మాట ఇదేనని ఖన్నా చెప్పారు.
విలువలకే ప్రాధాన్యత ఇస్తానని ట్వీట్ చేసిన రో ఖన్నా
I unequivocally stand for pluralism and the human rights of minority populations, including Muslims, whether in India or America. My positions are well known. And I firmly stand by my values no matter who I meet with and am proud to convey them. https://t.co/x7EBk90V2C— Ro Khanna (@RoKhanna) August 16, 2023