NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే? 
    తదుపరి వార్తా కథనం
    WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే? 
    లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే?

    WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే? 

    వ్రాసిన వారు Stalin
    Jun 21, 2023
    06:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వార్షిక లింగ వ్యత్యాస నివేదిక-2023ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసింది.

    లింగ సమానత్వంలో భారతదేశం ఈ ఏడాది ఎనిమిది స్థానాలను మెరుగుపర్చుకున్నట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. 146 దేశాల్లో భారత్ ఈ ఏడాది 127వ స్థానంలో నిలిచింది.

    డబ్ల్యూఈఎఫ్ గతేడాది విడుదల చేసిన నివేదికలో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో 146 దేశాల్లో భారత్‌కు 135 ర్యాంక్ వచ్చింది.

    గతేడాదితో పోలిస్తే ఈ సారి భారత్ 1.4 శాతం పాయింట్లను మెరుగుపర్చుకున్నట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.

    ముఖ్యంగా విద్య విషయంలో అన్ని స్థాయిల్లో భారత్ సమాన స్థాయిని సాధించిందని వివరించింది.

    మొత్తం లింగ వ్యత్యాసాన్ని భారత్ 64.3శాతం తగ్గించిందని నివేదిక పేర్కొంది.

    భారత్

    లింగ సమానత్వంలో ఐస్‌లాండ్ టాప్

    ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలపై భారతదేశం కేవలం 36.7 శాతం మాత్రమే సమానాత్వం సాధించిందని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది.

    గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్‌కు పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు 142, బంగ్లాదేశ్‌కు 59, చైనాకు 107, నేపాల్‌కు 116, శ్రీలంకకు 115, భూటాన్‌కు 103 ర్యాంక్‌లు వచ్చాయి.

    ఐస్‌లాండ్ వరుసగా 14వ సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యధిక శాతం లింగ-సమానత్వం సాధించిన దేశంగా నిలిచింది. 90శాతం కంటే ఎక్కువ లింగ వ్యత్యాసాన్ని సాధించిన ఏకైక దేశంగా ఐస్‌లాండ్ రికార్డు సృష్టించింది.

    రాజకీయ సాధికారతపై భారతదేశం 25.3 శాతం సమానత్వాన్ని నమోదు చేసింది.

    మహిళలు 15.1 శాతం మంది పార్లమెంటేరియన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.

    భారత్

    100శాతం లింగ సమానత్వం సాధించడానికి 131 సంవత్సరాలు అవసరం

    దక్షిణాసియా ప్రాంతం 63.4 శాతం లింగ సమానత్వాన్ని సాధించింది. మంత్రి పదవుల్లో మహిళల వాటా విషయానికొస్తే, 75 దేశాల్లో 20 శాతం లేదా అంతకంటే తక్కువ మంది మహిళా మంత్రులు ఉన్నారు.

    భారతదేశం, టర్కీ, చైనా వంటి జనాభా కలిగిన దేశాలలో ఏడు శాతం కంటే తక్కువ మహిళా మంత్రులు ఉన్నారు.

    ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే మొత్తం లింగ వ్యత్యాసం 0.3 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది.

    100శాతం లింగ సమానత్వం సాధించడానికి 131 సంవత్సరాలు అవసరం అవుతుందని నివేదిక అంచనా వేసింది.

    ఆర్థిక సమానత్వానికి 169 సంవత్సరాలు, రాజకీయ సమానత్వానికి 162 సంవత్సరాలు పడుతుందని నివేదిక పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    భారతదేశం

    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా ప్రధాన మంత్రి
    కేరళను ఇంకా తాకని నైరుతి రుతుపవనాలు.. మరో 4 రోజులు పట్టే అవకాశం: ఐఎండీ ఐఎండీ
    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు రక్షణ శాఖ మంత్రి
    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  వర్షాకాలం

    పాకిస్థాన్

    రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..? క్రికెట్
    PAK vs AFG : పాక్‌ను మళ్లీ చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సిరీస్ కైవసం క్రికెట్
    పాక్ క్రికెటర్‌కు ఘోర అవమానం.. బాడీ షేమింగ్‌ చేస్తూ..! క్రికెట్
    ఆప్ఘనిస్తాన్ విజయంపై షోయబ్ ఆక్తర్ హర్షం క్రికెట్

    తాజా వార్తలు

    యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు  యోగ
    రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన ఆర్ బి ఐ
    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే  నరేంద్ర మోదీ

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం సింగపూర్
    ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు సూడాన్
    'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం  డొనాల్డ్ ట్రంప్
    కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం బ్రిటన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025