భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

BJP, CPM slam: పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళపై విచక్షణా రహితంగా దాడి.. నిందితుడి అరెస్ట్ 

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళను వీధిలో కనికరం లేకుండా కొట్టినట్లు ఒక వీడియో వెలుగులోకి వచ్చింది.

AP CM: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం మంగళగిరి నియోజకవర్గంలో 'ఎన్టీఆర్ భరోసా'గా ప్రారంభించారు.

01 Jul 2024

దిల్లీ

First Fir: కొత్త క్రిమినల్ చట్టం కింద ఢిల్లీలో నమోదైన తొలి కేసు

కొత్త క్రిమినల్ చట్టం కింద దేశ రాజధాని దిల్లీలో తొలి కేసు నమోదైంది. ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

NEET UG 2024 retest result:  నీట్​ యూజీ రీటెస్ట్​ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి? 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024 రీ-ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసింది.

New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 

జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీని తర్వాత, IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS), CrPC స్థానంలో భారతీయనాగరిక సురక్ష సంహిత (BNSS),ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అదినీయం (BSA) అమలు అవుతుంది.

Parliament: నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం.. సిద్ధమౌతున్న అధికార, విపక్షాలు 

రెండు రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి ప్రారంభం కానున్న లోక్‌సభ సమావేశాల్లో మళ్లీ వాగ్వాదం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న వ్యాన్ కు ప్రమాదం.. కాపాడిన BSF

దక్షిణ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లోని చందన్‌వారి ప్రాంతంలోని గుహ మందిరానికి వెళుతున్న అమర్‌నాథ్ యాత్రికులతో కూడిన వ్యాన్ ఆదివారం ప్రమాదానికి గురైంది.

30 Jun 2024

పోలవరం

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిపుణుల బృందం..4 రోజులపాటు పరిశీలన 

అమెరికా, కెనడాకు చెందిన నలుగురు విదేశీ నిపుణుల బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. నేటి (జూన్ 30) నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభిస్తారు.

Andhra Pradesh: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

102 women : ఈశాన్య రాష్ట్రాల్లో చారిత్రాత్మక మార్పు, నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికలలో పెరిగిన మహిళా భాగస్వామ్యం 

2004 తర్వాత జరిగిన మొదటి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో శనివారం నాడు నాగాలాండ్ 278 స్థానాల్లో 102 మంది మహిళలను పౌర సంస్థలకు ఎన్నుకున్నారు.

Mann Ki Baat:'2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు'..'మన్ కీ బాత్' కార్యక్రమం ముఖ్యమైన అంశాలు 

తన మూడో సారి తొలి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలపై మాట్లాడారు.

NEET-UG: నీట్-యుజి పరీక్ష ఇక ముందు ఆన్‌లైన్‌లో నిర్వహణ.. వివాదాలకు ముగింపు యోచనలో కేంద్రం

నీట్-యుజి పరీక్ష పై వివాదం నేపథ్యంలో, వచ్చే ఏడాది నుంచి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.ఈ సంగతిని సీనియర్ అధికారులు ది సండే ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు.

Indian Army and Navy: తొలి సారిగా నేవీ, ఆర్మీ సర్వీస్ చీఫ్‌లుగా ఇద్దరు సహవిద్యార్థులు 

భారత సైనిక చరిత్రలో తొలిసారిగా, ఇద్దరు సహవిద్యార్థులు, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది , అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, భారత సైన్యం , నావికాదళానికి సర్వీస్ చీఫ్‌లుగా నియమితులయ్యారు.

Mann Ki Baat :మూడోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత.. తొలిసారిగా 'మన్ కీ బాత్'.. ప్రభుత్వ ఎజెండాపై మాట్లాడే అవకాశం 

మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఈరోజు అంటే జూన్ 30న ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడనున్నారు.

Arvind Kejriwal: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం..కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

NEET-PG: సోమ,మంగళవారంలోగా నీట్ పీజీ 2024 పరీక్ష తేదీలు.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ ( నీట్ పీజీ) 2024 పరీక్ష తేదీలను సోమవారం, మంగళవారంలోగా ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్లను రూ.3000 నుంచి రూ.4000కు పెంచుతున్నట్లు ప్రకటించారు.

29 Jun 2024

గుజరాత్

Gujarat's Rajkot canopy: రాజ్‌కోట్ విమానాశ్రయంలో కూలిన ఫోర్కోర్టు పందిరి   

భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణీకుల , విమానాల రాకపోకలకు అంతరాయం తలెత్తింది.

29 Jun 2024

బీజేపీ

Rathod ramesh:​ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్​ కన్నుమూత..ఉట్నూరుకు భౌతికకాయం తరలింపు

ఆదిలాబాద్​ మాజీ ఎంపీ రాథోడ్​ రమేశ్​ కన్నుమూశారు.

29 Jun 2024

యూజీసీ

UGC-NET 2024 : UGC-NET 2024 పరీక్ష కోసం కొత్త తేదీల ప్రకటన

UGC-NET 2024 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 21,సెప్టెంబర్ 4 మధ్య తిరిగి నిర్వహించనున్నట్లు NTA నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేసింది.

Ladakh: లడఖ్‌లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు వీరమరణం

లడఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా పెను ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.

Tamilnadu: విరుదునగర్‌లోని సత్తూరులో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు.. ముగ్గురు మృతి

తమిళనాడులోని విరుదునగర్‌, సత్తూరు సమీపంలోని బండువార్‌పట్టిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మరణించారు.

Bengal Governor: ప‌శ్చిమ బెంగాల్ సీఎంపై.. గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు 

ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు న‌మోదు చేశారు.

29 Jun 2024

తెలంగాణ

Dharmapuri Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

28 Jun 2024

తెలంగాణ

Telangana:కాంగ్రెస్‌లో చేరిన  చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యే  

తెలంగాణ, చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ దీపదాస్‌ మున్షీ సమక్షంలో ప్రకటించారు.

Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరుసగా సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ వేగంగా చర్యలు చేపడుతున్నారు.

Andhrapradesh: ఏపీలో రూ.5,367 కోట్ల పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం తుది మెరుగులు 

ఆంధ్రప్రదేశ్లో లో 5,367 కోట్ల పెట్టుబడితో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌ పారిశ్రామిక ప్రాంతం, వైఎస్‌ఆర్‌ జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడల అభివృద్ధికి కేంద్రం రెండు ప్రాజెక్టులకు తుది మెరుగులు దిద్దినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ గురువారం వెల్లడించింది.

28 Jun 2024

ఇండిగో

Indigo: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానం టాయిలెట్‌లో పొగ తాగిన ప్రయాణికుడి అరెస్ట్ 

ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో టాయిలెట్‌లో పొగ తాగినందుకు ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.

Parliment: నీట్ అంశంపై పార్లమెంటులో గందరగోళం.. సభా కార్యకలాపాలు జూలై 1కి వాయిదా...  

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శుక్రవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ ప్రారంభమైంది.

Hemant Soren: భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌కు బెయిల్ 

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు నుంచి ఊరట లభించింది.

28 Jun 2024

దిల్లీ

Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలి ఒకరు మృతి; నిలిచిపోయిన విమాన కార్యకలాపాలు 

కుండపోత వర్షాల కారణంగా దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిస్థితి అధ్వాన్నంగా మారింది.ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి.

28 Jun 2024

కర్ణాటక

Karnataka: పుణె-బెంగళూరు హైవేపై బస్సు ట్రక్కు ఢీకొని 13 మంది మృతి

కర్ణాటకలోని హవేరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.

28 Jun 2024

ముంబై

Mumbai: ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన వేలి అసలు రహస్యం బయటపడింది.. షాక్ కి గురిచేస్తున్న డీఎన్‌ఏ రిపోర్ట్  

ముంబైలోని మలాద్ ప్రాంతంలోని ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మానవ వేలు కనిపించింది. ఈ వేలు ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

28 Jun 2024

ఒడిశా

ABHYAS: విజయవంతంగా ట్రయల్స్‌ని పూర్తి చేసిన హై-స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ 'అభ్యాస్'  

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో ఘనతను సాధించింది.

28 Jun 2024

దిల్లీ

Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం..  పైకప్పు కూలి 6 మందికి గాయాలు  

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు.

Parliament Session 2024: నేటి నుంచి ధన్యవాద తీర్మానంపై చర్చ.. నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షాలు 

లోక్‌సభ ప్రత్యేక సెషన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై పార్లమెంట్ ఉభయ సభల్లో నేటి(శుక్రవారం) నుంచి చర్చ ప్రారంభం కానుంది.

Droupadi Murmu: 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత చికిత్స ప్రయోజనం పొందుతారు: ముర్ము 

ఇప్పుడు 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత చికిత్స ప్రయోజనం లభిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తెలిపారు.

27 Jun 2024

తెలంగాణ

Telangana: కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా  

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

27 Jun 2024

కేరళ

kerala: రైలు మిడిల్ బెర్త్ పడి  కేరళ వ్యక్తి మృతి  

కేరళకు చెందిన 60 ఏళ్ల వ్యక్తిపై గత వారం ట్రైన్ లోని మిడిల్ బెర్త్‌కు సపోర్టింగ్‌గా ఉన్నహుక్‌ తెగి పడటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.