ప్రకటన: వార్తలు

2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO

రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈరోజు జరిగిన సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది.

ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు

ఏప్రిల్ 15 నుండి ప్రారంభమయ్యే పోల్స్‌లో ధృవీకరణ అయిన ట్విట్టర్ ఖాతాలకు మాత్రమే ఓటు వేయడానికి అర్హత ఉంటుందని ఎలోన్ మస్క్ సోమవారం ప్రకటించారు.

7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023ని సమర్పిస్తున్నప్పుడు, ఇప్పటికే ఉన్న కొన్ని పొదుపు పథకాలలో కీలకమైన మార్పులతో పాటు, కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లను మార్చడానికి ప్రకటనలు చేశారు. ఆర్థిక మంత్రి మహిళల కోసం మహిళా సమ్మాన్ పొదుపు పథకం కూడా ప్రకటించారు.

ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్

ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ ప్రకారం,ఫ్లిప్ కార్ట్ పెద్దమొత్తంలో నియామకాన్నిచేపట్టదు, ఎందుకంటే దానివలన ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగ కోతలు చేయాల్సి వస్తుందన్నారు.

భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం

ఈ ఏప్రిల్‌లో భారతదేశంలో BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలు అమలులోకి రావడంతో, వాహన తయారీదారులు అప్డేట్ చేసిన మోడళ్లను పరిచయం చేస్తున్నారు. కాబట్టి, ఫిట్‌నెస్ లేని వాహనాలు ఇకపై రోడ్ల మీదకు రావు. 2021లో ప్రవేశపెట్టిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీ తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్షల నుండి పాత వాహన యజమానులకు ప్రోత్సాహకాల వరకు, అనేక అంశాలను కవర్ చేస్తుంది.

27 Mar 2023

బ్యాంక్

పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం

US రుణదాత, టెక్ స్టార్టప్ రంగానికి మూలస్తంభమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) కుప్పకూలిన కొన్ని రోజుల తర్వాత, ఫస్ట్ సిటిజెన్స్ బ్యాంక్ షేర్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదైంది. దీనితో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు పౌరులు ఇబ్బందులు పడుతున్నారు.

ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ దాని సోర్స్ కోడ్ సారాంశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన తర్వాత మరో సవాల్ ను ఎదుర్కొంటుంది.

భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఈమధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్రం అందిస్తున్న ప్రయోజనాలతో, చాలా మంది ప్రజలు నగరాల్లో తమ ప్రాథమిక రవాణా మార్గంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (BEVs) ఎంచుకోవడం ప్రారంభించారు.

త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, జర్మన్ మార్క్ వోక్స్‌వ్యాగన్ టైగన్‌ను MY-2024 అప్‌గ్రేడ్‌లతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2021లో లాంచ్ అయిన వోక్స్‌వ్యాగన్ టైగన్ భారతదేశం-నిర్దిష్ట MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించబడిన మొదటి కారు.

లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్

మెడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌లకు ఈ కొనుగోలు మొదటి అడుగు.

బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది

స్వదేశీ బైక్‌మేకర్ బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ 220F తిరిగి ప్రవేశపెట్టింది. ఆ ధర దగ్గర ఐకానిక్ మోటార్‌సైకిల్ క్వార్టర్-లీటర్ స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో TVS అపాచీ RTR 200 4Vతో పోటీపడుతుంది.

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఒకసారి ప్లే చేయగల ఆడియో సందేశాలను పంపచ్చు. ఈ సదుపాయం ఇంకా అభివృద్ధిలో ఉంది, త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

2023 MotoGP రేసును ఎక్కడ చూడాలో తెలుసుకుందాం

2023 MotoGP సీజన్ ఈ వారాంతంలో పోర్చుగీస్ GPతో ప్రారంభమవుతుంది. భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ థ్రిల్లింగ్ ప్రీమియర్-క్లాస్ ఛాంపియన్‌షిప్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ

వినియోగదారులకు సురక్షితమైన సోషల్ మీడియా అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో, భారతదేశంలో ట్విటర్‌కు గట్టి పోటీనిస్తున్న కూ కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.

25 Mar 2023

జియో

రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ప్రస్తుతానికి, రిలయన్స్ జియో భారతదేశంలో మూడు రీఛార్జ్ ప్యాక్‌లను అందిస్తోంది, ఇది వినియోగదారులకు వివిధ కాల వ్యవధిలో రోజుకు 3GB డేటాను అందిస్తుంది. ప్యాక్‌లకు 14-84 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కొనుగోలుదారులకు JioTVతో సహా జియో సూట్ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తాయి.

మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు

నథింగ్ సంస్థ నథింగ్ ఇయర్ (2)ని రూ. 9,999 ధరతో భారతదేశంలో ప్రారంభించింది., నథింగ్ ఇయర్ (2) నథింగ్ ఇయర్ (1) లాగా అనిపించచ్చు, కానీ లోపల చాలా మార్పులు వచ్చాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం

ప్రభుత్వ సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ)ని కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం అంటే ప్రస్తుతమున్న 38 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం

బజాజ్ ఆటో భారతదేశంలో రెండు సంవత్సరాల విరామం తర్వాత పల్సర్ 220Fను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ సంస్థ ఇతర మోడల్స్ పల్సర్ F250, పల్సర్ RS200 ఇదే ధరలో లభిస్తున్నాయి. పల్సర్ 220Fని నిలిపేసిన తర్వాత, 2021లో బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ F250ని లాంచ్ చేసింది.

24 Mar 2023

గూగుల్

యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా గూగుల్ మ్యాప్స్‌ని ఇలా ఉపయోగించచ్చు

నగరం లేదా కొత్త పట్టణంలోని వీధుల్లో నావిగేట్ చేయడం ఎలాగో గుర్తించేటప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎప్పుడూ ఉపయోగపడుతుంది. నావిగేషన్‌ను అమలు చేయడానికి యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా, ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా మ్యాప్స్ వినియోగాన్ని గూగుల్ ఇప్పుడు అందిస్తుంది.

తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S

BYJU'S ప్రపంచంలోనే అత్యంత విలువైన edtech కంపెనీ, ప్రస్తుతం $250 మిలియన్లను సేకరించే పనిలో ఉంది. ఇంతకుముందు కంపెనీ ఇదే మొత్తాన్ని సేకరించినప్పుడు, దాని విలువ 22 బిలియన్ డాలర్లు. అయితే ఈసారి తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరించాలని కంపెనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

24 Mar 2023

టాటా

ఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో భారతదేశంలోని 10 టైర్-2 నగరాల్లో తన ఎలక్ట్రిక్ వాహనాల సిరీస్ కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం దాని Nexon EV సిరీస్, Tiago EV కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలదు.

తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రస్తుత తాజా లక్ష్యం జాక్ డోర్సేస్ బ్లాక్. తాజా నివేదికలో, షార్ట్-సెల్లర్ బ్లాక్ మోసం గురించి, తన పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిన విధానం గురించి ఆరోపించింది.

క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు

2022 నుండి సంవత్సరం నుండి క్రిప్టో పతనం ప్రారంభమైంది. టోకెన్‌లు, NFTల మద్దతుదారులు, అనేక మంది ప్రముఖులు పెట్టుబడిదారులను మోసగించారని ఆరోపించారు.

భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది

భారతదేశం హై-స్పీడ్ ఇంటర్నెట్ విప్లవం తర్వాతి దశలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. 5Gని ప్రవేశపెట్టిన ఐదు నెలల తర్వాత, భారతదేశం తన 6G విజన్‌ని ప్రకటించింది. న్యూఢిల్లీలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ITU) ఏరియా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్ 6G విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి, 6G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించారు.

కొనసాగుతున్న తొలగింపులు: 19,000 మంది ఉద్యోగులను తొలగించిన Accenture

ఐరిష్ ఐటీ సేవల సంస్థ Accenture 19,000 మంది ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న టెక్ తొలగింపులలో ఇది అతిపెద్దది. కంపెనీ తన మూడవ త్రైమాసిక ఆదాయ అంచనాను $16.1 బిలియన్-$16.7 బిలియన్లకు తగ్గించింది. ఆర్థిక మాంద్యం భయాల కారణంగా సంస్థలు ఖర్చు తగ్గించడం వల్ల ఐటీ సేవల సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి.

వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్

కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభంతో US ఫెడరల్ రిజర్వ్‌ను ప్రభావితం చేయడంలో విఫలమైంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడరల్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది వరుసగా తొమ్మిదవ సారి పెరగడానికి కారణం ఉద్యోగాల పెరుగుదల, వేతనాల పెంపుదల, వినియోగదారుల వ్యయం, ద్రవ్యోల్బణం.

మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్

అదానీ గ్రూప్‌పై నివేదికను విడుదల చేసిన US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో కొత్త నివేదికను అందించనుంది. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ప్రకటించకుండా మరో పెద్ద నివేదిక అని మాత్రం పేర్కొంది.

రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా

లగ్జరీ వాహన తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన బ్లాక్ బ్యాడ్జ్ వ్రైత్ బ్లాక్ యారో మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ఒక రెగల్ డిజైన్ తో బెస్పోక్ 'స్టార్‌లైట్ హెడ్‌లైనర్'తో ఉన్న క్యాబిన్‌ ఉంటుంది. కారు గ్లాస్-ఇన్ఫ్యూజ్డ్ టాప్‌కోట్‌తో పెయింట్‌వర్క్‌తో వస్తుంది.

21 Mar 2023

బ్యాంక్

UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది

సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ను UBS స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది భారతీయ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రెండు బ్యాంకుల ఇండియా టెక్నాలజీ బ్యాక్ ఆఫీస్‌లలో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ

అధిక పన్నులు, పేలవమైన రహదారి మౌలిక సదుపాయాలు భారతదేశంలో సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని పరిమితం చేస్తున్నాయని లంబోర్ఘిని గ్లోబల్ సిఈఓ, స్టీఫన్ వింకెల్‌మాన్ అభిప్రాయాన్ని వ్యాకటం చేశారు. దేశంలోని మౌలిక సదుపాయాలు అభివృద్ది ఇంకా వేగంగా జరగాలని అన్నారు.

భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7

iQOO తాజా Z-సిరీస్ మోడల్, iQOO Z7 ఇప్పుడు భారతదేశంలో రూ. 18,999కు అందుబాటులో ఉంది. ఇందులో 90Hz AMOLED స్క్రీన్, 64MP ప్రధాన కెమెరా, డైమెన్సిటీ 920 చిప్‌సెట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ ఉంది. 5G స్మార్ట్‌ఫోన్ గేమింగ్-ఆధారిత ఫీచర్స్ ను అందిస్తుంది.

21 Mar 2023

పన్ను

ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు

దేశీయంగా ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్నును ప్రభుత్వం మంగళవారం టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గించింది.

21 Mar 2023

ఐఫోన్

ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం

Pro సిరీస్ ఐఫోన్‌లు ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి, ఆపిల్ ఫీచర్స్ ను మారుస్తుంది. Pro ఐఫోన్‌ని ఎంచుకున్నప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్, మరింత సామర్థ్యం గల ట్రిపుల్ కెమెరా సెటప్, మెరుగైన డిస్‌ప్లే కూడా ఇందులో ఉంటాయి. ఆపిల్ ఐఫోన్ 15 Pro కూడా అలాగే తేలికగా కనిపించేలా అనుభూతి చెందడానికి ప్రత్యేకంగా రూపొందుతుంది.

స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్

గత ఏడాది సెప్టెంబర్‌లో, నరసింహన్ కంపెనీ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టార్‌బక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు అవుతారని స్టార్‌బక్స్ ప్రకటించింది.

మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్

మరో రౌండ్ ఉద్యోగ కోతలు ప్రారంభించిన టెక్ దిగ్గజం అమెజాన్ తమ AWS క్లౌడ్ యూనిట్, ట్విచ్ గేమింగ్ డివిజన్, అడ్వర్టైజింగ్, PXT (అనుభవం, సాంకేతిక పరిష్కారాలు) ఆర్మ్ వంటి వివిధ వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,000 ఉద్యోగులను తొలగిస్తోంది.

మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా 2023 కారు మార్చి 21న భారతదేశంలోలాంచ్ కానుంది. హ్యుందాయ్ వెర్నా 2023 వెర్షన్ కారును లాంచ్ చేయడానికి హ్యుందాయ్ మోటార్స్ సిద్ధమైంది.

భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం

సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR), నకిలీ మొబైల్ ఫోన్ మార్కెట్‌ను అరికట్టడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ విభాగం (DoT) ద్వారా నిర్వహిస్తుంది.

భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా కిర్లోస్కర్ మోటార్ టయోటా ఇన్నోవా క్రిస్టా 2023ని రూ.19.13 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)కు విడుదల చేసింది.

సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం

గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభాల గురించిన ఆందోళనలతో సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం క్షీణించాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించి 57,177 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 50 17,000 మార్కు దిగువన ఉంది.