ప్రకటన: వార్తలు

ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్

Realme ఫిబ్రవరి 10న భారతదేశంలో కోకా-కోలా-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ Realme మిడిల్ సిరీస్ 10 Pro 5G లాగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

నెలకు $20తో ప్రారంభమైన ChatGPT ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్

OpenAI సంస్థ ChatGPT చుట్టూ ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించి, మనుషుల లాగే మాట్లాడే సామర్థ్యం ఉన్న చాట్‌బాట్ కోసం కంపెనీ కొత్త చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. దీనికి ChatGPT ప్లస్ అని పేరుపెట్టింది, అయితే ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వలన ఉచిత సేవకు ఎటువంటి ఆటంకం ఉండదని ఆ సంస్థ తెలిపింది.

02 Feb 2023

మెటా

అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా

మెటా 2023లో ఆదాయాన్ని మరింత మెరుగ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. 2022 ఆర్ధిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరుతో దాని పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. 2023లో పొదుపుపై దృష్టి పెట్టాలని కంపెనీ ప్రణాళిక వేస్తుంది.

భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ ఎట్టకేలకు భారతదేశంలో తన X1 SUV యొక్క 2023 వెర్షన్‌ను విడుదల చేసింది. కారు సరికొత్త డిజైన్ తో పాటు విలాసవంతమైన టెక్-లోడెడ్ క్యాబిన్‌ తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్ లో లగ్జరీ SUV విభాగంలో వోల్వో XC40కి పోటీగా ఉంటుంది.

యూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ నియామకం

కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలీవర్ సంస్థ సోమవారం తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హీన్ షూమేకర్‌ను ప్రకటించింది. జూలై 1 నుండి అలాన్ జోప్ స్థానంలో హీన్ షూమేకర్‌ కొనసాగుతారు.

28 Jan 2023

కార్

అదరగొట్టే లుక్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి Alto k10 ఎక్స్‌ట్రా ఎడిషన్

మారుతి సుజుకి తన Alto k10 ప్రత్యేక ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను విడుదల చేసింది. కారు సాధారణ మోడల్‌ లాగానే ఉన్నా బయట, లోపల కొన్ని అప్డేట్లతో మార్కెట్లోకి వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఎడిషన్ K10లో స్కిడ్ ప్లేట్లు, ORVMలు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌పై కాంట్రాస్ట్-కలర్ పాప్రికా ఆరెంజ్ హైలైట్‌లను కలిగి ఉంది. ఇది 1.0-లీటర్, K-సిరీస్ ఇంజిన్ తో నడుస్తుంది.

త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT

OpenAI ChatGPTకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో గుబులు పుట్టిస్తుంది. Gmail సృష్టికర్త పాల్ బుచ్‌హీట్ ఈ ChatGPT మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను మించిపోవచ్చని పేర్కొన్నారు. Yellow Pagesకు గూగుల్ ఎలా చెక్ పెట్టిందో అలాగే సెర్చ్ ఇంజన్‌లకు ఈ AI చెక్ పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ప్రకటన ప్రకారం, BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కు రూ.1.69 కోట్లు,అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్‌లకు రూ.63 లక్షలు చెల్లించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సంస్థ గత ఏడాది వీరిద్దరిని BharatPe తొలగించింది. అతని వ్యవస్థాపకుడి పదవిని కూడా తొలగించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు రూ.88 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అతనిపై దావా వేసింది.

25 Jan 2023

గూగుల్

గూగుల్ డిజిటల్ ప్రకటనల గుత్తాధిపత్యంపై యూఎస్ఏ ప్రభుత్వం సీరియస్

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఎనిమిది రాష్ట్రాలు గూగుల్‌పై యాంటీట్రస్ట్ దావాను దాఖలు చేశాయి. కంపెనీ డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.ఈ దావాలో DOJతో చేరిన రాష్ట్రాలలో న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలరాడో, వర్జీనియా ఉన్నాయి.

24 Jan 2023

కార్

భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్)

జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్చి 2023 నాటికి భారతదేశంలో విడుదల చేయనుంది.సరికొత్త సాంకేతిక-ఆధారిత ఫీచర్లతో కొన్ని మార్పులతో అందుబాటులోకి వస్తుంది. డీజిల్ ఇంజిన్ నిలిపివేసి పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ ChatGPT యజమాని OpenAIతో తన భాగస్వామ్యాన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా విస్తరించాలని నిర్ణయించుకుంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ లో OpenAI టెక్నాలజీను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్‌లో ChatGPT పెట్టాలని అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో గూగుల్ వంటి వాటికి గట్టి పోటీనివ్వచ్చు.

24 Jan 2023

ఆపిల్

బగ్ సమస్యలకు సరికొత్త పరిష్కారాలతో ఆపిల్ iOS 16.3 అప్డేట్ విడుదల

ఆపిల్ ఎట్టకేలకు iOS 16.3 అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇది ఐఫోన్ ల భద్రతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఫిజికల్ కీని ఉపయోగించి ఆపిల్ IDని రక్షించుకునే సామర్థ్యాన్ని ఈ అప్‌డేట్ అందిస్తుంది.

టాప్ 5 వాట్సాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం

వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా ఈ ప్లాట్‌ఫారమ్ లో అనేక కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేస్తోంది, వీటిని త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఈ ఫీచర్లలో కొన్ని బీటా టెస్టింగ్ దశలో ఉన్నాయి, మరికొన్ని ఇంకా అభివృద్ధిలో ఉన్నాయి.

23 Jan 2023

కార్

కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW

పాల్ లెఫెవ్రే అనే ఫ్రెంచ్ సర్ఫ్‌బోర్డ్ షేపర్, బిల్డర్ చేతితో చెక్కిన కార్బన్ ఫైబర్ బాడీ ప్యానెల్‌లతో ఒక రకమైన రెస్టో-మోడెడ్ 1969 BMW 1602 కారును ప్రదర్శించారు. తేలికైన పదార్ధాల ఉపయోగం క్లాసిక్ సెడాన్ మొత్తం బరువును 816kgలకు తగ్గించింది. అదే సమయంలో వాహనం నిర్మాణ కూడా ధృడంగా ఉంది.

గ్రూప్ ఇంటరాక్షన్‌ల కోసం ఐఫోన్ లో కొత్త ఫీచర్‌ను విడుదల చేసిన వాట్సాప్

వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇది గ్రూప్ అడ్మిన్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంస్థ ఈ ఫీచర్ ద్వారా అనేక షార్ట్‌కట్‌లను అందిస్తుంది, వీటిని ఉపయోగించి అడ్మిన్‌లు గ్రూప్ లో ఉన్నవారి పై త్వరగా చర్యలు తీసుకోగలరు. యాప్ స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయగల అప్డేట్ వెర్షన్ 23.1.75లో అందుబాటులో ఉంది.

ఐఫోన్ లో ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు

ట్విట్టర్ ఐఫోన్ వినియోగదారులు ట్వీట్‌లను సులభంగా బుక్‌మార్క్ చేసేలా ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుక్‌మార్క్ చేయడానికి వినియోగదారులు ట్వీట్ వివరాల క్రింద ఉన్న బుక్‌మార్క్ బటన్‌పై నొక్కాలి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల విషయానికొస్తే, ఫ్లాగ్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా ఫోల్డర్‌లలో తమకు నచ్చిన ట్వీట్‌లను సేవ్ చేసుకోవచ్చు.

ఫర్నిచర్ వేలం నుండి తగ్గుతున్న ఆదాయం వరకు అసలు ట్విట్టర్ లో ఏం జరుగుతుంది

శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో మిగులు వస్తువులను వేలం వేసి కొంత డబ్బును సేకరించే పనిలో ఉంది ట్విట్టర్. మిగులు కార్యాలయ వస్తువులను విక్రయించడం వలన ట్విట్టర్ ఆదాయం పెరగొచ్చు.

21 Jan 2023

కార్

భారతదేశంలో విడుదలైన Bentley Bentayga EWB Azure, పూర్తి వివరాలు తెలుసుకుందాం

లగ్జరీ కార్ల తయారీ సంస్థ Bentley భారతదేశంలో Bentayga EWB Azure మోడల్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన ఈ Azure వేరియంట్‌లో వెనుక ఎయిర్‌లైన్ సీట్లు, ఆటోమేటిక్ సాఫ్ట్-క్లోజింగ్ డోర్లు, మొత్తం ఫ్లోర్‌ను కవర్ చేసే 'డీప్ పైల్ ఓవర్' మ్యాట్‌లు, ప్రీమియం నైమ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ SUV 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది.

ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి

సామ్ సంగ్ Galaxy Buds Live ఇప్పుడు అతి తక్కువ ధరకు అంటే కేవలం రూ. 3,999 అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆరు గంటల సేపు యాక్టివ్ గా ఉంటాయి. దీనికి ఛార్జింగ్ కేస్ 472mAh బ్యాటరీ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌ కూడా సపోర్ట్ చేస్తుంది.

21 Jan 2023

గూగుల్

గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్

టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపు సీజన్ నడుస్తుంది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ ఇంక్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరింది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ సుమారు 12,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.

రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్‌

నెట్‌ఫ్లిక్స్‌ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సహ-వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సిఈఓ పదవి విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. కంపెనీ అద్దె ద్వారా మెయిల్ DVD సేవ నుండి ఎంటర్టైన్మెంట్ వేదికగా ఎదిగేవరకు అతను రెండు దశాబ్దాలుగా ఈ పదవిలో కొనసాగారు.

ఇక స్విగ్గీ వంతు, 380 మంది ఉద్యోగుల తొలగింపు

భారతదేశపు స్టార్టప్‌లలో ఒకటైన స్విగ్గీ ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది. దాదాపు 380 మంది సిబ్బందిని తొలగించింది. దేశంలోని స్టార్టప్ వ్యవస్థను మరింతగా కుదిపేసే నిర్ణయం ఇది. ఈరోజు టౌన్ హాల్‌లో ఉద్యోగులకు ఈ తొలగింపుల గురించి సంస్థ తెలిపింది.

20 Jan 2023

ఆపిల్

ఉష్ణోగ్రతను, తేమను చెక్ చేసే సరికొత్త ఆపిల్ స్మార్ట్ స్పీకర్

ఆపిల్ రెండవ తరం Homepod స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసింది. సంగీతాన్ని ప్లే చేయడంతో పాటు, ఇది ఇప్పుడు గది ఉష్ణోగ్రత, తేమను చెక్ చేస్తుంది. రెండు Homepods కనెక్ట్ చేసి స్టీరియో లాగా మార్చచ్చు. స్టీరియోగా మార్చడానికి వినియోగదారులు అదే మోడల్‌లోని Homepodను ఉపయోగించాల్సి ఉంటుంది.

టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్

టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ తెలిపింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ ఓడరేవుల నుండి ఇంధనం వరకు వ్యాపారాన్ని విస్తరించి ఇప్పుడు మీడియా కంపెనీని కూడా కొనుగోలు చేసారు. కానీ టెలికాం రంగానికి మాత్రం దూరంగా ఉండిపోయారు.

19 Jan 2023

బైక్

విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం

స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో లియో ఈ-స్కూటర్ హై-స్పీడ్ వెర్షన్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 81,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120కిమీల వరకు నడుస్తుంది. ఈ నెల నుండి ఆ బ్రాండ్ షోరూమ్ లో అందుబాటులో ఉంటుంది.

ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం

ట్విట్టర్ ఆర్థికంగా కష్టాల్లో పడింది. దాని కొత్త సిఈఓ ఎలోన్ మస్క్ కంపెనీ ఆ కష్టాలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, అందులో విజయం సాధించలేకపోతున్నారు. ట్విట్టర్ రీలింగ్ ప్రకటన వ్యాపార ప్రభావం ఆ సంస్థ ఆర్ధిక స్థితి మీద పడుతోంది. ఈ సంస్థను మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి 500 మంది ప్రకటనదారులు ట్విట్టర్‌లో ఖర్చు పెట్టడం మానేశారు.

త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్

వాయిస్ సందేశాన్నిస్టేటస్‌గా పోస్ట్ చేసుకునే అవకాశం త్వరలో వాట్సాప్ తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఫీచర్‌తో, టెక్స్ట్‌కు బదులుగా వాయిస్ క్లిప్‌లను రికార్డ్ చేసి పోస్ట్ చెయ్యచ్చు. పేరెంట్ సంస్థ మెటా ఆండ్రాయిడ్ ఛానెల్‌లోని కొంతమంది బీటా వినియోగదారులకు ఈ అప్‌డేట్ వెర్షన్ 2.23.2.8ను విడుదల చేసింది.

415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు

FTX కష్టాలు త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. దానికి కారణం ఇప్పటికే దివాళా తీసిన FTX US ప్లాట్‌ఫారమ్ నుండి $90 మిలియన్లు, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ నుండి $323 మిలియన్లతో సహా దాదాపు $415 మిలియన్ల విలువైన క్రిప్టోను హ్యాకర్లు దొంగిలించారని సిఈఓ జాన్ J. రే III తెలిపారు.

18 Jan 2023

గూగుల్

సొంత UPI సౌండ్‌బాక్స్‌ను లాంచ్ చేసిన గూగుల్

UPI చెల్లింపులు ఎక్కువగా చేసేది భారతీయులే. ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం ఒక్కోసారి వ్యాపారులకు కష్టంగా మారుతుంది. సౌండ్‌బాక్స్, వాయిస్ అలర్ట్ ద్వారా పూర్తయిన చెల్లింపు గురించి వ్యాపారులకు తెలియజేసే ఈ డివైజ్ లావాదేవీలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం

కొత్త ప్రత్యక్ష పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిని ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తీసుకుంటుంది.

కంటెంట్ క్రియేటర్ల కోసం రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatoven.ai

కంటెంట్ క్రియేటర్లు కంటెంట్‌ను ఆకర్షణీయంగా చేయడానికి సంగీతంపై ఎక్కువగా ఆధారపడతారు. కానీ అటువంటి సంగీతానికి కాపీరైట్ సమస్యలను ఎదుర్కుంటున్నారు. Beatoven.ai, భారతదేశంలో మొట్టమొదటి AI-సపోర్ట్ చేసే మ్యూజిక్ ను అందిస్తుంది.

స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి తయారుచేసిన మాడా 9 అనే సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది తాలిబాన్. ENTOP అనే సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది. అద్భుతమైన పనితీరుతో పాటు స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ కార్ టయోటా కరోలా ఇంజిన్ తో నడుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశముంది.

ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం

భారతి ఎయిర్‌టెల్ ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ఐదు ప్రధాన నగరాల్లో 5G ప్లస్‌ను ప్రారంభించింది. ఈ కవరేజీని వినియోగదారుల నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై-స్పీడ్ 5G కనెక్టివిటీ సేవను అందిస్తుంది ఎయిర్ టెల్. ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే వ్యక్తులు 5G ప్లస్‌లో 20-30 రెట్లు వేగాన్నివినియోగదారులు చూస్తారు.

టెక్ దిగ్గజ సంస్థల బాటలో షేర్ చాట్, 20% ఉద్యోగుల తొలగింపు

100 మంది ఉద్యోగులను తొలగించిన ఒక నెల తర్వాత, స్వదేశీ సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ ఇప్పుడు 20% మంది ఉద్యోగులను తొలగించింది. ఈ స్టార్టప్ తన ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం గురించి ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.

ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు

నోటిఫికేషన్‌ల నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. పేరెంట్ సంస్థ మరో బ్లాక్ షార్ట్‌కట్‌పై పని చేస్తోంది. అయితే అది చాట్ లిస్ట్ నుండి యాక్సెస్ చేయాలి. రెండు ఫీచర్‌లు ప్రస్తుతం డెవలప్‌మెంట్, టెస్టింగ్‌లో ఉన్నాయి. రాబోయే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత

అమెజాన్ మరోమారు ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఈ నెలలో భారతదేశంలోని సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ సంస్థ ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి ఉద్యోగి తెలిపారు.

పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ

బెంగుళూరుకు చెందిన రైడ్-షేరింగ్ కంపెనీ ఓలా ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. కంపెనీ కొన్ని విభాగాల నుండి దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే సిబ్బంది సంఖ్యను ఓలా ఇంకా నిర్ధారించలేదు.

#DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే

నథింగ్ ఫోన్ కి సంబంధించిన హైప్ కొంతవరకు తగ్గింది అయితే భారతదేశంలో ఇది మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ ఫోన్ అద్భుతమైన విజువల్ ఎలిమెంట్స్‌తో మంచి ఫీచర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత ఆఫర్‌లతో, ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకు పొందవచ్చు.

భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్

ఫిబ్రవరి 1న జరిగే Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ సిరీస్‌ను ప్రారంభించనున్నట్లు సామ్ సంగ్ సృష్టం చేసింది. భారతదేశంలో లాంచ్ కి ముందే ప్రీ-బుకింగ్‌లకు మొదలయ్యాయి. ఈ సిరీస్ లో S23, S23 ప్లస్, S23 అల్ట్రా మోడల్‌లు ఉంటాయి. హ్యాండ్‌సెట్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వారికి రూ. 5,000 విలువైన ఇ-వోచర్ తో పాటు అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.

జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి

రిలయన్స్ జియో తన 5G సేవలను ఉత్తరాఖండ్‌కు అందుబాటులోకి తెచ్చింది. అర్హత ఉన్న వినియోగదారులు జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఆహ్వానించబడటంతో పాటు ఉచితంగా 1Gbps వేగంతో అపరిమిత డేటాను పొందుతారు.

మునుపటి
తరువాత