క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

రాణించిన అక్షర్, టీమిండియా 400 పరుగులకు ఆలౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 400 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. మార్చి 4వ తేదీ నుంచి ముంబయిలో ఐదు జట్లతో తొలి సీజన్ ప్రారంభం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని ఇండియా కన్సల్టెంట్స్ సంస్థలో భాగస్వామి అయినా మలికా అద్వానీ వేలాన్ని పర్యవేక్షించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మొదటి టెస్టు వైభవంగా ప్రారంభమైంది. అయితే మూడో టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. దీనిపై క్లారిటీ రావడం లేదు.

సెమీఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా ఓటమి

క్వార్టర్ ఫైనల్లో జరిగిన పోరులో ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా 2023 అబుదాబి ఓపెన్ సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 లో ఫైనల్‌కు చేరిన రెబాకినా మూడు సెట్లలో ఓడిపోయి నిరాశ పరిచింది.

లక్నో ఫ్రాంచైజీకి యుపీ వారియర్జ్‌గా నామకరణం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీకి యూపి వారియర్జ్‌గా నామకరణం చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీ యజమానులైన కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 757 కోట్లను పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న జోన్ లూయిస్‌ ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించారు.

మొదటి టెస్టులో అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లు

బోర్కర్ గవాస్కర్ తొలి టెస్టులో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఆసీస్ పై భారత్ అధిక్యంగా దిశగా ముందుకెళ్తోంది. ఇప్పటికే 144 పరుగుల అధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో పాటు, ఆలౌరౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడడం వల్లే టీమిండియా సత్తా చాటింది.

37 టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించే క్రికెటర్ విరాట్ కోహ్లీనే అని క్రికెట్ దిగ్గజాలు చెబుతుంటారు. అయితే టెస్టులో మాత్రం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. గత 37 టెస్టు ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ కూడా చేయకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

భారత్ క్రికెట్ చరిత్రలో రోహిత్‌శర్మ అరుదైన రికార్డ‌ు

భారత్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్‌కూ సాధ్యం కానీ రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటో సెంచరీ చేయడంతో ఈ ఘనతను రోహిత్ సాధించాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లోనూ సెంచరీలు సాధించిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. టెస్టులో మొత్తం 9 సెంచరీలు సాధించిన ఆటగాడి నిలిచాడు.

సూపర్ సెంచరీతో అదరగొట్టిన మార్కరమ్, ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్

సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను 14 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడించింది.

టీమిండియాకి పెద్ద షాక్.. జస్ప్రిత్ బుమ్రా టెస్టులకు దూరం

టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ ఉన్నందున బోర్డర్ గవాస్కర్ ట్రోఫికి దూరమైనట్లు తెలుస్తోంది.

క్వార్టర్స్‌కు చేరుకున్న వింబుల్డన్ ఛాంపియన్ రిబాకినా

ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా మరోసారి చెలరేగింది. 2023 అబుదాబి ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకొని సత్తా చాటింది. రౌండ్ ఆఫ్-16 క్లాష్‌లో కరోలియా ప్లిస్కోవాపై విజయం సాధించింది.

మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు చుక్కులు చూపించిన ఇండియా బౌలర్లు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతోన్న మొదట టెస్టులో మొదటి రోజు ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 177 పరుగులకే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి ఆసీసీ బ్యాటర్ల నడ్డి విరిచాడు.

09 Feb 2023

జడేజా

జడేజా దెబ్బకు ఆస్ట్రేలియాకు మైండ్ బ్లాంక్

గతేడాది గాయానికి గురై కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మొదటి టెస్టులో విజృభించాడు. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఆసీస్ వెన్ను విరిచాడు. జడేజా ఐదు కీలక వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్‌లలో 100 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

ఫైనల్‌కు దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్

ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ కు రియల్ మాడ్రిడ్ దూసుకెళ్లాడు. ఈజిప్టుకు చెందిన ఆల్ అహ్లీని 4-1తో ఓడించి రియల్ మాడ్రిడ్ సత్తా చాటాడు. అనంతరం సౌదీ అరేబియా జట్టుకు చెందిన అల్ హిలాల్‌తో తలపడనున్నారు. రియల్ తరఫున వినిసియస్, ఫెడెరికో వాల్వెర్డే, రోడ్రిగో, సెర్గియో అర్రిబాస్ గోల్స్ చేశారు. అంతకుముందు, అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే.

టెస్టులో చరిత్రను తిరగరాసిన రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా వెటనర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో చరిత్రను సృష్టించాడు. టెస్టు క్రికెట్లో 450 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాగపూర్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో అలెక్స్ క్యారీని అశ్విన్ ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు.

మొదటి టెస్టులో రాణించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషాగ్నే

నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టపటపా వికెట్లను కోల్పోయింది.

దోహా, దుబాయి లీగ్ నుండి తప్పుకున్న ఒన్స్ జబీర్

ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఒన్స్ జబీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈనెల చివరిలో డబ్య్లూటీఎ టోర్నమెంట్ లు, ఖతార్ ఓపెన్, దుబాయి టెన్నిస్ ఛాంపియన్ షిప్ నుండి తప్పుకుంటున్న బుధవారం పేర్కొంది. ఈ ఏడాది చివర్లో చిన్న సర్జరీ చేయించుకుంటానని, అందువల్ల ఈ సిరీస్ దూరమవుతున్నట్లు తెలియజేసింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్ షమీ సంచలన రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సంచనల రికార్డును సృష్టించాడు. షమీ అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లను పడగొట్టి చరిత్రకెక్కాడు. ఈ మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా షమీ నిలిచాడు.

డ్రాగా ముగిసిన ముంచెస్టర్ యునైటెడ్, లీడ్స్ యునైటెడ్ మ్యాచ్

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన కీలకమైన ప్రీమియర్ లీగ్ 2022-23 ఎన్‌కౌంటర్‌లో మేనేజర్‌లెస్ లీడ్స్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్

నాగ్ పూర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కేఎస్.భరత్ చోటు దక్కించుకున్నాడు. భరత్‌కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్‌ను సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా అందజేశారు.

టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీ20 నెం1.ప్లేయర్

భారత్ టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు నెరవేరింది. అంతర్జాతీయ టీ20, వన్డేలో అదరగొట్టిన సూర్య.. ప్రస్తుతం టీమిండియా తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.

బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్

స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే భారత్‌కి కనీసం మూడు విజయాలు కావాలి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

మార్టా కోస్ట్యుక్‌ను చిత్తు చేసిన బెలిండా బెన్సిక్

అబుదాబి ఓపెన్ 2023లో బెలిండా బెన్సిక్ విజయపరంపర కొనసాగుతోంది. బుధవారం మార్టా కోస్ట్యుక్‌ను వరుస సెట్లతో ఓడించి క్వార్టర్స్ కు చేరుకుంది. మార్టా కోస్ట్యుక్‌పై (6-4, 7-5)తో బెలిండా బెన్సిక్ విజయం సాధించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెన్సిక్ రెండో సెట్‌లో 5-3తో మొదట వెనుకబడింది. అయితే 1.35 నిమిషాల తర్వాత 57వ ర్యాంక్ కోస్ట్యుక్‌పై వరుస సెట్లలో చిత్తు చేసింది.

వెస్టిండీస్‌కి ధీటుగా బదులిచ్చిన జింబాబ్వే, డ్రాగా ముగిసిన మొదటి టెస్టు

జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య బులవాయో వేదికగా మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ లో 54 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులను చేసింది.

టీ20 నెం.1 ప్లేయర్‌కి టెస్టులోకి చోటు దక్కేనా..?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడిస్తేనే భారత్ ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు నాగ్‌పూర్ లోని VCA స్టేడియంలో ప్రారంభం కానుంది.ఇండియా స్వదేశంలో 2017లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి టెస్టు ఆడే ప్లేయర్స్ ఎంపికలో టీమిండియా ఆచూతూచి వ్యవరిస్తోంది.

ఇషాన్ కిషన్ వర్సెస్ కెఎస్ భరత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.‌

ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్

NBAలో లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. కరీమ్ అబ్దుల్-జబ్బాను అధిగమించి ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును సృష్టించాడు. బుధవారం ఓక్లహోమా సిటీ థండర్‌తో జరిగిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ గేమ్‌లో కరీమ్ అబ్దుల్-జబ్బార్ రికార్డును బద్దలు కొట్టి సత్తా చాటాడు.

ఫ్లెమెంగో‌ను ఓడించిన సౌదీ అరేబియా జట్టు

మొరాకోలోని టాంజియర్‌లో జరుగుతున్న ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో సౌదీ అరేబియా క్లబ్ అద్భుతాన్ని సృష్టించింది. అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో విజయం సాధించింది. కబ్ల్ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా సౌదీ అరేబియా క్లబ్ చరిత్రలో నిలిచింది.

FA కప్ 2022-23లో షెఫీల్డ్ యునైటెడ్ విజయం

FA కప్ 2022-23 రీప్లేలో రెక్స్‌హామ్ ఓటమి పాలైంది. షెఫీల్డ్ యునైటెడ్ రెక్సహామ్ పై 3-1తేడాతో విజయాన్ని నమోదు చేసింది. యునైటెడ్ టోటెన్‌హామ్ హాట్‌స్‌పుర్‌తో 5వ రౌండ్ క్లాష్‌ను ఏర్పాటు చేయడానికి రెండు ఆలస్య గోల్‌లను సాధించడం గమనార్హం.

భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్

ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్లు టెస్టులో తలపడితే అభిమానులకు అంతకుమంచి కిక్ ఏముంటుంది. ఉత్కంఠభరిత సమరాలకు వేదికగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

సెలెర్నిటానాపై 3-0తో జువెంటస్ సంచలన విజయం

సీరీ A 2022-23 సీజన్‌లో 21వ మ్యాచ్‌డేలో భాగంగా జువెంటస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. సలెర్నిటానాపై 3-0తో విజయఢంకా మోగించింది. మధ్యలో ఫిలిప్ కోస్టిక్ ఒకరిని జోడించగా.. దుసాన్ వ్లహోవిచ్ బ్రేస్ గోల్ చేశాడు. ప్రస్తుతం సీరీ A 2022-23 స్టాండింగ్స్‌లో 10వ స్థానానికి జువెంటస్ చేరుకుంది.

పాకిస్తాన్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం, 2 ఏళ్లపాటు ఆటగాడిపై నిషేధం

మ్యాచ్ ఫిక్సింగ్ లో పాక్ ఆటగాళ్లు మరోసారి బయటపడ్డారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం మరో పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఈ మహమ్మరికి బలి అయ్యారు.

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన కమ్రాన్ అక్మల్

పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలే జాతీయ సెలక్షన్ కమిటీగా ఎంపికైన అక్మల్.. ప్రస్తుతం తన కొత్త పాత్రపై దృష్టి సారించాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యాక్షన ప్లాన్ ఇదే..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.‌

నాగపూర్‌లో టెస్టు సమరానికి సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా

గత రెండు దశాబ్దాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఎన్నో రికార్డులు, ఘనతలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రపంచ క్రికెట్లో అన్నింటికంటే అత్యత్తుమ టెస్టు పోరుగా మార్చేశాయి. ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌పై రెండు జట్లు సమరం మొదలైంది.

తగ్గేదేలే అంటున్న ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాన్ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మార్ఫీ తన బౌలింగ్‌లో ప్రత్యర్థుల బ్యాటర్లకు ఇబ్బంది పెట్టే సత్తా ఉంది.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల రేసులో గిల్, సిరాజ్

అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి.. గౌరవించడం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి 2021లో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ప్రవేశపెట్టిన విషం తెలిసిందే. 2023 జనవరికి సంబంధించి నామినీల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది.

సూపర్ రికార్డుకు చేరువలో హర్మన్ ప్రీత్ కౌర్

భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉంది. ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆ ఫీట్‌ను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 60 పరుగులు సాధిస్తే ఆ మైలురాయిని అందుకొనే అవకాశం ప్రస్తుతం ఉంది.

అక్షర పటేల్ ఔట్.. కుల్దీప్ ఇన్..?

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. మరో మూడ్రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు తెరవేవనుంది. గురువారం నుంచి నాగపూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో టీమిండియా పట్టు సాధించాల్సి ఉంది.

అరుదైన రికార్డు చేరువలో కింగ్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య కొద్దిరోజుల్లో బోర్కర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్ పైనే ఉంది. ఈ సిరీస్‌లో పలు రికార్డులు బద్దలు కావడానికి టెస్టు సిరీస్ వేదిక కానుంది. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం ఓ ప్రత్యేకమైన మైలురాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.