టీమిండియా: వార్తలు

అనుష్క శర్మతో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన విరాట్ కోహ్లీ

మైదానంలో తన బ్యాట్‌తో బౌండరీల వర్షం కురిపించే కోహ్లీ బ్యాట్ వదిలేసి సడన్‌గా రాకెట్ పట్టాడు. తన భార్య అనుష్కశర్మతో కలిసి కోహ్లీ బ్యాడ్మింటన్ ఆడాడు.

సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ సెంచరీలపై ఓ లుక్కేయండి

రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సచిన్ టెండుల్కర్.. క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. ఇప్పటికీ సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన ఛతేశ్వర్ పుజారా

టెస్టు స్పెషలిస్ట్ ఛతేశ్వర్, టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా కౌంటీ ఛాంపియన్ ఫిప్‌లో విజృంభించారు. ససెక్స్ కెప్టెన్ గా వ్యవహరించిన పుజారా అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీతో సత్తా చాటాడు. 115 పరుగులు చేసి ససెక్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ససెక్స్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.

కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలి : రికీ పాంటింగ్

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నిలో టీమిండియా టైటిల్ ఫెవరెట్‌గా నిలిచింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో నిష్క్రమించిన టీమిండియా, 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీస్‌లో ఓడిపోయింది. అయితే ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు కోరుతున్నారు.

ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు

టీమిండియా క్రికెటర్ పృథ్వీషా మరోసారి క్రికేటేతర కారణాలతో వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్లో 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అడుతున్న ఈ స్టార్ ప్లేయర్ పై ముంబైలో కేసు నమోదైంది. అతనిపై ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ వేధింపుల కేసు పెట్టింది.

టీమిండియా మాజీ ఓపెనర్ మృతి

టీమిండియా మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ మృతి చెందాడు. గత నెలలో బాత్ రూంలో జారి పడటంతో తలకు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన నిన్ని రాత్రి మృతి చెందాడు.

టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది.

భారత్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. చేతులెత్తిసిన టీమిండియా

ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2తో కోల్పోయింది. తొలి నుంచి భారత్ గెలుపు దిశగా సాగగా.. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లింది.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్..!

వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా టీమిండియా కప్పును కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

IND vs AUS: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపెవరిదో..!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ని 1-1తో సమం చేసింది. మూడో వన్డే మార్చి 22న చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..!

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడో వన్డేలో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుండటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.

సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్

టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యకంగా పరిచయం అక్కర్లేదు. క్రీజులోకి దిగితే బౌండరీ వర్షం కురింపించే సెహ్వాగ్.. బ్యాటింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

లెజెండ్ లీగ్ 2023 విన్నర్‌గా ఆసియా లయన్స్

లెజెండ్ లీగ్ క్రికెట్ సమరంలో ఆసియా లయన్స్ విజేతగా అవతరించింది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో వరల్డ్ జెయింట్స్‌ను ఆసియా లయన్స్ ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

మార్ష్, హెడ్ సూపర్ ఇన్నింగ్స్, ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ

భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకే ఆలౌటైంది.

రెండో వన్డేలో పరువు కోసం ఆసీస్.. సిరీస్ కోసం భారత్

ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో వన్డేలో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.

తొలి వన్డేలో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్

టీ20, టెస్టులో వరుసగా విఫలమవుతూ టీమ్‌లో చోటు కోల్పోయిన టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ వన్డేల్లో సత్తా చాటాడు. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాని అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకొని.. కేఎల్ రాహుల్ ఘన విజయాన్ని అందించాడు. 91 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు.

నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 189 పరుగులు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. మొదటగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు.

టీమిండియా, ఆస్ట్రేలియా వన్డే సమరానికి సర్వం సిద్ధం

భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను ఓడిన ఆస్ట్రేలియా.. టీమిండియాతో వన్డే సమరానికి సిద్ధమైంది. శుక్రవానం నుంచి మొదటి వన్డేలో టీమిండియాను ఆస్ట్రేలియా ఢీకొట్టనుంది. ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1 భారత్ కైవసం చేసుకుంది. టీమిండియాకు హార్ధిక్ పాండ్యా, ఆస్ట్రేలియాకు స్టీవ్‌ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

'నాటు నాటు' పాటకు స్టేప్పులేసిన సురేష్ రైనా, హర్భజన్

చిత్రం ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఎంతోమంది ఈ పాటకు స్టెప్పులు లేస్తూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి టీమిండియా క్రికెటర్లు కూడా చేరారు.

WTC: వికెట్ కీపర్ ఎంపికపై డైలామాలో టీమిండియా

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా జూన్ 7న తలపడనున్నాయి. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1తో టీమిండియా ఓడించింది.

మైఖేల్ వాన్‌కు వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్

టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అనేక సార్లు మాటల యుద్దానికి దిగారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న కెప్టెన్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ.. బీసీసీఐ క్లారిటీ..!

టీమిండియా స్టార్ ఆలౌరౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్ధిక్ వన్డేలు, టీ20లను మాత్రమే ఆడతున్నాడు.

ఆస్ట్రేలియా మీడియాపై మండిపడ్డ సునీల్ గవాస్కర్

ఇండియా పిచ్‌ల గురించి ఆస్ట్రేలియా మీడియా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. భారత్ పిచ్‌లను 'పిచ్ డాక్టరింగ్' అంటూ కాస్త కఠినంగా ఆస్ట్రేలియా మీడియా వ్యవహరిస్తోంది.

లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చేసిందోచ్..!

లెజెండ్స్ లీగ్ క్రికెట్ కొత్త సీజన్ మార్చి 10 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ ఇండియా మహరాజాస్, ఏసియా లయన్స్ మధ్య జరగనుంది. ఈసారి ఈ టోర్నీ ఖతార్ లోని దోహాలో జరగనుంది.

టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆకరి టెస్టు అహ్మదాబాద్‌లో జరుగుతోంది. తొలి మూడు టెస్టులో రెండింటిలో నెగ్గిన భారత్ 2-0తో అధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా అడుగు పెట్టనుంది.

బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ సెలబ్రేషన్స్

అహ్మదాబాద్ టెస్టును గెలవాలని టీమిండియా శ్రమిస్తోంది. ఇండోర్‌లో ఓటమి తర్వాత అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధించి ఐసీసీ టెస్టు చాంఫియన్ షిప్‌కు అర్హత సాధించాలని టీమిండియా భావిస్తోంది. కాగా, టీమ్ భారత టీం బస్సులోనే హోలీ సంబరాలు చేసుకున్నారు.

ODI Tickets: 10 నుంచి విశాఖ వన్డే టికెట్ల అమ్మకం

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 19న జరిగే రెండో వన్డే టికెట్ల అమ్మకం ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్‌లో ఈనెల 13 నుంచి టికెట్లు విక్రయాలు జరగనున్నాయి. ఆఫ్ లైన్ లో టికెట్ల అమ్మకాల కోసం నగరంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Ind Vs Aus: నాలుగో టెస్టుకు స్టార్ బౌలర్ షమీ రీ ఎంట్రీ

భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 9న నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇండోర్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. ప్రస్తుతం చివరి టెస్టుపై దృష్టి సారించింది. నాలుగో టెస్టు కోసం మహ్మద్ షమీని మళ్లీ జట్టులోకి తీసుకోబోతున్నారు. మూడో టెస్టులో షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ వచ్చాడు. ప్రస్తుతం షమీ కోసం ఎవరిని రిజర్వ్ బెంచ్ పై కుర్చోబెడతారో వేచి చూడాల్సిందే.

ఆస్ట్రేలియా సెలెక్టర్లు రాజీనామా చేయాలన్న గవాస్కర్

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వివాదంగా మారుతోంది. పిచ్‌పై విమర్శలు రోజు రోజుకు ఎక్కువతున్నాయి. ముఖ్యంగా ఆసీస్ మాజీ క్రికెటర్లు టీమిండియా నాగ్‌పూర్‌ను పిచ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు.

IND vs AUS: భారత ఓటమిపై గవాస్కర్ అసక్తికర కామెంట్స్

స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో ఓడిపోవడం చాలా అరుదైన విషయం. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మూడో టెస్టులో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

IND vs AUS: 3వ టెస్టులో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించడంపై చాట్ జీపీటీ సమాధానం

సాంకేతిక ప్రపంచంలోకి విప్లవాత్మకంగా దూసుకొచ్చిన చాట్ జీపీటీ ఎన్నో సంచనాలను సృష్టిస్తోంది. ఈ కొత్త తరం సెర్చ్ ఇంజిన్ నెటిజన్లను బాగా అకట్టుకుంటోంది. ఈ టూల్ తో మాట్లాడేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. టీమిండియా రాహుల్ పేలవ ఫామ్‌ గురించి సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.

T20 World Cup Semi final లో తలపడనున్న భారత్- ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ సెమీ‌ఫైనల్ జట్లు ఏవో తెలిసిపోయాయి. గురువారం కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్-1 మ్యాచ్‌లో భారత్ జట్టు తలపడనుంది. శుక్రవారం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్ 2లో ఢీకొట్టనున్నాయి.

కొత్త జెర్సీతో దర్శమివ్వనున్న టీమిండియా ఆటగాళ్లు..!

టీమిండియా జెర్సీ మరోసారి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూరోప్ బ్రాండ్ అడిదాస్ రూపొందించనున్న కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అడిడాస్‌తో ఐదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

పృథ్వీషాపై రివర్స్ కేసు.. అసభ్యంగా తాకాడని ఆరోపణ

భారత్ క్రికెటర్ పృథ్వీ షా సెల్పీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్ సప్నా గిల్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రాహుల్‌ను వైస్ కెప్టెన్ నుంచి తప్పించడంపై హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన ఫెయిల్యూర్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన ఆటతీరుతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఆసీస్ మాజీ సారిథి మార్క్ వా- దినేశ్ కార్తిక్ మధ్య మాటల యుద్ధం

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీసారిథి మార్క్ వా-దినేష్ కార్తీక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వా-నేనా అంటూ ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఫీల్డ్ గురించి మాట్లాడిన మార్క్ వా.. దినేష్ కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వంద టెస్టులు ఆడి చతేశ్వర్ పుజారా అరుదైన ఘనత

టీమిండియా వర్సస్ ఆస్ట్రేలియా రెండో టెస్టులో మ్యాచ్ చతేశ్వర్ పుజారా వంద టెస్టులు ఆడి అరుదైన ఘనతను సాధించారు. ఈ మైలురాయిని సాధించిన 13వ టీమిండియా ఆటగాడిగా పుజారా నిలిచారు. పుజారా పది సంవత్సరాలుగా టెస్టులో ఆడుతూ మెరుగ్గా రాణిస్తున్నాడు. పుజారా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టులో నంబర్ త్రీ బ్యాటర్ గా నిలవడం గమనార్హం.

కేఎల్ రాహుల్‌పై నాకు కోపం లేదు : మాజీ పేసర్

భారత్ క్రికెట్ జట్టుకు టెస్టులో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టులో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు.