భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

08 May 2023

కేరళ

కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 

కేరళ మలప్పురంలోని తానూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోట్ బోల్తా పడటంతో 22 మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది.

జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ, ఆయన్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.

07 May 2023

మణిపూర్

మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు 

మణిపూర్‌లో హింస నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, పౌరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం, అస్సాం రైఫిల్స్‌‌ను రంగంలోకి దింపింది.

06 May 2023

మణిపూర్

మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా 

మణిపూర్‌లో హింస నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులకు నీట్ (యూజీ)-2023 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది.

జమ్ముకశ్మీర్: రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

రాజౌరీ జిల్లాలోని కంది అడవుల్లో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

దేశంలో కొత్త్గగా 2,961 కేసులు; 17 మరణాలు 

దేశంలో గత 24గంటల్లో 2,961 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్ర‌ప్రదేశ్ AP SSC 2023 ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు ప్రకటించింది.

రేపే ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు రిలీజ్.. పూర్తి వివరాలివే 

ఏపీలో ఈ ఏడాది జరిగిన టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల తేదీ ఖరారైంది. టెన్త్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల తేదీని నేడు విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లండించారు.

మోచా తుఫాను వచ్చేస్తోంది: దేశంలోని ఏయే ప్రాంతాలు ప్రభావితం అవుతాయంటే? 

ఎండాకాలంలో ఎండలు కొట్టకుండా వర్షాలు పడటం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది.

05 May 2023

అమరావతి

హైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ

అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నో చెప్పింది.

వాతావరణ మార్పులతో వలస పక్షుల మనుగడ ప్రశ్నార్థకం

వలస పక్షుల మనుగడపై వాతావరణ మార్పులు ఎక్కువగా ప్రభావం చూపనున్నాయని పరిశోధకులు ధ్రువీకరించారు. ఇవి పరిమాణంలో పెద్దగా ఉండే వివాంగాహలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

05 May 2023

ఆర్మీ

ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదురుగు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

05 May 2023

తెలంగాణ

తెలంగాణ: ఇంటర్ ఫలితాల కోసం మూడు తేదీలు? 

తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సమయం దగ్గరపడుతోంది. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మే 10వ తేదీలోగా ఇంటర్ ఫలితాలు రానున్నాయని అంటున్నారు.

05 May 2023

తెలంగాణ

తెలంగాణలో ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు శుభవార్త: ఇకపై ఏసీ హెల్మెట్ లు రాబోతున్నాయ్ 

తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొస్తుంది. ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించడానికి ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు ఏసీ హెల్మెట్లను అందివ్వనుంది.

శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ

రెండు రోజుల క్రితం శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీమానాను పార్టీ ప్యానల్ అమోదించలేదు.

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం

ఏపీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందనుంది. విమాన ప్రయణాల తరహాలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ తీసుకొచ్చింది.

05 May 2023

తెలంగాణ

TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్ 

తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకు కేసులో నగదు లావాదేవీల గురించి కోర్టుకు సిట్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.

05 May 2023

కర్ణాటక

మతం ఆధారంగా ఓట్లు అడగడం సిగ్గుచేటు : అక్బరుద్దీన్ ఓవైసీ

రాబోయే కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ మతం ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ ఓట్లు ఆడగడం సిగ్గుచేటు అని ఏఐఎంఐఎం ఛీప్ అసరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

04 May 2023

మణిపూర్

మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?

మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి.

తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్

సోషల్ మీడియాలో బుధవారం నుంచి ఒక విడియో తెగ వైరల్ అవుతోంది.

దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ 

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని గురువారం ప్రారంభించారు.

దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణను ముగించింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌; అనిల్ దుజానా హతం 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్యాంగ్‌స్టర్ల వేట కొనసాగుతోంది. మీరట్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను హతమార్చారు.

NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టీఏ)NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేసుకున్న వైద్య విద్య అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in నుంచి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

04 May 2023

దిల్లీ

దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు 

దిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. అలాగే నగరంలో ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పడిపోయాయి.

ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే?

పదో తరగతి ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్

దేశంలో గత 24 గంటల్లో 3,962 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.

04 May 2023

దిల్లీ

మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు బుధవారం అర్థరాత్రి కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.

04 May 2023

తెలంగాణ

తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం 

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని ఈ నెల నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

04 May 2023

తెలంగాణ

తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రభుత్వం, మరికొన్ని రిబ్బన్ కట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

03 May 2023

తుపాను

రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను 

మే 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఎపీఎఫ్‌లు), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బందికి భోజనంలో 30శాతం మిల్లెట్‌లను(శ్రీ అన్న) ప్రవేశపెట్టాలని హోం మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయించింది.

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ ప్రారంభం; దీని విశేషాలు ఇవిగో

హైదరాబాద్‌లో నిర్మించిన నీరా కేఫ్ అండ్ ఫుడ్ కోర్టును తెలంగాణ ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.

03 May 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు మద్య, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టారు.

శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని బహుదా నదిపై నిర్మించిన పురాతన వంతెన బుధవారం కుప్పకూలింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్ 

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన కొన్ని నిర్ణయాలపై విచారణకు బుధవారం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.

హైదరాబాద్‌లో జీరో షాడో డే; ఈనెల 9న నీడ కనిపంచదు 

జీరో షాడో డేకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈనెల 9వ తేదీన హైదరాబాద్ పౌరులు మధ్యాహ్నం 12:12 గంటలకు జీరో షాడో డేను ఆస్వాదించనున్నారు.

భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్ 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్ జూపార్కు టికెట్ ధరల పెంపు

హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శన టికెట్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.