క్రికెట్: వార్తలు

రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్..?

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ స్థానంలో ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది.

'వన్డే ప్రపంచ కప్‌ను కచ్చితంగా గెలుస్తాం': హార్ధిక్ పాండ్యా

భారత టీ20 కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్ధిక్ పాండ్యా మీద ప్రస్తుతం ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ముంబై వేదికగా నేడు శ్రీలంకతో తలపడేందుకు హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది.

బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లపై క్లారిటీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహాసంగ్రామానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. 2024-2025 సీజన్‌కు సంబంధించి 43 మ్యాచ్‌లు వరకూ తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

'టీమిండియా ఓపెనర్‌గా అతనే దమ్మునోడు' : గంభీర్

టీమిండియా ఓపెనర్‌గా యువ ప్లేయర్ ఇషాన్ కిషనే దమ్మున ప్లేయర్ అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌కు సన్నదమవుతున్న టీమిండియా.. ఇషాన్ కిషన్‌నే తమ ప్రధాన ఓపెనర్‌గా ఎంచుకోవాలి. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీ చేసి విమర్శకుల నోర్లకు ఇషాన్ మూయించాడని పేర్కొన్నారు.

ఈ ఏడాదైనా భారత్ విజయఢంకా మోగించేనా..?

2022లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన రోహిత్ సేన.. యూఏఈలో జరిగిన ఆసియా కప్‌‌లో ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. ఈ ఏడాది ఆరంభంలో సొంత గడ్డ మీద శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన భారత్.. టెస్టు ర్యాకింగ్‌లో రెండోస్థానంలో ఉంది.

02 Jan 2023

ప్రపంచం

హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేస్తారా.. ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..!

2022లో టీమిండియా అశించిన విజయాలు సాధించకపోవడంతో సెలెక్టర్లతో పాటు బీసీసీఐకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం చెందడంతో టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటి బాట పట్టింది. వయస్సు మీద పడుతున్న రోహిత్‌శర్మను తప్పించి కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ నిమగ్నమైంది.

'థాంక్ గాడ్.. పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు' : కపిల్

నూతన ఏడాది కుటుంబ సభ్యులకు సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు.

సరిగ్గా ఇదే రోజు.. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ అరంగ్రేటం

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన స్పిన్ మాయజాలంలో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కులు చూపించిన లెజెండ్.. తన 15 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 1992 సరిగ్గా ఇదే రోజున షేన్ వార్న్ భారత్- ఆస్ట్రేలియా తరపున భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..!

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ ఇటీవల జింబాబ్వే పర్యటనకు టీ20 కెప్టెన్‌గా నియమతులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భవిష్యత్తు క్రికెట్‌పై నూరుల్ మదనపడుతున్నాడు. దీనికి కారణం తన చూపుడువేలుకు శస్త్ర చికిత్స చేసినా పూర్తిగా నయం కాకపోవడం.

యోయో ఫిట్‌నెస్ మళ్లీ వచ్చేసింది..!

ఒకప్పుడు టీమ్ ఇండియా ఎంపికకు తప్పనిసరిగా యోయో ఫిట్ నెస్ పరీక్ష ఉండేది. యోయో ఫిట్‌నెస్ పరీక్ష మళ్లీ వచ్చేసింది. ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ అర్హత ప్రమాణాల జాబితాలో నిర్ణయించాలని ధ్రువీకరించింది. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసం 20 మందితో కోర్ గ్రూప్ ఏర్పాటు చేసి, అందులోని ఆటగాళ్లను టోర్ని ముందు వరకు రోటెట్ చేయాలనుకుంది. ప్రపంచ కప్ లో ఓటమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

02 Jan 2023

ప్రపంచం

'టీ20 వరల్డ్ కప్ చాహెల్ అడుంటే ఎక్కవ నష్టం జరిగేది' : దినేష్ కార్తీక్

టీమిండియా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్.. స్పిన్నర్ చాహల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో లెగ్ స్పిన్నర్ చాహల్ ను ఆడించి ఉంటే టీమిండియా ఎక్కువ నష్టం జరిగేదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.

02 Jan 2023

ప్రపంచం

బౌండరీ లైన్ బయట క్యాచ్ పట్టినా ఔటిచ్చారు.. ఎందుకు..?

బౌండరీ లైన్ బయట క్యాచ్ పడితే అది సిక్సర్ అవుతుంది. అయితే బౌండరీ లైన్ బయట క్యాచ్‌ను ఔటిచ్చారు అంపైర్లు.. బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఫీల్డర్ పట్టిన క్యాచ్ చర్చనీయాంశమైంది.

31 Dec 2022

ప్రపంచం

2022లో లియాన్, రబాడ సరికొత్త రికార్డు

ధక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ, ఆస్ట్రేలియా ఆప్ స్పిన్నర్ నాథల్ లియాన్ ఈ ఏడాది టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లగా రికార్డుకెక్కారు. 2022లో మంచి ఫామ్‌ను కొనసాగిస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

31 Dec 2022

ప్రపంచం

టీ20 సిరీస్‌లో.. ముగ్గురు నయా ప్లేయర్లు

టీమిండియాలో ముగ్గురు జూనియర్ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా జట్టు జనవరిలో మూడు వన్డేలు, మూడు టీ20లను స్వదేశంలో శ్రీలంకతో ఆడనుంది. సీనియర్ ఆటగాళ్ల పక్కను పెట్టి జూనియర్ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. టీ20 కెప్టెన్‌గా హార్థిక్, వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు.

31 Dec 2022

ప్రపంచం

సిక్స్ ప్యాక్ లుక్‌లో అర్జున్ టెండూల్కర్ అదరహో..

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఒకప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేసేవారు. ప్రస్తుతం ఆ జాబితాలోకి యువ క్రికెటర్లు కూడా రాబోతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా సిక్స్ ప్యాక్ బాడిని ఒకప్పుడు ప్రదర్శించారు. వీరి జాబితాలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఈ జాబితాలో చేరిపోయాడు.

31 Dec 2022

ప్రపంచం

కోనేరు హంపి ఆట ఆదుర్స్

ప్రపంచ బ్లిట్జ్ లో కోనేరు హంపి చరిత్రను బద్దలు కొట్టింది. 9రౌండ్లు ముగిసేసరికి 44వ స్థానంలో ఉంది. ఇంకె ఆమె పతకం సాధించదని అందరూ ఓ అంచనాకు వచ్చారు. అయితే అంచనాలను తలకిందులు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫామ్ ఉన్న అమ్మాయిలను వెనక్కి నెట్టి ప్రపంచ బ్లిట్జ్ టోర్నలో పతకం సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్రను తిరగరాసింది.

31 Dec 2022

ప్రపంచం

గత పదేళ్లలో ఐదు అద్భుత టెస్టు సిరీస్‌లు

టెస్టు మ్యాచ్ ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని మ్యాచ్‌లు ఇప్పటికీ చూసిన ఉత్కంఠను రేపుతాయి.

రిషబ్ పంత్ డబ్బులు, నగలు కాజేసిన జనాలు

భారత్ యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న భారత్ అభిమానులు అందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, కాళ్లకు, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయ్యాయి.

రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీ నుంచి తన స్వగ్రామానికి బయల్దేరాడు. అయితే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో కారును అదుపు చేయలేక ప్రమాదానికి గురైనట్లు పంత్ వెల్లడించారు.

రిషబ్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లు..!

ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను ఓడిపోయింది. ఈ సిరీస్ లో ఇద్దరు వికెట్ కీపర్లను రంగంలోకి టీమిండియా దింపింది. కేఎల్ రాహుల్ అశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రస్తుతం వన్డేలో వికెట్ కీపర్ స్థానం టీమ్ మేనేజ్ మెంట్ చాలా కష్టపడుతోంది. ప్రపంచకప్‌లో పంత్ ఆడిన 2 మ్యాచ్‌లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.

జనవరి 6న బీపీఎల్ సమరం

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సర్వం సిద్ధమైంది. అటగాళ్లను జాబితాను ఆయా జట్టులు ప్రకటించాయి. బీపీఎల్ లీగ్ లో ఏడు జట్లు నువ్వా-నేనా అన్నట్లు గా పోటిపడనున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా బీపీఎల్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

30 Dec 2022

ప్రపంచం

భారత్‌తో పోరుకు సై అంటున్న వార్నర్

ఆస్రేలియా డేంజరేస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన వంద టెస్టులో సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫిబ్రవరిలో భారత్తో టెస్టు సిరీస్ జరగనుంది. దీనిపై డేవిడ్ వార్నర్ తాజాగా స్పందించాడు. భారత్ టెస్టు సిరీస్ గొప్ప సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు.

రిషబ్ పంత్ ఊపిరి నిలబడింది

క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు రిషబ్ పంత్ యాక్సిడెంట్ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తున్నారు.

30 Dec 2022

ప్రపంచం

ఈ ఏడాది ఎంట్రీతో సత్తా చాటిన బౌలర్లు వీరే..

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాడ్ తరుపున ఆరగ్రేటం చేసిన మ్యాటీ పాట్స్ అద్భుతంగా రాణించాడు. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో విలియమ్సన్ వికెట్ తీసి సత్తా చాటాడు. 4/13 రాణించి టెస్టులో అకట్టుకున్నాడు.

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్య, స్మృతి

ఐసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్యకుమార్ యాదవ్, స్మృతి మందాన నిలిచారు. ఐసీసీఐ ప్రతిపాదించిన పురుషుల జాబితాలో సూర్య, మహిళల జాబితాలో స్మృతి మందాన చోటు దక్కించుకున్నారు.

అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్

అప్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ టీ20 కెప్టెన్ గా నియమితులయ్యారు. మహమ్మద్ నబీ స్థానంలో అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు రషీద్ కు జట్టు పగ్గాలను అప్పగించింది.

BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డాడు. ఆతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చేలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పంత్ తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన రూర్కిలోని నర్సన్ సరిహద్దు సమీపంలోని ఉన్న హమ్మద్ పూర్ట్ ఝల్ రహదారిపై జరిగింది.

29 Dec 2022

ప్రపంచం

చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్ సవితా శ్రీ భాస్కర్

భారత్ చెస్ ప్లేయర్ సవితాశ్రీ భాస్కర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. కజకిస్తాన్‌లో జరిగిన ఎఫ్‌ఐడీఈ (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్) వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి రికార్డును క్రియేట్ చేసింది. వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెలిచిన మూడో భారత చెస్ ప్లేయర్‌గా నిలిచి అరుదైన ఘనత తన సొంతం చేసుకుంది.

నాన్న వైస్ కెప్టెన్ అని మెసేజ్ పంపాడు : సూర్యకుమార్ యాదవ్

టీ20లో విధ్వంసకర బ్యాట్య్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది మంచి జోష్ ఉన్నారు. టీమిండియాలో అద్భుతంగా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక ఆట శైలి ఉందని నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

29 Dec 2022

ప్రపంచం

భారీ అంచనాలతో అరంగ్రేట్రం... ఆ తర్వాత అడ్రస్ గల్లంతు..!

టీమిండియాలో చోటు సంపాదించడం చాలా కష్టం.. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చి.. తరువాత చోటు దక్కకపోతే భవిష్యతులో ఆ ప్రభావం ఆటపై పడే అవకాశం ఉంటుంది. 2021లో జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు 2022లో ఇంటర్నేషన్ క్రికెట్ కి దూరంగా ఉండడం గమనార్హం.

29 Dec 2022

శ్రీలంక

భారత్ టీంను ఢీకొట్టే శ్రీలంక జట్టు ఇదే..

జనవరిలో భారత్‌లో పర్యటించే శ్రీలంక జట్టును శ్రీలంక క్రికెట్‌బోర్డు ప్రకటించింది. టీమిండియా శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్లు, మూడు వన్డే సిరీస్ లను ఆడనుంది. జనవరి 3 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. శ్రీలంక జట్టు పగ్గాలను దసున్ షనకకు అప్పగించారు.

29 Dec 2022

ప్రపంచం

2023 జనవరిలో బీసీసీఐ నూతన సెలక్షన్ కమిటీ..!

2023 జనవరిలో అశోక్ మల్హోత్రా నేతృత్వంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ, కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ముంబైలోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కార్యాలయంలో సమావేశం డిసెంబర్ 30న జరగనుంది. ఇందులో సభ్యులగా సులక్షణ నాయక్, పరంజ్పే ఉండనున్నారు.

29 Dec 2022

ప్రపంచం

టీ20 మహిళల ప్రపంచ కప్‌లో వెటరన్ పేసర్ రీ ఎంట్రీ

వచ్చే ఏడాది 2023 టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ ప్రీతికౌర్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఇక టాప్‌లో కొనసాగుతున్న స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

28 Dec 2022

ప్రపంచం

12 ఏళ్లు నిరీక్షించి.. కలను సాకారం చేసుకున్నాడు

టీమిండియా బౌలర్ జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తరువాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. తనపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ అందివచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు లెఫ్టార్మ్‌ పేసర్‌.

28 Dec 2022

ప్రపంచం

ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ

ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ 2022 ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సి కల నేరవేరింది.

భారత్‌తో టెస్టు సిరీస్ ఓటమి.. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రాజీనామా

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవికి రస్సెల్ డొమింగో రాజీనామా చేశాడు. భారత్‌తో బంగ్లాదేశ్‌ టెస్టు సీరిస్‌ను 2-0 తేడాతో ఓడిపోయింది. రెండు రోజుల తర్వాత రస్సెల్ డొమింగ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

2022లో భారత్ క్రీడాకారుల చరిత్రాత్మకమైన విజయాలు

2022లో భారత మహిళ ప్లేయర్ల కోసం చారిత్రాత్మకమైన నిర్ణయాలను అమలు చేశారు. మహిళా క్రికెటర్లకు, భారత క్రికెటర్లతో సమానంతో వేతనాలను అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జేషా వెల్లడించారు.

శిఖర్ ధావన్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా..?

గత శతాబ్ది కాలంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే క్రికెట్లో ఉత్తమ ఆటగాడిగా కొనసాగుస్తున్నాడు. టీమిండియాను విజయాల బాటలో నడిపించిన రోహిత్, కోహ్లీ తరువాత శిఖర్ ధావన్ అని చెప్పొచ్చు. మంగళవారం శ్రీలంక సిరీస్ తో ప్రకటించిన వన్డే జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కకపోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆష్లీగ్ గార్డనర్ జోరు.. ఆల్ రౌండర్లలో మొదటి ర్యాంకు

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీగ్ గార్డనర్ ఐసీసీ ఉమెన్స్ ర్యాంకులో సత్తా చాటింది. ఆలౌ రౌండర్లలో జాబితాలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. ఇటీవల భారత్ మహిళ టీ20 మ్యాచ్ లో 32 బంతుల్లో 66 పరుగులు చేసింది.అనంతరం రెండు వికెట్లు తీసి 20 పరుగులు ఇచ్చింది.

హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం

శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను బిసీసీఐ ప్రకటించింది. టీ20లకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను.. వన్డేలకు రోహిత్ శర్మను నియమించారు. ఈ సిరీస్‌లో ధావన్, పంత్‌ను దూరం పెట్టారు.