తెలంగాణ: వార్తలు

12 Apr 2023

ఇంధనం

SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.

తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్

అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్ 

హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి బయలు దేరే అలయన్స్ ఎయిర్‌కు చెందిన ఎనిమిది విమానాలను రద్దు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.

నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు

నల్లమల అడవులు పెద్దపులులకు నిలయంగా మారినట్లు, ఈ ప్రాంతంలో టైగర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అడవుల్లో 75 వరకు పులులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం

10వ తరగతి పేపర్ లీక్ కేసులో డిబార్ అయిన విద్యార్థిని సోమవారం నుంచి మిగిలిన పరీక్షలు రాయడానికి తెలంగాణ హైకోర్టు శనివారం అనుమతించింది.

అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదని మండిపడ్డారు.

రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి

ఐటీ సిటీ హైదరాబాద్‌ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

07 Apr 2023

కోవిడ్

ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 10, 11తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

06 Apr 2023

జైపూర్

సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాబోయే రోజుల్లో 1,050మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై జరిగిన సమీక్ష సమావేశంలో సింగరేణి కంపెనీ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

06 Apr 2023

జనగామ

జనగామలో దారుణం: భార్య ఉరేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

జనగామలో గురువారం దారుణం జరిగింది. జనగామ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్‌‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది.

ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం

ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు

వైట్ ప్రాంక్ నివేదికలో ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో స్థిరాస్తి రంగం స్థిరంగా సాగిందని పేర్కొంది. ఈ 3 నెలల్లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు 1 శాతం పెరిగి 79,126కు చేరాయి. లీజింగ్ లావాదేవీలలో 5శాతం వృద్ధి జరిగినట్లు సంస్థ తెలిపింది.

రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ

తెలంగాణలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల్లో మంగళవారం హిందీ పేపర్ లీకైంది. తాండూరులో సోమవారం తెలుగు పేపర్ లీక్ అయిన రీతిలోనే వరంగల్‌లో పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చింది.

కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ

తెలంగాణ కూల్ రూఫ్ పాలసీని సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు

వికారాబాద్ జిల్లాలోని తాండూరు నంబర్ 1 సెంటర్‌లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి సర్క్యులేట్ చేసినందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సహా ముగ్గురు అధికారులను తెలంగాణ విద్యాశాఖ సోమవారం సస్పెండ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో పరీక్ష కేంద్రాల వల్ల సందడి నెలకొంది. ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా 11పేపర్లతో నిర్వహించే పరీక్షను 6 పేపర్లతో నిర్వహిస్తున్నారు.

ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన శ్రీరామనవమి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజా‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ ) సెక్షన్ 153-ఏ, 506 కింద అభియోగాలు మోపారు.

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో విషాదం

తెలంగాణ సీఎం కుమార్తె, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల పర్యటనలో విషాధం చోటుచేసుకుంది.

ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు

ఐఐటీ-హైదరాబాద్ మరో ఘనత సాధించింది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సహకారంతో స్వదేశీ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ వంతెనను పరిశోధన బృందం అభివృద్ధి చేసింది.

ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు; ఏప్రిల్ 1నుంచి అమలు

ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో కొత్తగా ప్రవేశపెట్టిన ఆఫర్లు, డిస్కౌంట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని యాజమాన్యం ప్రకటించింది.

ఏడాదిలో రూ.6లక్షల ఇడ్లీలను ఆర్డర్ చేసిన హైదరాబాద్ వ్యక్తి

హైదరాబాద్‌కు చెందిన ఒక ఇడ్లీ ప్రేమికుడు గత ఏడాది కాలంలో రూ. 6 లక్షల విలువైన ప్లేట్లకు ఆర్డర్ ఇచ్చారని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ వెల్లడించింది.

తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ

తెలంగాణలో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మార్చి 31(శుక్రవారం) నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సూర్యుడు భగ్గమననున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

'ఫోన్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం'; కవితకు లేఖ రాసిన ఈడీ జాయింట్ డైరెక్టర్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మంగళవారం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ

తెలంగాణలోని రేషన్‌కార్డు‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఏప్రిల్ నుంచి పోషకాలు మిళితం చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 90రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 నుంచి జూలై 28 వరకు 90 రోజుల పాటు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌లో పరిధిలోని ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరగనుంది.

ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్

ఎల్‌బీ నగర్‌ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఎల్‌బీ నగర్‌ ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లైఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ.32 కోట్లతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది.

తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిజాం కాలం నాటి నాణేలు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉపాధిహామీ కూలీలు తమ పనిలో భాగంగా తవ్వకాలు చేపట్టగా చిన్న మట్టి కుండలో పురాతన 27 వెండి నాణేలను గుర్తించారు.

'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పరిశీలించారు. తొలుత ఖమ్మ జిల్లా రామాపురం, గార్లపాడు గ్రామాల్లో పొలాలను స్వయంగా సందర్శించారు.

ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి

ప్రఖ్యాత సాలార్‌జంగ్ మ్యూజియాన్ని సందర్శించాలనుకుంటున్నారా? పని ఒత్తడిలో ఉండటం, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వల్ల మ్యూజియంకు వెళ్లేందుకు సమయం కేటాయించకలేకపోతున్నారా? అయితే మీలాంటి వారికోసమే మ్యూజియం నిర్వాహకులు ప్రత్యేక ఆన్‌లైన్ ప్రదర్శనను ప్రారంభించారు.

ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానంపై వడగళ్ల వాన పడింది. దీంతో విమానం భారీగా దెబ్బదిన్నది.

TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్‌కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం!

ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ల లీకేజీ వల్ల ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.

గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ల లీకేజీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలని కేటీఆర్ అన్నారు. పేపర్ల లీకేజీ వ్యవహారం బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణించారు.

TSPSC సంచలన నిర్ణయం; గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తోపాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించడానికి తుఫాన్ ముంచుకొస్తుంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్క్‌కు 65 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.

వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా విచారణకు సహకరించాలని ఆదేశించింది.