భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని ఒక ఆలయంలో గురువారం శ్రీరామ రామనవమి వేడుకలు జరుగుతుండగా మెట్లబావి కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరులోని తణుకు మండలం దువ్వలో శ్రీరామ నవమి వేడుక కోసం వేసిన చలువ పందిళ్లకు మంటలు అంటున్నాయి.

30 Mar 2023

ఏలూరు

ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 'దురంతో ఎక్స్‌ప్రెస్‌' రైలు గురువారం తెల్లవారుజామున ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలంలో ఈ ఘటన జరగడంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లు ఆరు గంటలకు పైగా ఆలస్యంగా వెళ్లాయి.

ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు.

యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా

'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కేసు పెడతానని చెప్పారు.

30 Mar 2023

కోవిడ్

దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం

దేశ రాజధానితో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 40 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

30 Mar 2023

దిల్లీ

రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య

భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధ రోహత్గీ దిల్లీలోనే ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. బంగ్లా ఖరీదు అక్షరాల రూ.160 కోట్లు అని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

29 Mar 2023

పంజాబ్

పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?

గత 10 రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు అతను గోల్డెన్ టెంపుల్‌లో పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుతపులి 4 పిల్లలకు జన్మనిచ్చింది. కిడ్నీ వ్యాధితో ఒక చిరుత మరణించిన మూడు రోజుల తర్వాత మరో చిరుత 4 బుల్లి చిరుతలకు జన్మనిచ్చినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అతను చిరుత పిల్లల చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌

మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ (ఎంఎంటీహెచ్)గా బెంగళూరు విమానాశ్రయం అవతరించనున్నది. భారతదేశంలోనే మొట్ట మొదటిగా ఈ స్థాయి గుర్తింపు పొందిన విమానాశ్రయంంగా బెంగళూరు నిలవనుంది.

'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోగా విచాణను ముగించాలని సీబీఐని ఆదేశించింది.

మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?

లక్షదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం పునరుద్ధరించింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో తమ నాయకుడు తిరిగి లోక్‌సభలో అడుగుపెడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

29 Mar 2023

లోక్‌సభ

ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ దిగువ‌సభ బుధవారం పునరుద్ధరించింది.

ఆంధ్రప్రదేశ్: 14 స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 162మంది వైద్య నిపుణుల నియామకం

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమానికి చెందిన వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల నియామకం కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులు భర్తీ అయ్యాయి.

29 Mar 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్

కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం ప్రకటించింది.

5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఆకాశంలో ఐదు గ్రహాలు ఒకేసారి కనిపించిన అరుదైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ అన్నీ సరళ రేఖలో క్రమంగా ఉన్నాయి. ఈ వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది.

29 Mar 2023

కోవిడ్

దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా; కొత్తగా 2,151 కేసులు, 5 నెలల్లో ఇదే అత్యధికం

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ, తగ్గడం లేదు. దేశంలో గత 24గంటల్లోనే 2,151 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఐదు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

29 Mar 2023

లోక్‌సభ

ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు

ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా సాగుతున్నాయి. అదానీ, రాహుల్ గాంధీల వ్యవహారాలతో నెలకొన్న ఆందోళనల కారణంగా ఉభయ సభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా పోతోంది. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం 3మూడు కీలక బిల్లు ఆమోదం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

29 Mar 2023

కర్ణాటక

నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ను ప్రకటించనుంది. దిల్లీలోని ప్లీనరీ హాల్ విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

అమరావతి కేసును వెంటనే విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడి న ధర్మాసనం పేర్కొంది.

28 Mar 2023

దిల్లీ

దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం

పంజాబ్ నుంచి పారిపోయి వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ దిల్లీలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు.

28 Mar 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు

అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. అమృత్‌పాల్ సింగ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించారు.

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో మంగళవారం ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరపగా, ఇద్దరు గాయపడ్డారు.

ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ

లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడంపై మంగళవారం రాహుల్ గాంధీ స్పందించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

అద్దెకు ఉండే బ్యాచిలర్ల కోసం బెంగళూరు సొసైటీ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలు

నివాసి సంక్షేమ సంఘాలు (RWA) ఫ్లాట్‌ల యజమానులు లేదా అద్దెకు ఉండే వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తరచుగా నియమాలు, నిబంధనలను ఏర్పరుస్తాయి.

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం మాఫియా నాయకుడు అతిక్ అహ్మద్‌ను దోషిగా తేల్చింది. అతిక్ అహ్మద్‌తో పాటు దినేష్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్‌లకు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్‌ ప్రధాన సాక్షి కావడం గమనార్హం.

'ఫోన్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం'; కవితకు లేఖ రాసిన ఈడీ జాయింట్ డైరెక్టర్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మంగళవారం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు కేటాయించిన దిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‍‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్టు ప్రాథమిక విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగూనంగా ఈ మార్పులను తీసుకొచ్చినట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.

28 Mar 2023

తెలంగాణ

తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ

తెలంగాణలోని రేషన్‌కార్డు‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఏప్రిల్ నుంచి పోషకాలు మిళితం చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

27 Mar 2023

కర్ణాటక

రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) అంతర్గత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సోమవారం శివమొగ్గ జిల్లాలో బంజారా, భోవి సంఘాల కార్యకర్తలు సోమవారం మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇల్లు, కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అనంతరం రాళ్లు రువ్వారు.

హైదరాబాద్: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 90రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 నుంచి జూలై 28 వరకు 90 రోజుల పాటు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌లో పరిధిలోని ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

27 Mar 2023

పోలవరం

పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని పేర్కొంది. 1980 ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు.

ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ

అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ కంపెనీల్లో ప్రజల సొమ్మును ప్రధాని మోదీ పెట్టుబడిగా పెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

27 Mar 2023

సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ అధికారిని తక్షణమే మార్చాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా

దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది.

27 Mar 2023

కోవిడ్

కరోనాపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం; ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దేశంలో కరోనా సంసిద్ధతపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే లేఖలు రాసింది.

27 Mar 2023

దలైలామా

బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం!

బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా, టిబెటన్ మతగురువుగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడిని బౌద్ధమత గురువు దలైలామా నియమించారు.

ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం

కోల్‌కతాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను ఆదివారం ఆమె పొరుగింటికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పొరుగింటి వారి ఫ్లాట్‌లోని సూట్‌కేస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.