భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి
దేశంలో గత 24 గంటల్లో 10,753 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి పెరిగింది.
అలుపెరగని శిల్పకారుడు 'రామ్ వంజీ సుతార్'; 98ఏళ్ల వయసులో అంబేద్కర్ విగ్రహానికి రూపం
హైదరాబాద్లో 125అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. సమానత్వం మూర్తిభవించిన ఆ విగ్రహాన్ని రూపొందించిన శిల్పకారుడు 98ఏళ్ల రామ్ వంజీ సుతార్.
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి
మహారాష్ట్ర రాయ్గఢ్లోని ఖోపోలి ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్దే ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్
2024లో ఎన్నికల్లో కేంద్రంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత, సీఎం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా పిలిచే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని శుక్రవారం కేంద్రం స్పష్టం చేసింది.
హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్బుల్ కుక్క
హర్యానాలోని కర్నాల్లో దారుణం జరిగింది. పిట్బుల్ కుక్క 30 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి అతని పురుషాంగాన్ని కొరికేసింది.
జమ్ముకశ్మీర్: ఉధంపూర్లో కూలిన పాదచారుల వంతెన; 20 మందికిపైగా గాయాలు
జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉధంపూర్లోని చెనాని బ్లాక్లోని బైన్ గ్రామంలోని బేని సంగం ప్రమాదవశాత్తు పాదచారుల వంతెన కుప్పకూలి 20 మందికి పైగా గాయపడ్డారు.
'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్పై విరుచుకపడ్డ మోదీ
పేరు ప్రతిష్ఠలు, ఎప్పటికీ దేశాన్ని తామే పాలించాలన్న అధికార దాహంతో కొందరు ప్రజలకు హానీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు.
125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
మొజాంబిక్లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్
భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆఫ్రికన్ దేశం మొజాంబిక్లో పర్యటిస్తున్నారు.
అమృత్సర్కు అమృత్పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు
పంజాబ్ నూతన సంవత్సరం 'బైసాఖి' వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ అమృత్సర్ లేదా తల్వాండి సాబోను సందర్శించవచ్చని ప్రచారం జరుగుతోంది.
'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్ ఎన్కౌంటర్ చేశారా?
ఝాన్సీ జిల్లాలో ఉత్తర్ప్రదేశ్ పోలీసులు జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ మరణించారు. అయితే 'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పోలీసులకు అసద్ ఎలా కార్నర్ అయ్యాడు. పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్ ఎన్కౌంటర్ చేశారా? తెలుసుకుందాం.
దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు
దేశంలో గత 24 గంటల్లో 11,109 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ సానుకూలత రేటు 5.01 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.ఏడు నెలల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.
ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు
వైసీపీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 'మా భవిష్యతు నువ్వే జగన్' అనే ప్రచారాన్ని ప్రారంభించింది.
Ambedkar Jayanti 2023: దేశంలోనే డాక్టరేట్ అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేద్కర్
బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ స్ఫూర్తిమంత్రం. ఆయనో చైతన్య దీప్తి. న్యాయ కోవిదుడిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా అన్నింటికి మించి భారత రాజ్యాంగం ప్రధాన రూపశిల్పిగా ఆయన ప్రసిద్ధి.
దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం
దొంగతనం చేశాడనే అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టారు. అనంతరం అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పూర్లో జరిగింది.
బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్లైన్లో టికెట్లు
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ప్రభుత్వ పాఠాశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించారు.
సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం
జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం గురువారం పాకిస్థాన్ డ్రోన్ను కూల్చేసింది.
గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్కౌంటర్
గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని అనుచరుడు గులామ్ ఉత్తర్ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
నాగ్పూర్: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో వైరల్గా మారింది.
విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ
విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీబీసీ ఇండియాపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది.
దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్ వెల్లడి
దేశంలో అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి: 132వ జయంతి రోజున 125అడుగుల విగ్రహం ఆవిష్కరణ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బీఆర్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ లో రూపుదిద్దుకుంది. హుస్సేన్ సాగర్ పక్కన, ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఆనుకుని 125అడుగుల ఎత్తులో డాక్తర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా అన్ని జిల్లాల్లో కలిపి గురువారం ఒక్కరోజే 31 ఇప్పుడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
పంజాబ్: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి
పంజాబ్లోని భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన సర్వీస్ వెపన్ పేలిపోవడంతో అతను మరణించినట్లు గురువారం పోలీసులు తెలిపారు.
'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్లోని తమ కార్యాలయాల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోదాలను 'మార్గదర్శి' చిట్ఫండ్ కంపెనీ తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది.
దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!
దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 230 రోజుల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.
భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ?
భటిండా ఆర్మీ క్యాంపులో కాల్పులు జరిగిన నలుగు జవాన్లు మరణించిన ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇన్వెస్టిగేషన్) అజయ్ గాంధీ వెల్లడించారు.
సెల్ఫీ ఛాలెంజ్పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్
టిడ్కో ఇళ్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన సెల్ఫీ ఛాలెంజ్పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే కేవలం నాలుగు ఫొటోలను పోస్ట్ చేయడం కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు.
తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో భానుడు భగభమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో దాదాపు 40డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ
దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్
తమిళనాడు ప్రసిద్ధ కంబం ద్రాక్షకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కంబం ద్రాక్ష భౌగోళిక సూచిక ట్యాగ్(జీఐ) ట్యాగ్ని పొందింది. కంబం ద్రాక్షను కంబం పన్నీర్ త్రాట్చై అని కూడా పిలుస్తారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోరం: సిలిండర్ పేలుడుతో భారీ ప్రమాదం
భారత రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఆందోళనకరంగా మారిపోయింది. అనుకోని ప్రమాదం జరగడంతో సమావేశానికి వచ్చిన వారికి గాయాలయ్యాయి.
SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.
రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోదీ
రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి దిల్లీ వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్
దేశంలో గత 24 గంటల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో దాదాపు 8వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
పంజాబ్ మిలిటరీ స్టేషన్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి
పంజాబ్లోని భటిండా మిలిటరీ స్టేషన్లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ కార్యాలయం ప్రకటించింది.
భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు
అంతర్జాతీయ ద్రవ్యనిధి విభాగం(ఐఎంఎఫ్) చీఫ్ డేనియల్ లీ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనదిగా అభివర్ణించారు.
'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం
తన అధికారాలతో చెలగాటాలాడొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మంగళవారం ఒక న్యాయవాది పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.