గుజరాత్: వార్తలు

ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుపాను ముప్పు.. గుజరాత్ లో హై అలెర్ట్

బిపర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి.

13 Jun 2023

రక్షణ

బిపోర్‌జాయ్‌ తుపాను ఎఫెక్ట్: 50 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

బిపోర్‌జాయ్‌ తుపానుతో అరేబియా సముద్రం కల్లోలంగా మారిన నేపథ్యంలో ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది సాహాసం చేశారు. ఈ మేరకు స్పెషల్ ఆపరేషన్‌ ప్రక్రియతో దాదాపు 50 మందిని రక్షించారు.

13 Jun 2023

తుపాను

బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు

బిపోర్‌జాయ్ సైక్లోన్ 'అత్యంత తీవ్రమైన తుపాను'గా తీవ్రరూపం దాల్చడంతో గుజరాత్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

12 Jun 2023

తుపాను

తీవ్రంగా మారుతున్న బిపోర్‌జాయ్ తుపాను; అరేబియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు 

తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా బిపోర్‌జాయ్ తుపాను గత ఆరు గంటల్లో 7కి.మీ వేగంతో ఉత్తర దిశగా అత్యంత వేగంగా కదులుతోందని ఐఎండీ తెలిపింది.

12 Jun 2023

తుపాను

దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్

తూర్పు-మధ్య అరేబియా సముద్రం తీరంపై బిపోర్‌జాయ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూసుకొస్తున్న తుపాను మరికొద్ది గంటల్లో గుజరాత్ తీరాన్ని తాకనుంది.

10 Jun 2023

తుపాను

అతితీవ్ర తుపానుగా బిప‌ర్‌జాయ్.. తీత‌ల్ బీచ్‌ మూసివేత

'బిప‌ర్‌జాయ్' అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన నేపేథ్యంలో గుజ‌రాత్ వ‌ల్సాద్‌లోని తీత‌ల్ బీచ్‌లో రాకాసి అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు బీచ్‌ను వెంటనే మూసివేశారు.

16 వేలకు పైగా గుండెలను కాపాడిన డాక్టర్.. గుండెపోటుతో మృతి 

ఆ డాక్టర్ వైద్యం చేస్తే ఎలాంటి ఆపదలో ఉన్న గుండె అయినా కొట్టుకుంటుంది. అలా దాదాపు 16 వేలకుపైగా గుండెల్ని కాపాడిన ఓ కార్డియాలజిస్ట్ అదే గుండెపోటుతో మరణించడం పట్ల విచారం వ్యక్తమవుతోంది.

గుజరాత్ లో దారుణం: మేనల్లుడు క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడని మామ చేతివేలు నరికివేత 

గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలుడు తమ క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడనే ఆరోపణలతో అతని మేనమామ చేతి వేలిని నరికిన అమానవీయమైన ఘటన పటాన్ జిల్లాలోని కకోషి గ్రామంలో చోటు చేసుకుంది.

150 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేసే యోచనలో ఎన్ఎంసీ 

దేశంలోని దాదాపు 150మెడికల్ కాలేజీల గుర్తంపును రద్దు చేసే యోచనలో వైద్య నిపుణుల నియంత్రణ సంస్థ నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఉన్నట్లు తెలుస్తోంది.

31 May 2023

సూరత్

 సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి

సూరత్‌లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతురుని 25సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు.

29 May 2023

దిల్లీ

కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా? 

అధునాతన హంగులతో, అణువణువూ ప్రజాస్వామ సుగంధాలను వీచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు.

గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సుమారు రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

12 May 2023

సూరత్

డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా? 

వాతావరణ పరిస్థితులు, ఆహార ప్రియులు అభిరుచికి తగ్గట్లు వ్యాపారులు వెరైటీ తినుబండారాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతుంటారు.

రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ 

క్రిమినల్ పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ కోర్టు గురువారం కొట్టివేసింది.

ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా? 

భారతదేశ శీతల పానీయాల మార్కెట్‌లోకి ఐకానిక్ కూల్ డ్రింక్ కాంపా-కోలాను తీసుకొచ్చిన ముకేష్ అంబానీ చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సీలకు పోటీగా నిలిచింది.

పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే?

'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్‌లోని సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న తన రాహుల్ బెయిల్ పిటిషన్‌పై తిరిగి విచారించనున్నది. అయితే రాహుల్ గాంధీ ఆ బెయిల్ పిటిషన్‌లో ఏం పేర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

03 Apr 2023

టాటా

గుజరాత్‌లో టాటా పంచ్‌ వాహనానికి అగ్ని ప్రమాదం

గుజరాత్‌లో నెలరోజుల ముందు కొన్న టాటా పంచ్ AMT అకాంప్లిష్డ్ మోడల్ మంటల్లో చిక్కుకుంది. హైవేపై కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కారు యజమాని, అతని కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.

పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా

పరువు నష్టం కేసులో తనను దోషిగా సూరత్ కోర్టు తేల్చడాన్ని సవాల్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ పిటిషన్‌ను స్వీకరించిన సూరత్ సెషన్స్ కోర్టు, తదిపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.

ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లపై శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఎవరికీ అందించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది.

గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో

మామూలుగా సింహం లేదా పులి జింక లేదా మేకను వేటాడే వీడియోలను చూసి ఉంటారు, ఈ వీడియోలో వీధుల నుండి సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపుని చూడచ్చు. వీడియో ప్రకారం ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు తెలుస్తోంది.

'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో అదే ఏడాది రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కేసు నమోదైంది.

కిరణ్ పటేల్‌: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ప్రధానమంత్రి కార్యాలయం( పీఎంఓ)అధికారిగా నటించి అడ్డంగా దొరికిపోయిన గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్‌ను శుక్రవారం శ్రీనగర్ కోర్టు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి

దేశంలో హెచ్‌3ఎన్2 ఇన్‌ప్లూయెంజా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. అయితే ఈ ఇన్‌ప్లూయెంజా వైరస్ సోకి మరణాలు సంభవిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక

ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ

భావ్‌నగర్‌కు చెందిన సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSMCRI) అద్భుతమైన ఆవిష్కరణ మెమ్బ్రేన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించి, భవిష్యత్తులో గ్రీన్ ఇంధనంగా మారే అవకాశం ఉంది.

మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో గతేడాది అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 135 మంది మృతిన ఈ ఘటనపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ హైకోర్టుకు సోమవారం నివేదికను సమర్పించింది.

14 Feb 2023

బీబీసీ

BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు

ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ US-ఆధారిత విభాగం ఆంజినా, అధిక రక్తపోటు కొన్ని రకాల గుండె చికిత్సలకు ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను వెనక్కి రప్పిస్తుంది.

10 Feb 2023

ముంబై

ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌

బుల్లెట్ రైలు పని మహారాష్ట్రలో వేగాన్ని పుంజుకుంది, దీనిని బాంబే హైకోర్టు "జాతీయ ప్రాముఖ్యత మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన" ప్రాజెక్ట్ అని పేర్కొంది.

బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధానికి వ్యతిరేకంగా మహువా మోయిత్రా, జర్నలిస్టు ఎన్‌ రామ్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, న్యాయవాది ఎంఎల్‌ శర్మ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు

అత్యాచార కేసులో ఆశారాం బాపునకు గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఆశారాం బాపును కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ఖరారు చేసింది.

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో విచారణ

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

banned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుజరాత్: దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, భర్తను 12కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

దిల్లీలోని సుల్తాన్‌పురిలో అంజలిని కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన తరహా ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

జేఎన్‌యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో మంగళవారం రాత్రి హై డ్రామా జరిగింది. వామపక్ష విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు గుమికూడగా వారిపై రాళ్లదాడి జరిగింది. దీంతో జేఎన్‌యూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై స్థానిక మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విధుల నిర్వహణలో ఘోరంగా విఫమైన మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆ నోటీసుల్లో పేర్కొంది.

గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక

తండ్రి వజ్రాల వ్యాపారి, రూ. కోట్లలో ఆస్తి, విసాలవంతమైన జీవితం, ఏది కావాలన్నా క్షణాల్లో తెచిపెట్టే తల్లిదండ్రులు.. వీటన్నింటి త్యజించి, ఎనిమిదేళ్లకే భక్తి మార్గంలో నడవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. అనుకున్న విధంగానే జైన సన్యాసాన్ని స్వీకరించింది. ఈ అసాధారణ ఘటన గుజరాత్‌లో జరిగింది.

16 Jan 2023

ఐపీఎల్

నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ

కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక ప్రకటన చేశారు. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పిన ఆయన.. ట్విట్టర్ వేదికగా తన ఆస్థులకు వారసుడిగా కుమారుడు రుచిర్ మోదీని ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది చెప్పారు.

మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్

ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబేన్(100) కన్నుమూశారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు.

మునుపటి
తరువాత