భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Ujjain Case: ఉజ్జయినిలో బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Earthquake: దిల్లీ-ఎన్సీఆర్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు
దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవంచింది. మంగళవారం మధ్యాహ్నం 10సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి.
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు మంగళవారం మధ్యంతర ఉపశమనం కల్పించలేదు.
Angallu Case : టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పుంగనూరు, అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కుదురైంది.
KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీ నిజమాబాద్లో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి కొన్ని ప్రశ్నలను సంధించారు.
'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామం ఆ దూరాన్ని మరింత పెంచేలా కనపడుతోంది.
News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు
దిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు చేపట్టడం కలకలం రేపింది.
ప్రభుత్వాసుపత్రిలో దారుణం: అప్పుడే పుట్టిన శిశువులు సహా 31మంది మృతి
మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతను అంచనా వేసేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంగళవారం నుంచి మూడురోజలు రాష్ట్రంలో పర్యటించనుంది.
బిహార్: నితీష్ ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం.. కుల గణన ఫలితాలపై చర్చ
కుల గణన సర్వే ఫలితాలను ప్రకటించిన బిహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.
నేడు నిజామాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్కు వస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఆయన తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు.
పంజాబ్: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో పంజాబ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ విషయంలో సీఎం భగవంత్ మాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మహిళా కానిస్టేబుల్ను హత్య చేసిన దిల్లీ పోలీస్ అరెస్ట్.. రెండేళ్ల తర్వాత గుట్టు రట్టు
దిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో మహిళా కానిస్టేబుల్ను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో దాచిపెట్టిన కేసు దర్యాప్తు పోలీసులు పురోగతి సాధించారు.
తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్లో కాంగ్రెస్పై మోదీ విమర్శలు
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.
బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్
కుల ఆధారిత సర్వే ఫలితాలను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించింది.
జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేపట్టారు.
మధ్యప్రదేశ్: 35ఏళ్ల మహిళ కిడ్నాప్.. ఆపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 35ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
'చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినా కేసులు పెడతారమో'.. పోలీసులపై లోకేశ్ సెటైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కేరళ: కారు నదిలో పడి ఇద్దరు వైద్యులు మృతి
కేరళలోని కొచ్చిలో ఆదివారం పెరియార్ నదిలో కారు పడిపోవడంతో ఇద్దరు వైద్యులు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
వచ్చే పదేళ్ల వరకు మీ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి అవసరం లేదు: అసోం సీఎం కీలక వ్యాఖ్యలు
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తరుచూ తన ప్రకటనతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
మరో వివాదంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. మహిళా రిపోర్టర్ పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా రిపోర్టర్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
మావోయిస్టుల సానుభూతిపరులే లక్ష్యంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది.
మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు
జూలైలో మణిపూర్లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
ఢిల్లీలో 'మోస్ట్ వాంటెడ్' ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అనుమానితుడిని అరెస్టు
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాది, మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది.
మహాత్మా గాంధీ జయంతి: రాజ్ఘాట్ వద్ద ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు
మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జాతిపితకు నివాళులర్పించారు.
తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ
మహబూబ్నగర్లో ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.
TELANGANA : అంగన్వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణలో పాలన స్పీడ్ అందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం తరఫున ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో చూసుకుని మరీ ప్రభుత్వం దూసుకెళ్తోంది.
Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది.
PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
మహాత్మగాంధీ జయంతి అక్టోబరు 2ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
Indigo Flight: విమానంలో వింత ప్రవర్తన.. టాయిలెట్లోకి వెళ్లి సిబ్బందిని హడలెత్తించిన ప్యాసింజర్
హైదరాబాద్ నుంచి పట్నా బయల్దేరిన విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు బాత్రుంలోకి వెళ్లిన మొహ్మమద్ కమర్ రియాజ్ చాలా సేపు అందులోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే వింత ప్రవర్తనతో సిబ్బందిని బెంబెలెత్తించాడు.
మహబూబ్నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన
మహబూబ్ నగర్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేసారు.
EV CAR : బెంగళూరులో ఈవీ కారు దగ్ధం..ఆందోళనలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాదరులు
కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపైనే అగ్నికి ఆహుతైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని జేపీ నగర్ దాల్మియా సర్కిల్లో ఈ ప్రమాదం జరిగింది.
Telangana : బీఆర్ఎస్కు షాక్.. హస్తం గూటికి చేరనున్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి
తెలంగాణలో మరో గులాబీ పార్టీకి మరో షాక్ తలిగింది. ఈ మేరకు అధికార పార్టీ బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు.
ఫుట్పాత్పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి
కన్నడ స్టార్ యాక్టర్ నాగభూషణం శనివారం బెంగళూరులో ఫుట్పాత్పై వెళ్తున్న దంపతులను తన కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహిళ చనిపోగా, ఆమె భర్త ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతన్నాడు.
భారత్ అమెరికా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇరు దేశాల మైత్రికి హద్దుల్లేవని ప్రకటన
భారత్ - అమెరికా బంధంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రికి హద్దుల్లేవన్నారు.
తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలోని మహబూబ్నగర్కు రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్ నెలకొంది.
వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సిలిండర్పై రూ.209 పెంచాయి.
అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన
అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్నగర్, నిజామాబాద్లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర తెలంగాణకు రానున్నాయి.
Nara Lokesh : ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో నారా లోకేశ్కు సీఐడీ నోటీసులు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.