ప్రధాన మంత్రి: వార్తలు

BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతి, బాద్‌షా మనస్థతత్వంపై పోరాటానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది

బెంగళూరు మెట్రో 13.71 కి.మీ ఫేజ్ II ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత, నిన్న సాయంత్రం బెంగళూరులో భారీ వర్షం కారణంగా నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లో నీరు నిలిచిపోయింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లను వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవతరించారు.

ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లపై శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఎవరికీ అందించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది.

25 Mar 2023

కర్ణాటక

బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించినట్లు ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. కర్ణాటకలోని దావణగెరెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్నదని, 'సబ్ కా ప్రయాస్' ద్వారా ప్రతి ఒక్కరి కృషి ద్వారానే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ

2025 నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యంగా భారత్ పని చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ లక్ష్యం కంటే 5 సంవత్సరాలు ముందే భారత్ టార్గెట్‌ను చేరుకుంటుందని పేర్కొన్నారు.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. గత 24గంటల్లో దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి పెరిగింది.

22 Mar 2023

దిల్లీ

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు

దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీంతో అలర్ట్ అయిన దిల్లీ పోలీసులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.

20 Mar 2023

జపాన్

దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు

జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.

18 Mar 2023

కర్ణాటక

గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన జాతికి అంకితం చేశారు. అయితే ప్రారంభించి వారం రోజుకు కూడా కాలేదు.. అప్పుడు హైవే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి.

వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారని వైట్‌హౌస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలన పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వంటి అంశాలపై చర్చించారు.

నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్

పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ (ప్రత్యేక హక్కుల తీర్మానం) ప్రవేశపెట్టారు.

వెనుదిరిగిన పోలీసులు; గ్యాస్ మాస్క్ ధరించి బయటకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్

తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో లాహోర్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారు. అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడాటానికి ఇమ్రాన్ జమాన్ పార్క్ ఇంటి నుంచి బయటికు వచ్చారు. ఆయిన గ్యాస్ మాస్క్ ధరించి బయటకు రావడం గమనార్హం.

రణరంగంగా మారిన ఇమ్రాన్ ఖాన్ ఇల్లు; మద్దతుదారులపై బాష్పవాయువు ప్రయోగం

తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు, బలగాల మధ్య పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తల మధ్య కొన్ని గంటలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

పాకిస్థాన్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహిళా జడ్జిని బెదిరించినందుకు ఇమ్రాన్ ఖాన్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు లాహోర్ చేరుకున్నారు.

'యోగా మహోత్సవ్‌'లో పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల 'యోగ మహోత్సవ్'లో ఆనందంగా పాల్గొనాలని పౌరులను ఆహ్వానించారు. ప్రజలు ఇప్పటికే యోగా చేయకపోతే, ఆసనాలను నేర్చుకొని వారి జీవితాల్లో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృష్టి చేస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దక్షిణాదిన బీజేపీకి కీలకమైన కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మోదీ భావిస్తున్నారు. అందుకే గత మూడు నెలల్లో ఇప్పటికే ఐదు సార్లు రాష్ట్రంలో పర్యటించగా, ఆదివారం మరోసారి కర్ణాటకకు రానున్నారు.

ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆ దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతీయ సమాజం భద్రత విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు మోదీ చెప్పారు.

నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు

ఎన్‌డీపీ చీఫ్ నీఫియు రియో, ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి చివరి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను చూడటానికి తొలి రోజు నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రానున్నారు.

06 Mar 2023

మేఘాలయ

మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

మేఘాలయ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సోమవారం తొలిసారి అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నేడు రాత్రి 7గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి 7 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ప్రధాని ఏ విషయంపై మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.

సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ

అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో బహుపాక్షిక(ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ వేదికలు) సంస్థలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. దిల్లీలో గురువారం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు.

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు

భారత ఎన్నికల సంఘంలో కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఆదేశించింది.

సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో సాంకేతికత భారత్‌కు సాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక

ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

27 Feb 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం

మరో రెండు నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన కర్ణాటక‌లో పర్యటిస్తున్నారు. 2023లో ఇప్పటి వరకు రెండు నెలల్లోనే ఏకంగా ఐదు సార్లు మోదీ కర్ణాటకలో పర్యటించడం గమనార్హం.

Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 98వ 'మన్ కీ బాత్' ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక అంశాలపై మాట్లాడారు.

మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నాగాలాండ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షిల్లాంగ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

24 Feb 2023

కోవిడ్

మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది'

కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని కేంద్ర ఆరోగ్య‌మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల కోవిడ్ సమయంలో దేశంలో 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు ఆయన చెప్పారు.

ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఆయన తండ్రి పేరును కాంగ్రెస్ నాయకులు అపహాస్యం చేస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సభ్యుల భయంకరమైన వ్యాఖ్యలను దేశం క్షమించదని శర్మ పేర్కొన్నారు.

మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెట్టుబడిదారుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు.

బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ

అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేపుతున్నారు. తాజాగా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జార్టి సోరోస్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.కొన్ని విదేశీ శక్తులు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

15 Feb 2023

కెనడా

కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

కెనడాలోని మిస్సిసాగాలోని రామమందిరంపై కొందరు దుంగడులు దాడి చేశారు. దీంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యతిరేక భావం జాలం ఉన్న వారే ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

14 Feb 2023

బీబీసీ

ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం

ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్, పీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. కమల దళం కూడా అదేస్థాయిలో తిప్పికొట్టింది.

2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ

2024-25 నాటికి రక్షణ ఎగుమతులను 5 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 8-9 సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ రంగాన్ని పునరుజ్జీవింపచేసిందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.

ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.