నరేంద్ర మోదీ: వార్తలు

కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్‌ వరకు నడిచే కేరళ తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.

గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ

గత పాలకులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విరుచుకుపడ్డారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని, నిధుల కేటాయింపులో వివక్ష చూపాయని మండిపడ్డారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అలాంటి వ్యత్యాసాలను తొలగించిందన్నారు.

23 Apr 2023

కేరళ

దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి 

ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

22 Apr 2023

కర్ణాటక

కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి 

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికార బీజేపీ దూకుడు పెంచింది. అగ్రనేతలను రంగంలోకి దించుతోంది.

21 Apr 2023

సూడాన్

సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం 

సూడాన్‌లో సాయుధ పోరాటం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా రాయబారులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం

జమ్ముకశ్మీర్‌లోని ఒక విద్యార్థి తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది.

'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ 

పేరు ప్రతిష్ఠలు, ఎప్పటికీ దేశాన్ని తామే పాలించాలన్న అధికార దాహంతో కొందరు ప్రజలకు హానీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ 

భారతదేశం నుంచి అదనపు మానవతా సహాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లేఖ రాశారు. ఈ విషయాన్ని బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ 

రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి దిల్లీ వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.

నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు

నల్లమల అడవులు పెద్దపులులకు నిలయంగా మారినట్లు, ఈ ప్రాంతంలో టైగర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అడవుల్లో 75 వరకు పులులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదని మండిపడ్డారు.

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను జెండా ఊపి ప్రారంభించారు.

రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత

ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.

రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి

ఐటీ సిటీ హైదరాబాద్‌ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ

జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాని మోదీని ఉద్దేశించి దేశ ప్రజలకు ఒక లేఖ రాశారు. అందులో ప్రధాని మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు లేవనెత్తారు. లేఖలో ప్రధాని మోదీపై సిసోడియా విరుచుకపడ్డారు. భారతదేశం పురోగమించాలంటే చదువుకున్న ప్రధానమంత్రి కావాలన్నారు.

07 Apr 2023

గ్యాస్

వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు

దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. సహజ వాయువు ధరను నిర్ణయించడానికి కేంద్ర క్యాబినెట్ కొత్త పద్ధతిని ఆమోదించింది. దీంతో ఫైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు దాదాపు 10శాతం తగ్గనున్నాయి.

BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతి, బాద్‌షా మనస్థతత్వంపై పోరాటానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే?

'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్‌లోని సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న తన రాహుల్ బెయిల్ పిటిషన్‌పై తిరిగి విచారించనున్నది. అయితే రాహుల్ గాంధీ ఆ బెయిల్ పిటిషన్‌లో ఏం పేర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లను వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవతరించారు.

సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్

పరువు నష్టం కేసులో సూరత్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్‌లోని సూరత్‌లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ కేసును ఈ రోజే విచారించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లపై శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఎవరికీ అందించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది.

ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది.

ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ

అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ కంపెనీల్లో ప్రజల సొమ్మును ప్రధాని మోదీ పెట్టుబడిగా పెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

25 Mar 2023

కర్ణాటక

బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించినట్లు ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. కర్ణాటకలోని దావణగెరెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్నదని, 'సబ్ కా ప్రయాస్' ద్వారా ప్రతి ఒక్కరి కృషి ద్వారానే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం

ప్రభుత్వ సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ)ని కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం అంటే ప్రస్తుతమున్న 38 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ

2025 నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యంగా భారత్ పని చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ లక్ష్యం కంటే 5 సంవత్సరాలు ముందే భారత్ టార్గెట్‌ను చేరుకుంటుందని పేర్కొన్నారు.

23 Mar 2023

ప్రపంచం

ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా

ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి యునైటెడ్ స్టేట్స్ నామినేట్ చేసిన అజయ్ బంగా తన మూడు వారాల ప్రపంచ వ్యాప్త పర్యటనను ముగించుకుని మార్చి 23, 24 తేదీల్లో భారతదేశంలోని న్యూఢిల్లీని సందర్శించనున్నారు.

'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో అదే ఏడాది రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కేసు నమోదైంది.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. గత 24గంటల్లో దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి పెరిగింది.

22 Mar 2023

దిల్లీ

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు

దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీంతో అలర్ట్ అయిన దిల్లీ పోలీసులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ

కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జరిగిన ముర్షిదాబాద్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.

20 Mar 2023

జపాన్

దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు

జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.

ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా

ఒక వేడుకలో మీ డియాతో మాట్లాడుతూ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ప్రశంసించారు RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా.

18 Mar 2023

కర్ణాటక

గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన జాతికి అంకితం చేశారు. అయితే ప్రారంభించి వారం రోజుకు కూడా కాలేదు.. అప్పుడు హైవే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి.

IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా

భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇంధన భద్రతలో సహకారాన్ని మెరుగుపర్చేందుకు చేపట్టిన 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్'(ఐబీఎఫ్‌పీఎల్) ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యింది.

వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారని వైట్‌హౌస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలన పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వంటి అంశాలపై చర్చించారు.

నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్

పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ (ప్రత్యేక హక్కుల తీర్మానం) ప్రవేశపెట్టారు.