భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.

తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే

తెలంగాణ బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 2022-23లో సాధించిన ప్రగతిని, వచ్చే ఏడాది చేయనున్న అభివృద్ధి, కేటాయింపులను అసెంబ్లీలో ప్రకటించారు. హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైలెట్స్‌ను ఓసారి చూద్దాం.

తెలంగాణ బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో ఎలా ఉండబోతోంది?

తెలంగాణ బడ్జెట్‌ను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. కేసీఆర్ రెండో దఫా ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మూఢ నమ్మకానికి పరాకాష్ట: ఇనుప రాడ్‌తో 51‌సార్లు వాతలు, మూడు నెలల చిన్నారి మృతి

మధ్య‌ప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతమైన షాదోల్ జిల్లాలో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలైంది.

'మిల్లెట్స్‌తో ట్రై చేయండి', వంట చేయడంలో 'బిల్ గేట్స్ 'కు ప్రధాని మోదీ టిప్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రోటీ తయారు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రధాని మోదీ శనివారం షేర్ చేశారు. అంతేకాదు బిల్ గేట్స్‌కు వంటచేయడంలో ఒక టిప్ కూడా ఇచ్చారు.

04 Feb 2023

తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీలో ఏఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. హైదరాబద్ అభివృద్ధి, ప్రభుత్వం పనితీరుపై అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

04 Feb 2023

కర్ణాటక

బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను, కో-ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైని అధిష్టానం నియమించింది.

04 Feb 2023

కేరళ

కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట

దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ మన్ తల్లి కాబోతోంది. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న జహాద్, జియా పావల్ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. మార్చిలో జహ్హాద్ తమ బిడ్డను ప్రసవించనున్నట్లు జియా పావల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

04 Feb 2023

దిల్లీ

ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అసిస్టెంట్ సబ్ దిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొన్నిరోజులుగా వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలతోపాటు, ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్

జమ్ముకశ్మీర్‌లో పండిట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. వారి మమస్యలకు పరిషారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు

హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూ ప్రకంపం సంభవించింది. స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం ఇరు‌వర్గాల మధ్య ఢీఅంటేఢీ అనేలా మాటల తూటాలు పేలాయి.

03 Feb 2023

ఎన్ఐఏ

'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్

ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ముంబయిలో ఒక వ్యక్తి ఉగ్రదాడికి పాల్పడతాడని అందులోని సారాంశం.

జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్, కర్ణప్రయాగ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు పగుళ్లు ఎలా ఏర్పడ్డాయో, అలాంటి పరిస్థితులే తాజాగా జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళకు గురవుతున్నాయి.

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్

పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల అబుదాబి నుంచి కేరళలోని కోజికోడ్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వినామానికి పనుప్రమాదం తప్పింది.

'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన

గౌతమ్ అదానీపై ప్రముఖ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పార్లమెంట్‌ను కూడా కుదిపేస్తోంది.

బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధానికి వ్యతిరేకంగా మహువా మోయిత్రా, జర్నలిస్టు ఎన్‌ రామ్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, న్యాయవాది ఎంఎల్‌ శర్మ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ తమిళసై ప్రసంగంతో సభ మొదలైంది. ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడం గమనార్హం.

హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్ & స్పితి జిల్లాలోని తిండి-కిలాడ్ రహదారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో స్టేట్ హైవే-26పై ట్రాఫిక్ స్తంభించిపోయింది.

03 Feb 2023

ధర

పాల ధరలు పెంచిన 'అమూల్', లీటరుపై రూ.3 వడ్డన

గుజరాత్ డెయిరీ కోఆపరేటివ్ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. అన్ని రకాల పాల ప్యాకెట్ ధరలను లీటరు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు నేటి నుంచి( ఫిబ్రవరి 3వ తేదీ) అమల్లోకి వస్తాయని తెలిపింది.

03 Feb 2023

తెలంగాణ

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది?

రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఉప్పు- నిప్పు చందంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10గంటలకు 'బడ్జెట్ 2023-24' సమావేశాలు మొదలు కానుండగా, అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీపైనే ఉంది.

02 Feb 2023

దిల్లీ

దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ గురువారం దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటం గమనార్హం. రెండో చార్జ్‌షీట్‌లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కవిత, వైసీపీ ఎంపీ మాగుంట బాబుతో పాటు మొత్తం 12మంది పేర్లను ఈడీ ఇందులో చేర్చింది.

పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఏడోరోజుకు చేరుకుంది. పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

02 Feb 2023

నేపాల్

శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు

నేపాల్ నుంచి అరుదైన రెండు సాలిగ్రామ శిలలు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నాయి. ఈ శిలలతో గర్భగుడిలో శ్రీరాముడు, సీతమ్మ తీర్చిదిద్దనున్నారు.

ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు

ముస్లిం మహిళలు 'ఖులా' ద్వారా విడాకులు పొందాలనుకుంటే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని, షరియత్ కౌన్సిల్ వంటి సంస్థల వద్దకు వెళ్లొద్దని మద్రాసు హైకోర్టు పేర్కొంది. వివాహాలను రద్దు చేసే అధికారం ప్రైవేట్ సంస్థలు లేదని తేల్చి చెప్పింది.

02 Feb 2023

లోక్‌సభ

అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గౌతమ్ అదానీపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టిన నేపథ్యంలో ఉభయ సభల్లో గందరగోళ ఏర్పడింది.

02 Feb 2023

కేరళ

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ విడుదల, రెండేళ్లుగా జైలులోనే

2020లో తీవ్రవాద ఆరోపణలపై అరెస్టయిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ గురువారం విడుదలయ్యారు. వాస్తవానికి గతేడాది డిసెంబరులోనే బెయిల్ లభించినా రిలీజ్ చేయలేదు. తాజాగా లక్నో సెషన్స్ కోర్టు ఆయన విడుదలపై సంతకం చేసింది.

01 Feb 2023

కర్ణాటక

Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు

2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశం 'ఆజాదీ కా అమృత మహోత్సవం' జరుపుకుంటున్న వేళ, ఈ బడ్డెట్‌ను వందేళ్ల స్వతంత్య్ర భారతానికి బ్లూప్రింట్‌గా సీతారామన్ అభివర్ణించారు.

ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది సజీవ దహనమయ్యారు. ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో మంటలు చేలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ధన్‌బాద్‌ డీఎస్పీ ప్రకటించారు.

31 Jan 2023

గుజరాత్

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు

అత్యాచార కేసులో ఆశారాం బాపునకు గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఆశారాం బాపును కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ఖరారు చేసింది.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు.

31 Jan 2023

ముంబై

విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన

విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అబుదాబి నుంచి ముంబయికు వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్ ఫ్లైట్ (యూకే 256)లో మరో సంఘటన జరిగింది. ఇటాలియన్ ప్రయాణీకురాలు విమానంలో మద్యం మత్తులో బీభత్సం చేయడంతో అమెను పోలీసులకు అప్పగించారు.

Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము

కేంద్ర బడ్జెట్-2023 పార్లమెంట్ సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. అయితే ఉభయ సమభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లో ప్రసంగించారు. ముర్ము రాష్ట్రపతి అయ్యాక పార్లమెంట్‌లో ఇదే ఆమె తొలి ప్రసంగం.

గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడికి మరణశిక్ష, ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు

2022 ఏప్రిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి కేసులో అరెస్టయిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది.

'నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు', వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.

ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

భారత రాష్ట్ర సమితి రెండో బహిరంగ సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులకు అప్పగించారు.

భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్

1962లో అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో చైనాతో యుద్ధం తర్వాత భారత్ తన భూభాగాన్ని కోల్పోయిందని, మోదీ హయాంలో కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.

బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో విచారణ

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.