28 Dec 2022

కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!

జనవరి మధ్యలో దేశంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి అని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత అనుభవాలను విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నాయి.

బాహుబలిని ఫాలో అవుతున్న పొన్నియన్ సెల్వన్.. రెండో భాగం విడుదల తేదీ ప్రకటన

బాహుబలి సినిమాతో దేశంలో పెద్ద సంచలనం చెలరేగింది. పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా వర్కౌట్ అవుతాయని చూపించిన సినిమా అది. అందుకే అప్పటి నుండి అన్ని ఇండస్ట్రీల్లోనూ అలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.

రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్

ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు.

హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

ఫార్మా దిగ్గజం హెటిరో మరో మైలు రాయిని అధిగమించింది. ఆ సంస్థ తయారు చేసిన కరోనా ఔషధం 'నిర్మాకామ్' ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రీక్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. కరోనా రోగులకు అందించే.. ఫైజర్‌కు చెందిన పాక్స్‌లోవిడ్‌ ఔషధానికి 'నిర్మాకామ్' అనేది జెనరిక్‌ ఔషధం.

అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు

బాలయ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ మేరకు షూటింగ్ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి.

2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి

టాటా ఫ్లాగ్‌షిప్ SUV, సఫారి, 2023లో అప్‌డేట్ వస్తుంది. SUV గత సంవత్సరం అప్డేట్ లాంచ్ అయినప్పటి నుండి మంచి అమ్మకాలను సాధిస్తోంది. అయితే, మహీంద్రా XUV700, స్కార్పియో N రాక 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరిగింది. ఈ రెండు మోడల్స్ సఫారి కంటే మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నాయి.

మెస్సీ పేరును వాడకూడదని.. అమల్లోకి చట్టం

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అంటే ఇలానే ఉంటుంది అన్నట్లుగా కప్పు కోసం అర్జెంటీనా- ఫ్రాన్స్ జట్లు కొదమ సింహాల్లా తలపడ్డాయి. చివరికి పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో గెలిచి మూడో ప్రపంచకప్‌ను అందుకుంది. వయసు పెరిగినా.. ఆట తగ్గలేదంటూ మెస్సీ అర్జెంటీనా జట్టును ముందుండి నడిపించి విజయంలో భాగస్వామ్యం అయ్యాడు.

ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు.

క్యాన్సర్ ని తరిమికొట్టే క్యాబేజీ రకం కూరగాయ గురించి తెలుసుకోండి

క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బోక్ చోయ్, బ్రస్సెల్ మొలకలు మొదలగు ఒకే రకానికి చెందిన ఆహారాలు క్యాన్సర్ రాకుండా అరికట్టడంలో సాయపడతాయి. అవును.. వీటిల్లో క్యాన్సర్ ని అరికట్టే పోషకాలు ఉన్నాయి.

చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్

Redmi K60 సిరీస్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో Redmi K60 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ వివరాలు ప్రస్తుతం తెలియదు కానీ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60E మోడల్స్ ఉన్నాయి.

12 ఏళ్లు నిరీక్షించి.. కలను సాకారం చేసుకున్నాడు

టీమిండియా బౌలర్ జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తరువాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. తనపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ అందివచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు లెఫ్టార్మ్‌ పేసర్‌.

ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ

ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ 2022 ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సి కల నేరవేరింది.

దక్షిణ కొరియాలో సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత.. పిల్లల ఆకారంలోని డాల్స్ పై మాత్రం..!!

ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

చర్మ సంరక్షణ: చర్మంపై నల్లమచ్చలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. రుతువు మారినప్పుడు చర్మం ప్రభావితం అవుతుంది. చర్మ సమస్యల్లో నల్లమచ్చలు ప్రధాన సమస్య. దీన్ని పట్టించుకోకపోతే చర్మం రంగు మారిపోయే అవకాశం ఉంటుంది.

భారత్‌తో టెస్టు సిరీస్ ఓటమి.. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రాజీనామా

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవికి రస్సెల్ డొమింగో రాజీనామా చేశాడు. భారత్‌తో బంగ్లాదేశ్‌ టెస్టు సీరిస్‌ను 2-0 తేడాతో ఓడిపోయింది. రెండు రోజుల తర్వాత రస్సెల్ డొమింగ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

సంక్రాంతికి ఊళ్లకు వెళ్లాలనుకునే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రెయిన్స్ నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. సకాలంలో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనంగా 94రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.

2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N

keeway యాజమాన్యం నుండి వస్తున్న Moto Bologna Passione లేదా MBP త్వరలో భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. జనవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023లో తన మొదటి M502Nని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది ఈ సంస్థ.

ఇడియట్ 2 సీక్వెల్ పై ఆన్సర్ చేసిన మాస్ మహారాజా రవితేజ

ఇడియట్.. రవితేజ కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పిన సినిమా ఇది. అప్పటివరకు వెండితెర మీద ఎన్నో సినిమాల్లో కనిపించినప్పటికీ ఇడియట్ సినిమాతోనే హీరోగా నిలదొక్కుకున్నాడు రవితేజ.

2022లో భారత్ క్రీడాకారుల చరిత్రాత్మకమైన విజయాలు

2022లో భారత మహిళ ప్లేయర్ల కోసం చారిత్రాత్మకమైన నిర్ణయాలను అమలు చేశారు. మహిళా క్రికెటర్లకు, భారత క్రికెటర్లతో సమానంతో వేతనాలను అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జేషా వెల్లడించారు.

'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్

ఒకవైపు కరోనా పీడ తొలగకముందే.. మరోవైపు కొత్త వైరస్‌లు పుట్టుకురావడం, పాతవి తిరిగి ప్రభావాన్ని చూపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాలో 'మెదడు తినే అమీబా' వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురువుతున్నాయి.

ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ లో అగ్ర స్థానంలో నిల్చిన అర్బన్ కంపెనీ

భారతదేశంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావంతో, గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగింది. అయినా సరే, వీరికి ఇప్పటికీ సరైన వేతనం, మిగిలిన సౌకర్యాలు అందడంలేదని తెలుస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఆహారాలు మీ డైట్ లో ఉన్నాయా?

జనవరి మాసం వచ్చేస్తోంది. చలిమంటలు భోగి మంటలుగా మారబోతున్నాయి. ఈ సమయంలో మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు మనల్ని ఇబ్బందిపెట్టకుండా కొన్ని ఆహారాలు కాపాడతాయి.

శిఖర్ ధావన్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా..?

గత శతాబ్ది కాలంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే క్రికెట్లో ఉత్తమ ఆటగాడిగా కొనసాగుస్తున్నాడు. టీమిండియాను విజయాల బాటలో నడిపించిన రోహిత్, కోహ్లీ తరువాత శిఖర్ ధావన్ అని చెప్పొచ్చు. మంగళవారం శ్రీలంక సిరీస్ తో ప్రకటించిన వన్డే జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కకపోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

వేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme

240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మొట్టమొదటి ఫోన్ రాబోతుంది. అదే Realme సంస్థ విడుదల చేయనున్న GT Neo 5. టెక్నాలజీ కమ్యూనికేషన్ సమావేశంలో జనవరి 5, 2023న తన ఫ్లాష్-చార్జింగ్ ఆవిష్కరణను ఆవిష్కరించబోతుంది.

'అప్పటి వరకు టీషర్ట్ మీదనే ఉంటా'.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం దేశంలో కరోనా తర్వాత.. ఆ స్థాయిలో చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ టీషర్ట్ పైనే. భారత్ జూడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఆయన టీషర్ట్ ధరించే నడన సాగిస్తున్నారు. చలి చాలా ఎక్కువగా ఉండే.. ఉత్తర భారతంలో కూడా రాహుల్ టీషర్ట్ పైనే ఉదయం పాదయాత్ర చేయడాన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

2022లో తెలుగు తెరకు పరిచయమైన హీరోలు, హీరోయిన్లు

తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ ని ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సంవత్సరం తెలుగు తెరమీద చాలామంది కొత్తవాళ్ళు కనిపించారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంలో ఈ సంవత్సరం కొత్తగా మెరిసిన వారి గురించి తెలుసుకుందాం.

ఆష్లీగ్ గార్డనర్ జోరు.. ఆల్ రౌండర్లలో మొదటి ర్యాంకు

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీగ్ గార్డనర్ ఐసీసీ ఉమెన్స్ ర్యాంకులో సత్తా చాటింది. ఆలౌ రౌండర్లలో జాబితాలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. ఇటీవల భారత్ మహిళ టీ20 మ్యాచ్ లో 32 బంతుల్లో 66 పరుగులు చేసింది.అనంతరం రెండు వికెట్లు తీసి 20 పరుగులు ఇచ్చింది.

మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్

స్వదేశీ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా & మహీంద్రా స్కార్పియో-ఎన్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ నుండి మిడ్-స్పెక్ వరకు ఐదు కొత్త వేరియంట్‌లను విడుదల చేయనుంది. SUVలో ఇప్పుడు ఇంజిన్ (పెట్రోల్/డీజిల్), ట్రాన్స్‌మిషన్ (మాన్యువల్/ఆటోమేటిక్), సీటింగ్ (ఆరు/ఏడు) ఆప్షన్స్ బట్టి 30 రకాల వేరియంట్‌లు ఉన్నాయి.

అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన కేసులో నోటీసు జారీ చేసింది. మంత్రి విడదల రజనీకి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ధర్మాసనం కోరింది.

2023లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జలపాతాలను లిస్ట్ లో చేర్చుకోండి

2022 పూర్తయిపోతోంది. ఇంకో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అప్పుడే ఆ సంవత్సరంలో ఏమేం చేయాలనే లిస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారు.

హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం

శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను బిసీసీఐ ప్రకటించింది. టీ20లకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను.. వన్డేలకు రోహిత్ శర్మను నియమించారు. ఈ సిరీస్‌లో ధావన్, పంత్‌ను దూరం పెట్టారు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం కేసు : కొచ్చర్‌ దంపతులకు సీబీఐ కస్టడీలోనూ సకల సౌకర్యాలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌లు ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే కస్టడీలో ఉన్నన్ని రోజులు వీరు ప్రత్యేక వసతులు వినియోగించుకునేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.

27 Dec 2022

ఐఏఎస్ సాధించిన ఏకైక భారత్ క్రికెటర్

భారత జట్టులో ఓ గ్రేట్ క్రికెటర్ ఉన్నాడు ఆతను ఆట, చదువు రెండింటిలోనూ విజయం సాధించాడు. దేశంలో అత్యంత కష్టతరమైన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం భారత జట్టులో చేరాడు. ఈ ఆటగాడి పేరు అమయ్ ఖురాసియా.

సోషల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. ఈ విషయమై అభిమానులు అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.

టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్

టాటా హారియర్ SUV ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుండగా, టాటా మోటార్స్ దానికి బదులుగా SUVలో మరొక ఎడిషన్ వెర్షన్‌ను తీసుకురావడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటీవల టాటా హారియర్ డార్క్ ఎడిషన్ కొన్ని చిత్రాలు బయటికి వచ్చాయి. ఇందులో రెడ్-థీమ్ హైలైట్‌

ముక్కు ద్వారా తీసుకునే టీకా ధరను ఖరారు చేసిన భారత్ బయోటెక్.. డోసు రేటు ఎంతంటే?

దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తాను అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ ధరను నిర్ణయించింది. సింగిల్ డోసు ధర రూ. 800గా నిర్ణయించినట్లు వెల్లడించింది. దీనికి పన్నులు అదనం అని తెలిపింది.

ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'

క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు.

ఆహారం: క్యారెట్, తులసి, పుచ్చకాయల జ్యూస్ తో ఆరోగ్యం

శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందాలంటే మన రోజువారి డైట్ లో పండ్లు, కూరగాయలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. వాటిని మీరు తగినంతగా తినలేకపోతే జ్యూస్ చేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి.

HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర

HONOR తన తాజా స్మార్ట్‌ఫోన్‌ HONOR 80 GTని, కొత్త టాబ్లెట్ Pad V8 Proని విడుదల చేసింది. ఆసియా మార్కెట్లలో Honor జోరందుకుంది. మాతృ సంస్థ నుండి విడిపోయిన తరువాత తన ఖ్యాతిని తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది.

1089 రోజుల తర్వాత వార్నర్ డబుల్ సెంచరీ.. కానీ అంతలోనే..

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులో చరిత్ర సృష్టించాడు. తన వందో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం టెస్టులో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 1089 రోజుల తర్వాత సెంచరీ చేసి.. విమర్శకుల నోళ్లను మూయించాడు.

అందం: మిలమిల మెరిసే కనుల కోసం 5 అద్భుత ఐ లైనర్ లుక్స్

ముఖంలో అందమైన భాగం కళ్ళు. అవి అందంగా కనిపిస్తే ముఖం మెరిసిపోతుంటుంది. అందుకే కళ్ళను మరింత అందంగా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స

చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ BF.7 వేరియంట్ దేశంలో వెలుగు చూడడంతోపాటు అంతర్జాతీయ ప్రయాణికుల్లో బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే సమయం వచ్చేసింది. బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చేసారు.

2022లో ప్రముఖ లెంజెండరీ ప్లేయర్లు కన్నుమూత

2022 క్రీడారంగంలో తీవ్ర విషాదం నింపింది. వరుసగా దిగ్గజ ప్లేయర్ల మరణాలు అభిమానుల గుండెల్లో శోకాన్నిమిగిల్చాయి.

శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్

చైనీస్ బ్రాండ్ MBP C650V క్రూయిజర్ బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. 2023 ప్రారంభం నుండి అందుబాటులో ఉంటుంది. అయితే ధర గురించి తయారీ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే?

కార్గో సేవల్లో ఏపీఎస్ఆర్టీసీ దూసుకుపోతోంది. సురక్షితంగా, సకాలంలో, చౌకగా గమ్యస్థానాలకు సరుకులను చేరుస్తుండటంతో కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కార్గో సేవల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.122 కోట్ల ఆదాయంతో సత్తా చాటింది ఏపీఎస్ఆర్టీసీ.

'అవమానంతో ఆఫీసు నుంచి వెళ్లగొట్టారు' : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్

ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు.

ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు కీలక మలుపులు తీరుగుతోంది. తాజాగా ఈ కేసులో తదుపరి విచారణకు రావట్లేదని ఈడీకి రోహిత్ రెడ్డి చెప్పారు. తాను ఎందుకు రావట్లేదో.. మెయిల్ ద్వారా స్పష్టంగా వివరించారు.

అంటార్కిటికా మంచు ఫలకలు కరగడం వెనక ఉన్న నిజాన్ని గుర్తించిన పరిశోధకులు

ఒక బహుళజాతి శాస్త్రవేత్తల బృందం ఒక మంచు ఫలకం అస్థిరత, దిగువన ఉన్నమిగతావాటిని ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.

ఐపీఎల్‌లో 114 వికెట్లు తీసినా.. వేలంలో చుక్కెదురు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్‌ ఒకటి. భారత్ ఫాస్ట్ బౌలర్, టీ20 స్పెషలిస్ట్ అయిన సందీప్ శర్మకి ఈ వేలంలో చుక్కెదురైంది. 10మంది ప్రాంచేజీ ఉన్నా.. ఏ ఒక్క ప్రాంచేజీ సందీప్ శర్మ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.

పోషకాలు: ఐరన్, విటమిన్ బీ12.. శరీరానికి సరిగ్గా అందకపోవడం వల్ల కలిగే నష్టాలు

ఐరన్, విటమిన్ బీ12.. ఈ రెండు ఖనిజాలు శరీరానికి సరిగ్గా అందకపోతే శరీరం సక్రమంగా పనిచేయదు. రక్తహీనత వల్ల వచ్చే అనేక ఇతర వ్యాధులను ఇవి దూరం చేస్తాయి.

2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే..

2022లో సుప్రీంకోర్టు మహిళలకు అనుకూలంగా అనేక తీర్పులను వెలువరించింది. అయితే అందులోని 5 చరిత్రాత్మక నిర్ణయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20లో సక్సస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్

ఈ ఏడాది భారత జట్టులోని టీమిండియా ఆటగాళ్లు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రోహిత్‌శర్మ స్థానంలో టెస్టు కెప్టెన్సీ చేపట్టిన రాహుల్ బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించి, తన మొదటి టెస్టు సిరీస్ ను గెలుచుకున్నారు.

సమంతకు ధైర్యం చెబుతూ రాహుల్ రవీంద్ర గిఫ్ట్.. ఆందోళనలో అభిమానులు

స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యశోద సినిమా రిలీజ్ సమయంలో తన అనారోగ్యం గురించి అందరితో పంచుకుంది సమంత.

త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా

మార్గదర్శకంగా నిలిచిన లైఫ్ ఫర్ కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి మోపెడ్ "లూనా" సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అవతారంలో సోదర సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ & పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా లాంచ్ కాబోతుంది.

ఇండియాలో పుట్టి.. కెన్యా జట్టుకు ప్రాతినిధ్యం

భారత సంతతికి చెందిన క్రికెటర్ పుష్కర్ శర్మకి అరుదైన అవకాశం లభించింది. కెన్యా జాతీయ జట్టు తరపున ఆడే ఛాన్స్ పొందాడు. ఈ ఏడాది నవంబర్ నెలలో రువాండాలో జరిగిన టోర్నీలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. తన క్రికెట్ కెరీర్‌కు ఎంతగానో సహకరించిన ఇండియా ఫస్ట్ లైఫ్ సంస్థకు పుష్కర్ ధన్యవాదాలు తెలిపాడు. వారి ఆర్ధిక సహకారం లేకపోతే తన కెరీర్‌ ఇంతవరకు వచ్చేది కాదని తెలిపాడు.

2022 రివైండ్: బాక్సాఫీసు దగ్గర మెరిసిన కుర్ర హీరోలు

2022 సంవత్సరం తెలుగు బాక్సాఫీసు వసూళ్ళ వర్షంతో నిండిపోయింది. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా ఉత్సాహంగా ఉంది. అదే ఉత్సాహంలో 2023లో మరిన్ని విభిన్నమైన కథలు అందించేందుకు రెడీ అవుతోంది.

కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశంంలో కరోనా కేసులు పెరుగుదల పెద్దగా లేకపోయినా..కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండో వేవ్‌లో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేలా దేశవ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సంసిద్ధం చేస్తోంది. ఇందుకోసం మంగళవారం అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆరోగ్యమంత్రి మాండవీయా ఆదేశించారు.

శ్రీలకం టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్‌కు విశ్రాంతి.. సంజుకు చోటు..!

టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జనవరి 03 నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయలేదు. పాత కమిటీ మాత్రమే ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తుంది. టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.

అది వినగానే పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టారు.. ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ఖుషీ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. 2001లో విడుదలైన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ నటనకు సరికొత్త స్టైల్ ని తీసుకొచ్చింది.