06 Jan 2023

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బ్రిటీష్ నటి జమీలా జమీల్, వివరాలివే

బ్రిటీష్ నటి జమీలా జమీల్, ఎహ్లర్ల్ డాన్లర్స్ సిండ్రోమ్ (ఈడీఎస్) అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది.

టెస్టులో సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ

న్యూజిలాండ్ లో జరుగుతన్న టెస్టు సిరీస్ లో పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ సెంచరీ చేశారు. టెస్టులో తిరిగి వచ్చాక సర్ఫరాజ్ 4 సెంచరీలు చేసాడు. ఐదో వికెట్ కు సౌద్ షకీల్ తో కలిసి 123 పరుగులు జోడించారు.

తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్ర‌మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

కాబోయే తండ్రులకు కూడా 12 వారాల సెలవు ప్రవేశపెట్టిన ఫైజర్ ఇండియా

డ్రగ్‌ తయారీ సంస్థ ఫైజర్ భారతదేశంలో తన ఉద్యోగుల కోసం 12 వారాల పితృత్వ సెలవు విధానాన్ని ఉద్యోగుల-కేంద్రీకృత పని వాతావరణాన్ని పెంపొందించే కార్యక్రమాలలో భాగంగా ప్రవేశపెట్టింది.

మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు

స్వదేశీ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి SUV సరికొత్త S-CNG వెర్షన్ గ్రాండ్ విటారాను భారతదేశంలో విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ. 12.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆధారంగా, CNG-శక్తితో పనిచేసే SUV డెల్టా, జీటా వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. ఈ ప్రీమియం మిడ్-సైజ్ SUVకి 26.6km/kg ఇంధన సామర్ధ్యం ఉందని పేర్కొంది.

బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు

ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. బీసీసీఐ కార్యదర్శ జై షా పై పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు తెలియకుండా ఏసీసీ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై ఆయన మండిపడ్డారు.

రవితేజ ఖాతాలో వంద కోట్ల సినిమా, ధమాకా మామూలుగా పేలలేదుగా

కరోనా తర్వాత సినిమా మారిపోయింది. సినిమాలు చూసే జనాలు మారిపోయారు. ఇప్పుడు సినిమా అంటే ఎవ్వరూ ఊహించని విధంగా ఉండాలి. ఎక్కడా దొరకని ఎంటర్ టైన్ మెంట్ అందివ్వాలి అని రకరకాల మాటలు బయటకు వచ్చాయి.

వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్

డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే (ఐఎఫ్‌పిడి) ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ స్క్రీన్‌లతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

Acer, Razer, MSI, ASUS నుండి రాబోతున్న సరికొత్త ల్యాప్‌టాప్‌లు

CES 2023లో, సరికొత్త టెక్నాలజీ వినియోగదారుల ముందుకు వచ్చింది. వివిధ ప్రసిద్ధ బ్రాండ్‌ల నుండి ల్యాప్‌టాప్స్ అమ్మకానికి సిద్ధమవుతున్నాయి. కొత్త తరం ఫీచర్‌లు, తాజా హార్డ్‌వేర్, అత్యుత్తమ-నాణ్యత డిస్‌ప్లే ల్యాప్‌టాప్‌ల కోసం వెతుకుతున్న కొనుగోలుదారులని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ప్రపంచ ప్రసిద్ధ టెక్ ఈవెంట్‌లో Acer, Razer, MSI, ASUS నుండి లాంచ్ అయిన కొత్త ల్యాప్‌టాప్స్ గురించి తెలుసుకుందాం.

చెల్సియాపై మంచెస్టర్ సిటీ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23 లీడర్స్ ఆర్సెనల్‌తో చెల్సియాను 1-0తో మాంచెస్టర్ సిటీ ఓడించింది. 63వ నిమిషంలో రియాద్ మహ్రెజ్ సిటీ తరఫున గోల్ చేశాడు. మొదటి అర్ధభాగంలో చెల్సియా జట్టు గాయాల కారణంగా రహీం స్టెర్లింగ్, క్రిస్టియన్ పులిసిక్ ఇద్దరినీ కోల్పోయింది. ప్రస్తుతం సిటీ రెండో స్థానంలో, చెల్సియా 10వ స్థానంలో ఉంది.

దవడ నుండి చెవి వరకు నొప్పిగా ఉంటుందా? టీ ఎమ్ జే డిజార్డర్ కావచ్చు

టీ ఎమ్ జే డిజార్డర్ అనేది దవడ జాయింట్ల వద్ద నొప్పిని కలిగిస్తుంది. దీనివల్ల దవడ చుట్టూ ఉన్న కండరాల్లో నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు ఈ నొప్పి చెవి వరకూ ఉంటుంది.

'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా

నాసా పాలపుంతకు సంబంధించిన ఒక చిత్రాన్ని విడుదల చేసింది. నక్షత్ర మండలం లోపల కుడి వైపున కాస్మిక్ దుమ్ము, శిధిలాలతో, నక్షత్రాలతో నిండి ఉన్నా సరే చిత్రంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం

అక్రమ పద్ధతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారిపై కోల్‌కతా హైకోర్టు కోరడా ఝులిపించింది. తప్పుడు మార్గాల ద్వారా ఉద్యోగాలను పొందిన 59మందిని విధుల నుంచి తొలగించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది.

సెలక్షన్ కమిటీని తొలగించిన DDCA చీఫ్

సీనియర్ రాష్ట్ర సెలక్షన్ కమిటీని ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ తొలగించారు. ప్యానల్‌లో అంతర్గత పోరు, ఎంపికల కారణంగా తప్పించినట్లు సమాచారం. సెలక్షన్ కమిటీ తన విధులను నిర్వర్తిస్తున్న తీరుపై గతంలో జైట్లీ ప్రశ్నించారు.

ఆల్కహాల్ వల్ల కలిగే కాలేయ వ్యాధులు: ఈ సంకేతాలు కనిపిస్తే డేంజర్ బెల్స్ మోగినట్టే

మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి కాలేయం. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే ఆహార జీర్ణక్రియలో తోడ్పడి ఆహారంలోని పోషకాలను శరీరానికి అందిస్తుంది. అలాగే కాలేయానికి ఓ లక్షణం ఉంది.

అర్ష్‌దీప్‌పై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ అర్ష్ దీప్ నోబాల్స్ పై టీమిండియా మాజీ ప్లేయర్ గవాస్కర్ సీరియస్ అయ్యారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అర్షదీప్ 5 నోబాల్స్ వేసి ఓ చెత్త రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే.

సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాలుగు రోజలు పర్యటన నిమ్మితం భారత్‌కు వచ్చారు . నాలుగో రోజైన శుక్రవారం నాదెళ్ల హైదరాబాద్‌కు రాగా.. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

లాస్ వెగాస్ CES 2023లో సరికొత్త ఆకర్షణ Peugeot ఇన్సెప్షన్ కాన్సెప్ట్

లాస్ వెగాస్‌లోని CES 2023లో Peugeot ఇన్‌సెప్షన్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శించింది దాని తయారీసంస్థ. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ఫాస్ట్ ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్‌తో కేవలం ఐదు నిమిషాల్లో 150కిమీల వరకు వెళ్లగలదు. ఇందులో వీడియో గేమ్స్ లో ఉన్నట్టు దీర్ఘచతురస్రాకార స్టీరింగ్ వీల్‌ను ఉపయోగించే హైపర్‌స్క్వేర్ స్టీర్-బై-వైర్ కంట్రోల్ సిస్టమ్‌తో వచ్చే ఐ-కాక్‌పిట్‌ కూడా ఉంది.

సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వివిధ శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులను నియమించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సలహాదారులను నియమించే అధికారం ఉందా? లేదా? అనే దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని డివిజన్‌ ​​బెంచ్‌ పేర్కొంది.

జనవరి 6న వచ్చే Free Fire MAX కోడ్‌లు ఎలా రీడీమ్ చేయాలో తెలుసుకుందాం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో Free Fire MAXని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం మొదలుపెట్టారు, తద్వారా గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

వాల్తేరు వీరయ్య: ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఒకరోజు ముందే ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి సంబరంగా జనవరి 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు రెడీ అయ్యింది.

టీ20 సిరీస్‌పై భారత్ కన్ను

పూణేలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. శ్రీలంక 16 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. శ్రీలంక కెప్టన్ షనక 56 పరుగులు చేసి శ్రీలంక విజయంలో భాగస్వామ్యం అయ్యాడు.

యూఎస్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో టాప్ లో వీరసింహారెడ్డి

సంక్రాంతి సందర్భంగా థియేటర్లను షేక్ చేయడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. తెలుగులో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదల అవుతున్నాయి.

ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని

దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో పోలీసులు మరో పురోగతిని సాధించారు. అంజలిని 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు యజమాని అశుతోష్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అంజలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు కారులో ఉన్న నలుగురితో పాటు మరో వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

స్వియాటెక్ పై జెస్సికా పెగులా విజయం

ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ పై 6-2, 6-2 తేడాతో జెస్సిగా పెగులా విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఓపెనింగ్ సింగిల్స్ రబ్బర్‌లో జెస్సిగా పెగులా యూనైటెడ్ స్టేట్ కు మంచి అరంభాన్ని అందించింది.

ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్

Keeway సంస్థ Moto Bologna Passione (MBP) త్వరలో అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా (AARI) ద్వారా భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. క్రూయిజర్‌తో పాటు, వాహన తయారీ సంస్థ M502N స్ట్రీట్‌ఫైటర్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది, గ్లోబల్ తయారీ సంస్థలు ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.

జుట్టు రాలిపోయే సమస్యకు ఇంట్లో తయారు చేసుకునే షాంపూతో చెక్ పెట్టండి

కాలుష్యం పెరుగుతున్న కొద్దీ కాలంతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్య.

గుడి గోపురంపై కుప్పకూలిన విమానం

మధ్యప్రదేశ్‌లోని రేవాలో శిక్షణ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందగా.. శిక్షణ తీసుకున్నంటున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాముల ఈ ప్రమాదం జరిగినట్లు రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు.

10 బంతుల్లో 5 నో బాల్స్.. అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ పేసర్ అర్షదీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. కేవలం 10 బంతుల్లో 5 నోబాల్స్ వేశాడు. దీంతో ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక నోబాల్స్ వేసిన భారత్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

పొట్ట తగ్గించడంలో ప్రతీసారీ ఫెయిల్ అవుతున్నారా? ఈ ఆహారాలు ట్రై చేయండి

కేలరీలు ఎక్కువగా ఉండే అహారాలనే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. కానీ వాటివల్ల కొవ్వు మొత్తం పొట్ట దగ్గర చేరుతుంది. అప్పుడు మళ్లీ దాన్ని కరిగించుకోవడానికి కష్టపడతారు.

జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. కాజీపేట మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని షెడ్యూల్‌ను బట్టి జనవరిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌ ప్రారంభోత్సవాన్ని నిర్వహించే అవకాశం ఉందని పీఎంఓ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్

ఫోన్‌లను మార్చినప్పుడు వాట్సాప్ చాట్ హిస్టరీని బదిలీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. గత సంవత్సరం, ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్ చాట్‌లను సులభంగా తరలించే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. ఈ కంపెనీ ఇప్పుడు చాట్ చరిత్రను కొత్త Android డివైజ్ కు సులభంగా ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్‌పై పని చేస్తోంది.

అక్షర్ ఆటకు అభిమానులు ఫిదా

పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత పోరాటం చేసింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ (31బంతుల్లో 65; 3ఫోర్లు, 6 సిక్సర్లు) కొట్టి అందరి మనసులను దోచుకున్నారు. శ్రీలంక కెప్టెన్ షనక, అక్షర్‌ను ఛాతిపై తట్టి అభినందించాడు.

ఇంటివాడు కాబోతున్న హీరో శర్వానంద్, ఎంగేజ్ మెంట్ ఎప్పుడంటే

టాలీవుడ్ లో పెళ్ళి బాజాలు వరుసగా వినిపించనున్నాయి. యంగ్ హీరోలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కబోతున్నారు. మొన్నటికి మొన్న నాగశౌర్య వివాహం జరిగింది.

త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ

అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1, 2024 నాటికి రామమందిరాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. త్రిపురలో ఎనిమిది రోజలు పాటు జరగనున్న బీజేపీ 'రథయాత్ర'ను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు.

05 Jan 2023

బ్రిటన్ రాజకుటంబంలో రచ్చ: కుక్క తినే ప్లేట్‌పైకి ప్రిన్స్ హ్యారీ ని తోసేసిన అన్న విలియం!

బ్రిటన్ రాజకుటుంబంలో జరిగిన మరో సంచలన విషయం బయటికి వచ్చింది. ప్రిన్స్ హ్యారీ, విలియం మధ్య జరిగిన ఘర్షణనను అంతర్జాతీయ మీడియా సంస్థ 'ది గార్డియన్' రాసుకొచ్చింది.

తెలుగు సినిమా: ఉస్తాద్ రామ్ తో ధమాకా శ్రీలీల రొమాన్స్ షురూ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఉస్తాద్ రామ్ గా మారిపోయాడు. ఐతే ఇస్మార్ట్ విజయం తర్వాత రామ్ ఖాతాలో మరో విజయం చేరలేదు.

డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల

2022 డిసెంబర్ లో 15 శాతం వృద్ధిని నమోదు చేసి భారతదేశ దేశీయ విమాన ప్రయాణీకులు దాదాపు 129 లక్షలకు చేరుకున్నారు.

మాంచెస్టర్ సిటీతో జియో కీలక ఒప్పందం

మాంచెస్టర్ సిటీ జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ (JIO)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ సేవల బ్రాండ్ క్లబ్ అధికారిక మొబైల్ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ భాగస్వామిగా జియో అవతరించనుంది.

ఇంటి గోడలకు ఇంకా రంగు వేస్తున్నారా? రంగు లేకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి

గోడలకు రంగువేయడం అనేది చాలా సాధారణమైన విషయం. ఇంటిని కళాత్మకంగా చేయడానికి రకరకాల పెయింటింగ్స్ వాడతారు. కానీ ఇప్పుడు అది పాత పద్దతిగా మారిపోయింది.

నంబర్‌వన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్

శ్రీలకంతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 10 బంతుల్లో 7 పరుగులు చేసినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాకింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ 10 స్థానాలను మెరుగుపరుచుకొని 23 స్థానానికి, దీపక్ హుడా 97వ స్థానానికి చేరుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో హార్ధిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు.

షాకింగ్ న్యూస్: దేశంలో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు

చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్-7 సబ్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో దేశంలో కూడా దీనిపైనే చర్చ జరిగింది. అయితే తాజాగా తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే.. దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నాయని తేలింది. ఈ విషయంగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను కనుగొన్నిది అంతర్జాతీయ ప్రయాణికుల్లోనే కావడం గమనార్హం.

మీకు తెలుసా? సౌరశక్తితో పనిచేసే కణాలు వృద్ధాప్యాన్ని వాయిదా వేయగలవు!

సౌరశక్తితో పనిచేసే కణాలు వినియోగం మానవ జీవితకాలాన్ని పొడిగించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చగల మైటోకాండ్రియా జన్యుపరంగా రూపొందించబడింది.

ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు

ప్రపంచ సినిమా అవార్డ్స్ అన్నింటిలో ఆస్కార్ స్థానం ప్రత్యేకం. ఏ దేశ కళాకారులైనా ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని ఆశపడుతుంటారు. ఆస్కార్ కోసమే సినిమాలు చేస్తుంటారు కూడా.

క్వెంటిన్ హాలీస్‌ను ఓడించిన నోవాక్ జొకోవిచ్

అడిలైడ్‌లో క్వెంటిన్ హాలీస్‌ను నోవాక్ జొకోవిచ్ ఓడించి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గురువారం హాలీస్‌ను 7-6(3), 7-6(5)తో పోరాడి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు నోవాక్ జొకోవిచ్.. 57 నిమిషాలు పాటు ఇద్దరు హోరాహోరీగా పోరాడాడు. భీకర ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ అద్భుతమైన షాట్లతో హాలీస్‌ను గెలుపొందాడు.

కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు

కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.

బాలయ్య అఖండ హిందీలో విడుదల

బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కరోనా వల్ల థియేటర్లలోకి రావడానికి జనాలు ఇబ్బంది పడుతున్న సమయంలో రిలీజై, వసూళ్ళలో తుఫాను సృష్టించింది.

50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు

హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మారుతీ-సుజుకి NEXA బ్లాక్ ఎడిషన్ మోడల్స్

భారతదేశంలో 40 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణానికి గుర్తుగా, స్వదేశీ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి NEXA సిరీస్ లో ప్రత్యేక బ్లాక్ ఎడిషన్ మోడల్స్ ను విడుదల చేసింది. అన్ని కార్లు ప్రత్యేక 'పెరల్ మిడ్‌నైట్ బ్లాక్' పెయింట్ స్కీమ్‌తో వస్తున్నాయి.

టీ20 సిరీస్‌పై టీమిండియా గురి

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ అతి కష్టం మీద మ్యాచ్ ను గెలిచింది. నేడు సాయంత్రం పుణేలో రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గి సిరీస్ సాధించాలని భావిస్తోంది టీమిండియా.

దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు

దిల్లీలోని సుల్తాన్‌పురి ఘటన మరవక ముందే... నోయిడాలో అలాంటి ప్రమాదమే వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ రోజు రాత్రి నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్ కౌశల్ యాదవ్ బైక్‌ను కారు ఢీకొట్టడంతో పాటు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కౌశల్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆహారం: ఉప్మా రవ్వతో నోరూరించే రెసిపీస్ తయారు చేయండిలా

ఉప్మా అనగానే అబ్బా అని ముఖం చాటేస్తారు. చాలా సులభంగా తయారయ్యే వంటకం కాబట్టి అలా ఫీలవుతారు.

వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

నీటి సరఫరా నిర్వహణపై కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పంచాయతీలను కోరారు. మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సులో 'వాటర్ విజన్- 2047'ను ఉద్దేశించి వర్చువల్‌గా మోదీ మాట్లాడారు.

టెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత రికార్డు

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ టెస్టు మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ట్రావిడ్ హెడ్ హఫ్ సెంచరీని పూర్తి చేశారు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. మొత్తం టెస్టులో 12 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. కేవలం 59 బంతుల్లో 70 పరుగులు చేశారు. ఎప్పటిలాగే హెడ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 450 పరుగులను పూర్తి చేసింది.

సబ్-బ్రాండ్ AFEELAని ప్రకటించిన సోనీ హోండా మొబిలిటీ

CES 2023లో టెక్నాలజీ దిగ్గజం సోనీ, జపనీస్ ఆటోమేకర్ హోండా మధ్య జాయింట్ వెంచర్ అయిన AFEELA అనే EV సబ్-బ్రాండ్‌ను ప్రకటించారు.

చర్మ సంరక్షణ: చర్మంపై పులిపిర్లు రావడానికి కారణాలు, వాటిని పోగొట్టే విధానాలు

పులిపిర్లు చర్మంలో ఏ ప్రాంతంలోనైనా ఏర్పడతాయి. ఆడ మగా తేడా లేకుండా ఎవ్వరిలో అయినా ఇవి ఏర్పడతాయి. వీటివల్ల హాని కలగదు కానీ చర్మం మీద ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.

మరో 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌

ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 18వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటించారు.

Bingలో ChatGPT AIతో గూగుల్ ను సవాలు చేయనున్న మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం బ్లాగ్ పోస్ట్‌లో OpenAI, DALL-E 2 నుండి ఇమేజ్-జెనరేషన్ సాఫ్ట్‌వేర్‌ను Bingకి అనుసంధానించాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది.

శామ్ కర్రన్‌ను క్షమాపణ కోరిన విమానయాన సంస్థ

ఇంగ్లండ్ యువ క్రికెటర్ శామ్ కర్రన్ ఐపీఎల్ వేలంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శామ్ కర్రన్ కు ఎయిర్ లైన్ సంస్థ క్షమాపణలు కోరుతూ ట్విట్ చేసింది. బుధవారం బ్రిటిష్ విమానయాన సంస్థ అయిన వర్జిన్ అట్లాంటిక్ లో ప్రయాణించడానికి శామ్ కర్రన్ అసౌకర్యంగా భావించాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా పోస్టు చేశాడు.

ఫిబ్రవరిలో తెలుగు తెర మీద చిన్న సినిమాల సందడి

తెలుగు బాక్సఫీసు వద్ద సంక్రాంతి సందడి వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటారు.

పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్

పశ్చిమ బెంగాల్‌లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది.

గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మ

టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్‌కి దురదృష్టం వెంటాడుతోంది. మంగళవారం వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సంజూకి గాయమైంది. అతని స్థానంలో ఐపీఎల్‌లో అకట్టుకున్న జితేష్ శర్మ టీ20లో అరంగేట్రం చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం బీసీసీఐ ధ్రువీకరించింది.

ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV

బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం 2023 MG 4ని ఈ నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.MG 4 గత ఏడాది జూలైలో గ్లోబల్ మార్కెట్‌ లో లాంచ్ అయింది.

ఆహా: అన్ స్టాపబుల్ షోలో పవన్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేది ఆరోజే

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో దూకుడు చాలా ఎక్కువగా ఉంది. ఈ షో కారణంగా ఆహా సబ్ స్క్రయిబర్స్ గణనీయంగా పెరుగుతున్నారు.

టీమిండియాలో చోటు దక్కాలంటే యోయో, డెస్కా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే..

టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కొన్ని నెలలుగా చాలా అనుమానాలున్నాయి. గాయాలు కారణంగా బరిలోకి దిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే అందరికీ యోయో పరీక్షలంటే తెలుసు. దీనికి తోడు డెక్సా స్కాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

అమెరికా వాసులు ఇష్టపడే విప్డ్ క్రీమ్ రెసిపీస్ ఇంట్లోనే తయారు చేసుకోండి

జనవరి 5వ తేదీన అమెరికాలో జాతీయ విప్డ్ క్రీమ్ డేని జరుపుకుంటారు. విప్డ్ క్రీమ్ అంటే మెత్తటి క్రీమ్ అని అర్థం. భారతదేశ ప్రజలకు అమెరికాతో సంబంధాలు ఎక్కువ కాబట్టి అక్కడి ఆహారాలను రుచి చూడాలనే కోరిక ఉంటుంది.

డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షద్ పటేల్‌కు ఏమైంది

డెత్ ఓవర్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే హర్షల్ పటేల్ లేటుగా ఎంట్రీ ఇచ్చినా టీమిండియాకి కీ బౌలర్‌గా మారాడు. స్లో బాల్స్‌తో బ్యాటర్‌ను పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టడం హర్షల్ పటేల్ స్పెషాలిటీ. శ్రీలంకతో జరిగిన టీ20లో రెండు వికెట్లు తీసినప్పటికీ, 41 పరుగులు ఇచ్చాడు.

CES 2023లో సరికొత్త Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ ప్రారంభం

CES 2023లో గేమింగ్ పరిశ్రమ కోసం Govee మొట్టమొదటిసారిగా AI-ఆధారిత లైటింగ్ సొల్యూషన్‌ను పరిచయం చేయబోతుంది. దీనిని Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ అని అంటారు. ఇది ఆన్-స్క్రీన్ గేమింగ్ కంటెంట్ నుండి కీలక విషయాలను విశ్లేషించడానికి, వాటిని సాంకేతికత ఉపయోగించి మళ్ళీ సరికొత్త లైటింగ్ ఎఫెక్ట్స్ తో చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇది 2023లో లాంచ్ అవుతుందని ప్రకటించారు కానీ ధర ఇంకా వెల్లడించలేదు.

560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష

560 శవాలకు చెందిన అవయవాలను అక్రమంగా విక్రయించిన ఘటన ఆమెరికాలోని కొలోరాడోలో వెలుగుచూసింది. ఈ కేసులో ఓ మహిళకు 20ఏళ్లు, ఆమె తల్లికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది.

అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను.. దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ అరూప్ బసు బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరే సమయంలో సోనియాగాంధీ వెంట ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా ఉన్నారు.