24 Dec 2022
కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం
దేశానికి కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ బీఎఫ్ 7' ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. తాజాగా మరికొన్ని సూచనలు చేసింది.
చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు
చలి పెరుగుతున్న కొద్దీ గుండె మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తగ్గిన కొద్దీ రక్తప్రవాహంలో మార్పులు వస్తాయి కాబట్టి గుండెకు ఎక్కువ పని పడుతుంది.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కి కొత్త పదవి
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే నాజామ్ సేథీ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని నియమించింది. ఇందులో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి చోటు దక్కింది.
2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం
సాధారణంగా కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఒక కంపెనీ మరొక దానిని స్వాధీనం చేసుకుంటుంది. కొనుగోలు చేసిన కంపెనీ దాని పేరు, బ్రాండ్ విలువ సిబ్బందిని ఉంచుకోవచ్చు లేదా ఉంచకపోవచ్చు.
టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ
సంక్షేమ హాస్టళ్లలో ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా 581 ఖాళీలను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, మాట్రాన్ గ్రేడ్-1, 2, వార్డెన్ గ్రేడ్-1, 2తో పాటు మహిళా సూపరింటెండెంట్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన రాఫెల్ నాదల్
టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ రిటైర్మంట్ పై క్లారిటీ ఇచ్చారు. లావర్ కప్ లో తన చిరకాల ప్రత్యర్థి అయిన ఫెదరర్ వీడ్కోలుకు హజరైన తర్వాత తన రిటైర్మెంట్ గురుంచి స్పందించారు.రిటైర్మెంట్ గురించి ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.
డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్
క్రిస్మస్ పార్టీలో ఆహా అనిపించే ఆహారంతో పాటు అమోఘమైన స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ డయాబెటిస్ ఉన్నవారు ఈ విషయంలో నిరాశ పడాల్సి వస్తుంది.
కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం
కృష్ణ జన్మభూమి వివాద స్థలంపై ఉత్తరప్రదేశ్లోని మథుర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జనవరి 2 తర్వాత.. షాహీ ఈద్గా మసీదు ఉన్న వివాదాస్పద స్థలాన్ని సర్వే చేయాలని పురావస్తు శాఖను ఆదేశించింది. జనవరి 20 తర్వాత నివేదికను సమర్పించాలని సూచించింది.
2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా?
వచ్చే ఏడాది US జాబ్ మార్కెట్ బలహీనంగా కొనసాగితే, కంపెనీలు రిమోట్గా పని చేయడానికి ఉద్యోగులను అనుమతించకుండా వెనక్కి తీసుకోవచ్చు. ఉద్యోగులు సాధారణంగా ఇంటి నుండి పని చేయడంపై రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహమ్మారి సమయంలో ఇంటి నుండి పనిచేస్తూ ఎంతో సమయాన్ని ఆదా చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెప్తే, మరికొందరు కంపెనీ సంస్కృతి కార్యాలయంలో సరైన విధంగా ఉంటుందని చెప్పారు.
ఫ్రెంచ్ ప్రపంచ కప్ విజేత బ్లైస్ మటుయిడి రిటైర్మెంట్
ఫ్రాన్స్ మాజీ మిడ్ఫీల్డర్ బ్లేజ్ మటుయిడి ప్రొఫెషనల్ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల మటుయిడి 2018లో ప్రపంచ కప్ను గెలుచుకున్నాడు. మూడేళ్ల క్రితం లెస్ బ్ల్యూస్ కోసం తన 84 ప్రదర్శనలలో చివరిగా ఆడాడు.
బర్త్ డే స్పెషల్: తీయనైన తెలుగులో మహ్మద్ రఫీ పాట.. తేనెకన్నా మధురం
1970, 80ల్లో మీకు ఏ సింగర్ ఇష్టమని ఎవరినైనా అడిగితే భాషతో సంబంధం లేకుండా అందరూ మహ్మద్ రఫీ అని చెప్పేవారు. ఆ గొంతులో ఉన్న మాధుర్యానికి అంతగా పరవశించిపోయారు.
ఐర్లాండ్ ఆటగాడిని రూ.4.4 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
ప్రపంచలోనే మోస్ట్ పాపులర్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఆడటాన్ని చాలా గొప్ప గౌరవంగా భావిస్తారు ప్రపంచదేశాల క్రికెటర్లు.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో అసోసియేట్ ప్లేయర్లకు అవకాశం దక్కింది.. ఇండియా, ఐర్లాండ్ మధ్య జరిగిన సీరిస్ లో అద్భుతంగా అదరగొట్టిన జోషువా లిటిల్ని రూ.4.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన మొట్టమొదటి ఐర్లాండ్ క్రికెటర్ గా జోషువా లిటిల్ రికార్డు క్రియేట్ చేశాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా?
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ అనుకున్నట్లే ఇతర రాష్ట్రాల్లో పాగా వేస్తారా? జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
చలి చంపేస్తుందా? మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి
చలికాలం రాగానే మన శరీరాన్ని చలి నుండి కాపాడుకోవడానికి ఎక్కడో దాచిపెట్టేసిన స్వెట్టర్లను, దుప్పట్లను బయటకు తీస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఐతే చలి చంపేస్తుంది.
ఆరోగ్యం: నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళకు కావాల్సినంత ప్రోటీన్ అందించే ఆహరాలు
మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. చికెన్, గుడ్లు, సాల్మన్ చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ వల్ల శరీరంలోని కణాలు వృద్ధి చెంది శరీరాన్ని పుష్టిగా ఉంచుతుంది.
మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్లు!
2022లో, వాట్సాప్ లో కొత్త ఫీచర్లను విడుదల చేసింది పేరెంట్ సంస్థ మెటా. ఆ టాప్ ఫీచర్ల జాబితా ఇక్కడ ఉంది.
పింక్బాల్ టెస్టుకు భారత్ దూరం
2015లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి పింక్బాల్ టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పింక్బాల్ టెస్ట్గా పిలిచే డే-నైట్ టెస్ట్, ఇతర టెస్టుల కంటే భిన్నంగా ఉంటుంది.
తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా
ఈ సంవత్సరం తెలుగు సినిమాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్, కార్తికేయ, సీతారామం, బింబిసార సినిమాలతో బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిసింది.
81కోట్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అదేంటంటే?
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి కరోనా ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ఇంకో ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. 81కోట్ల మందికి రేషన్ఉచితంగా అందించాలని ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర కేబినెట్నిర్ణయం తీసుకుంది.
టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం
సీఈఓ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ తాను టెస్లాలో 18 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎలాంటి షేర్లను విక్రయించనని అన్నారు. మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసినప్పటి నుండి స్టాక్ దాని విలువలో దాదాపు సగం కోల్పోయింది.
అమెరికా విదేశాంగ శాఖ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవిని కట్టబెట్టాడు. భారతీయ మూలాలున్న రిచర్డ్ వర్మను అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్ అండ్ రిసోర్సెస్ డిప్యూటీ సెక్రటరీగా నామినేట్ చేశారు.
మైగ్రేన్ నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి
మాములు తలనొప్పికి, మైగ్రేన్ కి చాలా తేడా ఉంటుంది. మైగ్రేన్ వలన నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందుకే మైగ్రేన్ నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
'పూరన్.. యూనివర్శనల్ బాస్ నుండి తీసుకున్న అప్పు తిరిగిచ్చేయాలి': క్రిస్ గేల్
2023 మినీ IPLలో ఆల్ రౌండర్లు ఆధిపత్యం చెలాయించారు. సామ్ కర్రన్ ను Rs.18.5 కోట్ల రికార్డు స్థాయికి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది, గ్రీన్ని ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లకు తీసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులోని తేని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు. స్వాములు ప్రయాణిస్తున్న వాహనం దాదాపు 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల
మాస్ దేవుడు బాలకృష్ణ, సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. జనవరి 12వ తేదీన వీరసింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు
2022లో మెరుగైన, ఉపయోగకరమైన ఫీచర్స్ తో వినియోగదారులను మెప్పించిన టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే
2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి
స్మార్ట్ఫోన్ లాంచ్ల పరంగా 2022 ప్రత్యేకమైన సంవత్సరం. జనవరి 2022 నెలలోనే దాదాపు 5 పెద్ద లాంచ్ లు జరిగాయి. ఆపిల్, సామ్ సంగ్, గూగుల్, OnePlus, Vivo, Xiaomi, Oppo సంస్థలు ఆకర్షిణీయమైన ఫోన్లను విడుదల చేశారు.
అఖేతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు
బ్లిగియా సపిడాను మాములుగా అఖే అని పిలుస్తారు. ఈ జమైకన్ జాతీయ పండు నలుపు గింజలతో పసుపు రంగులో ఉంటుంది.
కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు
చైనాతో పాటు అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈమేరకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల్లో కనీసం 2శాతం మందికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. శనివారం నుంచే ఈ పరీక్షలు చేయనున్నారు.
వీరసింహారెడ్డి: బాలయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి
అఖండ సినిమా విజయం తర్వాత బాలయ్య నుండి వస్తున్న వీరసింహారెడ్డి అనే సినిమా వస్తోంది. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి.
నికోలస్ పూరన్ దమ్మున్న అటగాడు : గౌతమ్ గంభీర్
వైస్టిండీస్ అటగాడు నికోలస్ పూరన్ ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టారు. ఈ ప్లేయర్ కోసం రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటిపడగా.. చివరికి అతడ్ని రూ. 16 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా?
Pixel 7a, Pixel Fold లాంచ్ కు నెలలు గడువు ఉండగానే ధర, స్పెసిఫికేషన్, డిజైన్ గురించి ఆన్లైన్ లో లీక్ అయింది. ఈమధ్యనే ఐఫోన్ 15 Ultra ధర కూడా ప్రకటించారు. ఇది 2023 చివరి నాటికి లాంచ్ కాబోతుంది.
పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు కోసం ఇటీవల 40రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు.
సరికొత్త ఫీచర్తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్
ప్రముఖ బ్రాండ్ boAT మార్కెట్లో కొత్త స్మార్ట్వాచ్ను విడుదల చేసింది. స్మార్ట్వాచ్ అనుకూలమైన ధరతో లాంచ్ అయినప్పటికీ, ఇది బ్లూటూత్ కాలింగ్తో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఇటువంటి ఫీచర్ ఖరీదైన స్మార్ట్వాచ్లకు మాత్రమే పరిమితం అయ్యివుండేది.
ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్
ఆపిల్ వాచ్ సిరీస్ కు GPS కనెక్టివిటీకు ఇప్పుడు ఐఫోన్ అవసరం లేదు. 2022 నుండి ఆపిల్ వాచ్ ఒక ప్రధాన అప్డేట్ను పొందింది. ఇప్పుడు ఐఫోన్ దగ్గర ఉన్నా సరే ఆపిల్ వాచ్ తన సొంత GPS ను వాడుతుంది. ఇంతకు ముందు ఆపిల్ వాచ్ ప్రాసెసింగ్ కోసం సమీపంలోని ఆపిల్ వాచ్ పై ఆధారపడేది.
తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?
అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించి.. తెలంగాణలో చాలా కాలంగా యాక్టివ్గా లేని టీడీపీని చంద్రబాబు తిరిగి చర్చలోకి తీసుకోచ్చారు. టీడీపీ యాక్టివ్ అయితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?
వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
23 Dec 2022
ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
టెర్రర్ ఫండింగ్తో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న వారి ఇళ్లపై శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. జమ్ముకశ్మీర్లోని దాదాపు 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కొన్ని డిజిటల్ డివైజ్లు, సిమ్ కార్డులు సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు.
భారత్ హాకీ జట్టు కెప్టెన్గా హర్మన్ప్రీత్ సింగ్
ఒడిశాలోని భువనేశ్వర్-రూర్కెలాలో జనవరి 2023లో జరగనున్న ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రపంచ కప్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శుక్రవారం ప్రకటించారు.
వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రెడీ అవుతోంది. 2023 జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఐతే ప్రచార పనులు మాత్రం పెద్ద ఎత్తున ఇంకా మొదలు కాలేదు.
గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే..
హైదరాబద్లోని గోషామహల్ బస్తీలో అనూహ్య సంఘటన జరిగింది. ఉన్నట్టుండి పెద్ద నాల కుంగిపోయింది. దీంతో ఆ నాలాపై ఉన్న దుకాణాలు, అక్కడ నిలిపేసిన వాహనాలు అందులోకి పడిపోయాయి. వాహనాలు స్వల్పంగా దెబ్బ తినగా.. కొందరికి గాయాలయ్యాయి.
వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థ OLA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, మోటార్బైక్లు, స్కూటర్లు, వంటి వాణిజ్య వాహనాలను కూడా తయారు చేయనుందని రాబోయే 12 నెలల్లో ఈ ఉత్పత్తులపై మరిన్ని ప్రకటనలను వింటారని ఆ సంస్థ సహా వ్యవస్థాపకులు భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయిన అటగాళ్లు వీరే..
IPL 2023 వేలంలో అస్ట్రేలియా హిట్టర్ కామెరూన్ గ్రిన్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. అతన్ని ముంబై ఇండియన్స్ ఏకంగా రూ. 17.50 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్ కోసం ముంబై, ఢిల్లీ పోటి పడగా.. చివరికి MI దక్కించుకుంది. అదే విధంగా ఇంగ్లాడ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ కూడా అధిక ధర పలికాడు. అతడిని చైన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. చివరిసారిగా స్ట్రోక్స్ రాజస్థాన్ తరుపున అడాడు. ఈసారి స్ట్రోక్స్ ను ఆ జట్టు రిటైన్ చేసుకోవడంతో వేలంలోకి వచ్చాడు.
మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా?
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్ళిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల, వరుస సినిమాలకు సంతకాలు చేస్తూ బిజీగా ఉంది.
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్కు కేంద్రం ఆమోదం.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే ?
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్కు అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. బూస్టర్ డోస్గా నాసల్ వ్యాక్సిన్కు వేసుకోవచ్చని సూచించారు.
ప్రకటన రహిత బేసిక్ ప్లాన్ ను దాచిపెడుతున్న నెట్ ఫ్లిక్స్
నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ లో బేసిక్ ప్రకటన-రహిత ప్లాన్ కనిపించడం లేదు. ప్రస్తుతం యూజర్లకు బేసిక్ యాడ్స్ ప్లాన్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు
ఈ సంవత్సరంలో చాలా అంచనాలతో విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి
భారత సైనిక వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16జవాన్లు వీర మరణం పొందారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. నార్త్ సిక్కిం ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఉదయం పూట కనిపించే ఈ లక్షణాల వల్ల షుగర్ వ్యాధిని పసిగట్టవచ్చు
భారతదేశంలో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది నిశ్శబ్దంగా వచ్చి శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. దీనివల్ల గుండె, కిడ్నీ మొదలగు అవయవాల పనితీరుల్లో మార్పు వస్తుంది.
'అత్యంత ఖరీదైన అటగాళ్లలో బెన్ స్ట్రోక్స్ ఒకరు': మోర్గాన్
2023 వేలంలో అత్యంత ఖరీదైన అటగాళ్లలో బెన్ స్టోక్స్ ఒకరని ఇంగ్లాడ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపారు. ఇంగ్లాడ్ టెస్ట్ కెప్టెన్ మెరుగైన ప్రదర్శన చేశారన్నారు. మ్యాచ్ ప్రభావం మార్చగల సత్తా బెన్ స్టోక్స్ ఉందన్నారు.
లద్దాఖ్లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా
భారత్- చైనా కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరిగిన 17వ సమావేశంలో సరిహద్దు వివాద పరిష్కారానికి ఎలాంటి ముందడుగు పడలేదు. తూర్పు లద్దాఖ్లోని డెప్సాంగ్ ప్లెయిన్స్, చార్డింగ్ నింగ్లుంగ్ నుల్లా జంక్షన్లో భారత సైన్యానికి పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరించడానికి చైనా అంగీకరించకపోవడంతో.. కొన్ని తాత్కాలిక నిర్ణయాలు తీసుకొని సమావేశాన్ని ముగించారు.
క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత
'క్రిస్మస్' అనేది ఆంగ్ల పదం దీనికి 'క్రీస్తు పుట్టినరోజున ఏర్పడిన సమూహం' అని అర్ధం వస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఈ వేడుకకు వేర్వేరు పేర్లు వాడుకలో ఉన్నాయి.
పంజాబ్ టైటిల్ కొట్టేనా..?
IPL 2023 ముందు PBKS అటగాళ్ల విషయంలో కీలక మార్పులు చేసింది. అయినా 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ అశించన స్థాయిలో రాణించలేదు.
పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి
క్రిస్మస్ సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. పండగ రోజు ఏం చేయాలన్న ప్రణాళికను చాలామంది ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నారు.
రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం
దేశీయ స్టాక్లు శుక్రవారం వరుసగా నాల్గవరోజు పడిపోయాయి, BSE సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు పడిపోయింది. NSE నిఫ్టీ మార్క్ 18,000 దిగువకు జారింది.
ఛతేశ్వర్ పుజారా సన్సేషనల్ రికార్డు
టీమిండియా క్రికెటర్ చెతేశ్వర్ పుజారా టెస్టుల్లో మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ ఇండియన్ క్రికెటర్గా పుజారా నిలిచాడు.
గంగూలీకి గవాస్కర్ వార్నింగ్...బీసీసీఐ అధ్యక్షుడివి కాదంటూ
భారత్ క్రికెట్లో సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ లెజెండరీ ప్లేయర్లు.. భారత్ క్రికెట్ ఎన్నో సేవలందించారు. ఒకరు 1983 వరల్డ్కప్ గెలిచిన టీమ్లో సభ్యుడు కాగా.. మరొకరు మ్యాచ్ ఫిక్సింగ్ ఊబిలో చిక్కుకొని విలవిల్లాడుతున్న ఇండియన్ క్రికెట్ను మళ్లీ ఓ లెవల్కు తీసుకెళ్లిన కెప్టెన్.
క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి
పండగ పూట కొత్త బట్టలు తొడుక్కుంటే అదోరకం అనుభూతి. ఆ అనుభూతి మిగలాలంటే మీ దగ్గర క్రిస్మస్ కి సరిపోయే ఫ్యాషన్ బట్టలు ఉండాల్సిందే. ఐతే సరికొత్త ఫ్యాషన్ పేరుతో మీకు నప్పని బట్టలు వేసుకుని నిరాశకు గురి కావద్దు.
బాసింపట్టు వేసుకుని కూర్చోవడం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు ఇబ్బంది కలుగుతుందా?
గర్భం ధరించిన తర్వాత మహిళలు తమ అరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో బిడ్డ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని కుదురుగా ఉంచుకోవాలి. సాధారణంగా ఈ సమయంలో శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి.
75శాతం పెరిగిన ఐపీఎల్ విలువ.. ప్రపంచంలోనే రెండో లీగ్గా రికార్డు
మీడియా హక్కుల వేలం, రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్ విలువ ఆమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది 75శాతం వృద్ధిని నమోదు చేసి.. ఏకంగా 10.9 బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్నట్లు ప్రముఖ కన్సల్టింగ్, అడ్వైజరీ సేవల ఏజెన్సీ 'డీ అండ్ పీ' పేర్కొంది. బుధవారం వాల్యుయేషన్ రిపోర్ట్లో ఈ విషయాలను వెల్లడించింది. గతేడాది దీని విలువ 6.2బిలియన్ డాలర్లుగా ఉంది.
హాకీ ప్రపంచ కప్కు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం
హాకీ ప్రపంచకప్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా ఆహ్వానించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూచించారు. సభ్యులందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
"ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్
ఎలోన్ మస్క్ ప్రస్తుతం ట్విటర్ సీఈఓ పదవికి సరిపోయే వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఇటీవలి ట్వీట్లో, తన స్థానంలో మరొకరు వచ్చాక అధిపతిగా పదవీవిరమణ చేస్తానని ప్రకటించారు.
క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి
క్రిస్ మస్ పండగ సంబరాలు అప్పుడై మొదలయ్యాయి. ఆల్రెడీ అందరూ పండగ మూడ్ లోకి వెళ్ళిపోయారు. పండగ రోజు సరదాగా గడపడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు.
అన్నా డానిలినాతో జతకట్టనున్న సానియా మీర్జా
2023 జనవరి 16న ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానుంది. భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రపంచ నంబర్ 11 అయిన అన్నా డానిలినాతో జత కట్టనుంది.
ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో
తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని ఏర్పాటు చేసుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. విలన్ పాత్రలతో మెప్పించి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, కామెడీ పాత్రల్లోనూ తనదైన ముద్ర కనబర్చిన నటుడు కైకాల.
ఈ ఏడాది రోహిత్ శర్మ అట్టర్ ప్లాఫ్ షో
ఈ ఏడాది రోహిత్ శర్మ బ్యాడ్ ఫర్మార్మెన్స్తో ఇబ్బంది పడుతున్నాడు. ఫలితంగా అతనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బోటనవేలు గాయం కారణంగా బంగ్లాదేశ్ తో జరిగిన మూడోవన్డేకి , మిగతా రెండు టెస్టులకు దూరమయ్యాడు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
తెలుగు సినిమా కళామతల్లి మరో పెద్ద దిక్కును కోల్పోయింది. యముడి పాత్రలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈ రోజు ఉదయం కన్నుమూసారు.
నాగార్జునకు నోటీసులిచ్చిన గ్రామ సర్పంచ్
సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు నార్త్ గోవాలోని మండ్రెమ్ గ్రామ సర్పంచ్ నోటీసులు ఇచ్చారు. పనులను ఆపాలంటూ పంచాయతీ కార్యాలయం నుండి నాగార్జునకు నోటీసు వచ్చింది.
మైక్రో సాఫ్ట్ పై 60 మిలియన్ యూరోల జరిమానా విధించిన వాచ్ డాగ్
యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పై 60 మిలియన్ల జరిమానా విధించినట్లు ఫ్రాన్స్ ప్రైవసీ సంస్థ వాచ్డాగ్ తెలిపింది.
'బూస్టర్ డోస్ త్వరగా తీసుకోండి'.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిక
దేశంలోని ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది. రాబోయే రోజుల్లో కోవిడ్ వ్యాప్తిని అధిగమించడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటివి చేయాలని సూచించింది. పాజిటివ్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని అన్ని రాష్ట్రాలను కోరినట్లు చెప్పింది.