LOADING...

29 Dec 2022


జీ2 ని రెడీ చేస్తున్న అడవి శేష్.. డేట్ ఫిక్స్

అడవి శేష్.. క్షణం సినిమా నుండి మొన్న వచ్చిన హిట్ 2 వరకు అన్నింట్లోనూ విజయం అందుకున్నాడు. ఈ మధ్య తెలుగు సినిమాకి ఇన్ని హిట్లు అందించిన హీరో కనబడలేదు.

'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం

భారత ఔషధ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి తమ దేశంలో 18మంది చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ ప్రకటించిన నేపథ్యంలో.. కేంద్రం స్పందించింది. ఈ విషయంలో ఉజ్బెకిస్థాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణ జరుపుతున్నట్లు.. ఇప్పటికే దగ్గు సిరప్ తయారీని నిలిపివేసినట్లు తెలిపింది.

భారత హాకీ ఇండియా జట్టుకు నగదు బహుమతి

భారత్ హాకీ ఇండియా సరికొత్త నిర్ణయం తీసుకుంది. హాకీని మరింత ప్రోత్సహించేలా జట్టులోకి సభ్యులకు నగదును బహుమతిని ప్రకటించింది. ప్రస్తుతం నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందనలు తెలుపుతూ ట్విట్స్ చేస్తున్నారు. జనవరిలో జరిగే FIH పురుషుల ప్రపంచ కప్ 2023 భువనేశ్వర్-రూర్కెలాలో జరగనుంది.

2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు

టెక్నాలజీ కంపెనీలు 2022 లో ఎప్పటిలాగే ఎన్నో ఆవిష్కరణల గురించి హామీ ఇచ్చారు కానీ వాస్తవానికి, హామీకి చాలా దూరంలో ఆగిపోయారు.

జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని సరి చేసింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు

2022 సంవత్సరానికి ముగింపు పలికి 2023కి స్వాగతం పలకడానికి అందరూ రెడీ ఐపోతున్నారు. అందరూ ఇయర్ ఎండ్ మూడ్ లోకి వచ్చేసారు.

అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తున్న రవాణా శాఖ

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డీలర్ ప్రామాణికతను గుర్తించడానికి రిజిస్టర్డ్ వాహనాల డీలర్‌ల కోసం అధికార ధృవీకరణ పత్రాలను ప్రవేశపెట్టింది. ఈ చర్య వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు పారదర్శకతను ప్రోత్సహిస్తుంది.

ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'

దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరిస్థితులు అనుకూలించక పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చి ఓటు వేయలేని వారు చాలా మంది ఉంటారు. అలా గ్రామాలకు వచ్చి ఓటవేయలేని వారికోసం ఎన్నికల సంఘం 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'ను తీసుకురావాలని నిర్ణయించింది.

చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్ సవితా శ్రీ భాస్కర్

భారత్ చెస్ ప్లేయర్ సవితాశ్రీ భాస్కర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. కజకిస్తాన్‌లో జరిగిన ఎఫ్‌ఐడీఈ (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్) వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి రికార్డును క్రియేట్ చేసింది. వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెలిచిన మూడో భారత చెస్ ప్లేయర్‌గా నిలిచి అరుదైన ఘనత తన సొంతం చేసుకుంది.

చలికాలం: డయాబెటిస్ నుండి గుండె సంబంధ వ్యాధుల వరకు మెంతులు చేసే ప్రయోజనాలు

మనకు ఆరోగ్యాన్నిచ్చే చాలా పదార్థాలు మన కిచెన్ లోనే ఉంటాయి. కానీ మనం మాత్రం అది మర్చిపోయి ఎక్కడెక్కడికో వెళ్లిపోయి, ఏవేవో తింటుంటాం. సాధారణంగా కిచెన్ లో కనిపించే మెంతులు, మన ఆరోగ్యానికి ఎలాంటి లాభాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రత విషయం ఇప్పడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ భద్రత విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ చెబుతోంది. భారత్ జూడో యాత్ర ఈనెల 24న దిల్లీకి చేరిన సందర్భంలో.. రాహుల్ గాంధీ భద్రతపై నిర్లక్ష్యం తేటతెల్లమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇది రాజకీయంగా చర్చకు దారిసింది.

వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది

గాడ్ ఫాదర్ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

నాన్న వైస్ కెప్టెన్ అని మెసేజ్ పంపాడు : సూర్యకుమార్ యాదవ్

టీ20లో విధ్వంసకర బ్యాట్య్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది మంచి జోష్ ఉన్నారు. టీమిండియాలో అద్భుతంగా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక ఆట శైలి ఉందని నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు

చైనాలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7తో ఉక్కిరిబిక్కరి అవుతున్న బీజింగ్‌లో ఇప్పుడు.. ఔషధార కొరత ఏర్పడింది. మహమ్మారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చైనీయులు భారతీయ ఔషధాలను ఆశ్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో అవి లభ్యం కాకపోవడంతో.. బ్లాక్ మార్కెట్ కొని మరీ.. వినియోగిస్తున్నారు.

గ్యాంగ్ లీడర్ తో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత నటుడు వల్లభనేని జనార్ధన్ ఇక లేరు

చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ సుమలతకు తండ్రి పాత్రలో మెప్పించిన నటుడు వల్లభనేని జనార్ధన్, ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.

భారీ అంచనాలతో అరంగ్రేట్రం... ఆ తర్వాత అడ్రస్ గల్లంతు..!

టీమిండియాలో చోటు సంపాదించడం చాలా కష్టం.. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చి.. తరువాత చోటు దక్కకపోతే భవిష్యతులో ఆ ప్రభావం ఆటపై పడే అవకాశం ఉంటుంది. 2021లో జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు 2022లో ఇంటర్నేషన్ క్రికెట్ కి దూరంగా ఉండడం గమనార్హం.

కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

మరోమారు వివాదంలోకి రష్మిక మందన్న.. ఈ సారి సౌత్ సినిమాపై కామెంట్లు

పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న, గత కొన్ని రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది.

2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ

భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమ 2024 చివరి నాటికి రూ. 15 లక్షల కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

భారత్ టీంను ఢీకొట్టే శ్రీలంక జట్టు ఇదే..

జనవరిలో భారత్‌లో పర్యటించే శ్రీలంక జట్టును శ్రీలంక క్రికెట్‌బోర్డు ప్రకటించింది. టీమిండియా శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్లు, మూడు వన్డే సిరీస్ లను ఆడనుంది. జనవరి 3 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. శ్రీలంక జట్టు పగ్గాలను దసున్ షనకకు అప్పగించారు.

2022లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను వీడిన టాప్ 5 మోడల్స్

2022 సంవత్సరం భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లో చాలా కార్లు, బ్రాండ్‌లు వచ్చి చేరాయి. అయితే అమ్మకాలు తగ్గడం, కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న కారణంగా కొన్ని మోడల్‌ల నిష్క్రమణ కూడా 2022లో జరిగింది.

జీర్ణ సమస్యలను అరికట్టే హెర్బల్ టీ.. ఇంట్లోనే తయారు చేసుకోండి

జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా సరైన ఆహారాన్ని తినలేకపోతున్నారు. దానివల్ల ఆ ఆహారం సరిగ్గా జీర్ణం అవక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు మీకు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ హెర్బల్ టీ తాగండి.

2023 జనవరిలో బీసీసీఐ నూతన సెలక్షన్ కమిటీ..!

2023 జనవరిలో అశోక్ మల్హోత్రా నేతృత్వంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ, కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ముంబైలోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కార్యాలయంలో సమావేశం డిసెంబర్ 30న జరగనుంది. ఇందులో సభ్యులగా సులక్షణ నాయక్, పరంజ్పే ఉండనున్నారు.

'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు

దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు.

జనవరి 3న లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫోన్ POCO C50 గురించి తెలుసుకోండి

భారతదేశంలో POCO C50 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ జనవరి 3న విడుదల కాబోతుంది. ఇందులో MediaTek లేదా JLQ నుండి ఎంట్రీ-లెవల్ చిప్‌సెట్‌ ఉండే అవకాశం ఉంది. JLQ మార్కెట్లో కొత్త, Android ఆధారిత హ్యాండ్‌సెట్‌లు మరియు టాబ్లెట్‌ల కోసం SoCల తయారీపై దృష్టి పెడుతుంది.

వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు

ఎలోన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ట్విట్టర్ వినియోగదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఎదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్నటి వరకు ఖాతాలు నిలుపుదల, ఇతర సమస్యలను ఎదుర్కొన్న వినియోగదారులు... ఇప్పుడు వెబ్ నుండి సైన్ ఇన్ చేయడంలో సమస్యను ఎదుర్కుంటున్నారు. కొందరు వారి ట్విట్టర్ నోటిఫికేషన్‌లు కూడా పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు.

వేసవిలో వస్తున్న నాగచైతన్య కస్టడీ.. విడుదల తేదీ ప్రకటన

థ్యాంక్యూ సినిమాతో అతిపెద్ద అపజయాన్ని మూటగట్టుకున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య, ప్రస్తుత్రం ద్విభాషా చిత్రం కస్టడీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా నుండి నాగ చైతన్య పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.

ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు

అతివాద, నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం తెల్లవారుజామున కేరళ వ్యాప్తంగా సోదాలు చేపట్టింది. రాష్ట్రంలో దాదాపు 56చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది.

టీ20 మహిళల ప్రపంచ కప్‌లో వెటరన్ పేసర్ రీ ఎంట్రీ

వచ్చే ఏడాది 2023 టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ ప్రీతికౌర్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఇక టాప్‌లో కొనసాగుతున్న స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

28 Dec 2022


కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!

జనవరి మధ్యలో దేశంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి అని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత అనుభవాలను విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నాయి.

బాహుబలిని ఫాలో అవుతున్న పొన్నియన్ సెల్వన్.. రెండో భాగం విడుదల తేదీ ప్రకటన

బాహుబలి సినిమాతో దేశంలో పెద్ద సంచలనం చెలరేగింది. పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా వర్కౌట్ అవుతాయని చూపించిన సినిమా అది. అందుకే అప్పటి నుండి అన్ని ఇండస్ట్రీల్లోనూ అలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.

రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్

ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు.

హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

ఫార్మా దిగ్గజం హెటిరో మరో మైలు రాయిని అధిగమించింది. ఆ సంస్థ తయారు చేసిన కరోనా ఔషధం 'నిర్మాకామ్' ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రీక్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. కరోనా రోగులకు అందించే.. ఫైజర్‌కు చెందిన పాక్స్‌లోవిడ్‌ ఔషధానికి 'నిర్మాకామ్' అనేది జెనరిక్‌ ఔషధం.

అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు

బాలయ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ మేరకు షూటింగ్ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి.

2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి

టాటా ఫ్లాగ్‌షిప్ SUV, సఫారి, 2023లో అప్‌డేట్ వస్తుంది. SUV గత సంవత్సరం అప్డేట్ లాంచ్ అయినప్పటి నుండి మంచి అమ్మకాలను సాధిస్తోంది. అయితే, మహీంద్రా XUV700, స్కార్పియో N రాక 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరిగింది. ఈ రెండు మోడల్స్ సఫారి కంటే మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నాయి.

మెస్సీ పేరును వాడకూడదని.. అమల్లోకి చట్టం

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అంటే ఇలానే ఉంటుంది అన్నట్లుగా కప్పు కోసం అర్జెంటీనా- ఫ్రాన్స్ జట్లు కొదమ సింహాల్లా తలపడ్డాయి. చివరికి పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో గెలిచి మూడో ప్రపంచకప్‌ను అందుకుంది. వయసు పెరిగినా.. ఆట తగ్గలేదంటూ మెస్సీ అర్జెంటీనా జట్టును ముందుండి నడిపించి విజయంలో భాగస్వామ్యం అయ్యాడు.

ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు.

క్యాన్సర్ ని తరిమికొట్టే క్యాబేజీ రకం కూరగాయ గురించి తెలుసుకోండి

క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బోక్ చోయ్, బ్రస్సెల్ మొలకలు మొదలగు ఒకే రకానికి చెందిన ఆహారాలు క్యాన్సర్ రాకుండా అరికట్టడంలో సాయపడతాయి. అవును.. వీటిల్లో క్యాన్సర్ ని అరికట్టే పోషకాలు ఉన్నాయి.

చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్

Redmi K60 సిరీస్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో Redmi K60 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ వివరాలు ప్రస్తుతం తెలియదు కానీ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60E మోడల్స్ ఉన్నాయి.

12 ఏళ్లు నిరీక్షించి.. కలను సాకారం చేసుకున్నాడు

టీమిండియా బౌలర్ జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తరువాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. తనపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ అందివచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు లెఫ్టార్మ్‌ పేసర్‌.

ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ

ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ 2022 ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సి కల నేరవేరింది.

దక్షిణ కొరియాలో సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత.. పిల్లల ఆకారంలోని డాల్స్ పై మాత్రం..!!

ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

చర్మ సంరక్షణ: చర్మంపై నల్లమచ్చలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. రుతువు మారినప్పుడు చర్మం ప్రభావితం అవుతుంది. చర్మ సమస్యల్లో నల్లమచ్చలు ప్రధాన సమస్య. దీన్ని పట్టించుకోకపోతే చర్మం రంగు మారిపోయే అవకాశం ఉంటుంది.

భారత్‌తో టెస్టు సిరీస్ ఓటమి.. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రాజీనామా

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవికి రస్సెల్ డొమింగో రాజీనామా చేశాడు. భారత్‌తో బంగ్లాదేశ్‌ టెస్టు సీరిస్‌ను 2-0 తేడాతో ఓడిపోయింది. రెండు రోజుల తర్వాత రస్సెల్ డొమింగ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

సంక్రాంతికి ఊళ్లకు వెళ్లాలనుకునే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రెయిన్స్ నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. సకాలంలో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనంగా 94రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.

2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N

keeway యాజమాన్యం నుండి వస్తున్న Moto Bologna Passione లేదా MBP త్వరలో భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. జనవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023లో తన మొదటి M502Nని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది ఈ సంస్థ.

ఇడియట్ 2 సీక్వెల్ పై ఆన్సర్ చేసిన మాస్ మహారాజా రవితేజ

ఇడియట్.. రవితేజ కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పిన సినిమా ఇది. అప్పటివరకు వెండితెర మీద ఎన్నో సినిమాల్లో కనిపించినప్పటికీ ఇడియట్ సినిమాతోనే హీరోగా నిలదొక్కుకున్నాడు రవితేజ.

2022లో భారత్ క్రీడాకారుల చరిత్రాత్మకమైన విజయాలు

2022లో భారత మహిళ ప్లేయర్ల కోసం చారిత్రాత్మకమైన నిర్ణయాలను అమలు చేశారు. మహిళా క్రికెటర్లకు, భారత క్రికెటర్లతో సమానంతో వేతనాలను అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జేషా వెల్లడించారు.

'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్

ఒకవైపు కరోనా పీడ తొలగకముందే.. మరోవైపు కొత్త వైరస్‌లు పుట్టుకురావడం, పాతవి తిరిగి ప్రభావాన్ని చూపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాలో 'మెదడు తినే అమీబా' వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురువుతున్నాయి.

ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ లో అగ్ర స్థానంలో నిల్చిన అర్బన్ కంపెనీ

భారతదేశంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావంతో, గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగింది. అయినా సరే, వీరికి ఇప్పటికీ సరైన వేతనం, మిగిలిన సౌకర్యాలు అందడంలేదని తెలుస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఆహారాలు మీ డైట్ లో ఉన్నాయా?

జనవరి మాసం వచ్చేస్తోంది. చలిమంటలు భోగి మంటలుగా మారబోతున్నాయి. ఈ సమయంలో మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు మనల్ని ఇబ్బందిపెట్టకుండా కొన్ని ఆహారాలు కాపాడతాయి.

శిఖర్ ధావన్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా..?

గత శతాబ్ది కాలంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే క్రికెట్లో ఉత్తమ ఆటగాడిగా కొనసాగుస్తున్నాడు. టీమిండియాను విజయాల బాటలో నడిపించిన రోహిత్, కోహ్లీ తరువాత శిఖర్ ధావన్ అని చెప్పొచ్చు. మంగళవారం శ్రీలంక సిరీస్ తో ప్రకటించిన వన్డే జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కకపోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

వేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme

240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మొట్టమొదటి ఫోన్ రాబోతుంది. అదే Realme సంస్థ విడుదల చేయనున్న GT Neo 5. టెక్నాలజీ కమ్యూనికేషన్ సమావేశంలో జనవరి 5, 2023న తన ఫ్లాష్-చార్జింగ్ ఆవిష్కరణను ఆవిష్కరించబోతుంది.

'అప్పటి వరకు టీషర్ట్ మీదనే ఉంటా'.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం దేశంలో కరోనా తర్వాత.. ఆ స్థాయిలో చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ టీషర్ట్ పైనే. భారత్ జూడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఆయన టీషర్ట్ ధరించే నడన సాగిస్తున్నారు. చలి చాలా ఎక్కువగా ఉండే.. ఉత్తర భారతంలో కూడా రాహుల్ టీషర్ట్ పైనే ఉదయం పాదయాత్ర చేయడాన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

2022లో తెలుగు తెరకు పరిచయమైన హీరోలు, హీరోయిన్లు

తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ ని ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సంవత్సరం తెలుగు తెరమీద చాలామంది కొత్తవాళ్ళు కనిపించారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంలో ఈ సంవత్సరం కొత్తగా మెరిసిన వారి గురించి తెలుసుకుందాం.

ఆష్లీగ్ గార్డనర్ జోరు.. ఆల్ రౌండర్లలో మొదటి ర్యాంకు

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీగ్ గార్డనర్ ఐసీసీ ఉమెన్స్ ర్యాంకులో సత్తా చాటింది. ఆలౌ రౌండర్లలో జాబితాలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. ఇటీవల భారత్ మహిళ టీ20 మ్యాచ్ లో 32 బంతుల్లో 66 పరుగులు చేసింది.అనంతరం రెండు వికెట్లు తీసి 20 పరుగులు ఇచ్చింది.

మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్

స్వదేశీ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా & మహీంద్రా స్కార్పియో-ఎన్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ నుండి మిడ్-స్పెక్ వరకు ఐదు కొత్త వేరియంట్‌లను విడుదల చేయనుంది. SUVలో ఇప్పుడు ఇంజిన్ (పెట్రోల్/డీజిల్), ట్రాన్స్‌మిషన్ (మాన్యువల్/ఆటోమేటిక్), సీటింగ్ (ఆరు/ఏడు) ఆప్షన్స్ బట్టి 30 రకాల వేరియంట్‌లు ఉన్నాయి.

అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన కేసులో నోటీసు జారీ చేసింది. మంత్రి విడదల రజనీకి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ధర్మాసనం కోరింది.

2023లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జలపాతాలను లిస్ట్ లో చేర్చుకోండి

2022 పూర్తయిపోతోంది. ఇంకో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అప్పుడే ఆ సంవత్సరంలో ఏమేం చేయాలనే లిస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారు.

హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం

శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను బిసీసీఐ ప్రకటించింది. టీ20లకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను.. వన్డేలకు రోహిత్ శర్మను నియమించారు. ఈ సిరీస్‌లో ధావన్, పంత్‌ను దూరం పెట్టారు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం కేసు : కొచ్చర్‌ దంపతులకు సీబీఐ కస్టడీలోనూ సకల సౌకర్యాలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌లు ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే కస్టడీలో ఉన్నన్ని రోజులు వీరు ప్రత్యేక వసతులు వినియోగించుకునేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.