LOADING...

31 Dec 2022


2023: న్యూ ఇయర్ పార్టీ.. హ్యాంగోవర్ కి ఔషధాలు

కొత్త సంవత్సరాన్ని చాలా గట్టిగా సెలెబ్రేట్ చేసుకోవడాకి అన్నీ అరేంజ్ చేసుకుని పూర్తిగా సిద్ధమైపోయారు. కొంతమంది ఆల్రెడీ పార్టీ మూడ్ లోకి వెళ్ళిపోయారు. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించడంలో ఆమాత్రం జోష్ తప్పనిసరి.

మాజీ పోప్ బెనెడిక్ట్ అస్తమయం.. న్యూఇయర్ వేళ విషాదంలో క్యాథలిక్‌లు

క్యాథలిక్‌ల మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్-16(95) కన్నుమూశారు. శనివారం ఉదయం 9:34 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని వాటికన్‌ ప్రతినిధి మాటియో బ్రూనీ తెలిపారు. బెనెడిక్ట్ పార్థీవదేహం సెయింట్ పీటర్స్ బసిలికాలో సోమవారం నుంచి ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పారు.

2022లో లియాన్, రబాడ సరికొత్త రికార్డు

ధక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ, ఆస్ట్రేలియా ఆప్ స్పిన్నర్ నాథల్ లియాన్ ఈ ఏడాది టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లగా రికార్డుకెక్కారు. 2022లో మంచి ఫామ్‌ను కొనసాగిస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

2023లో స్మార్ట్‌ఫోన్ తయారీలో వినియోగదారులు ఆశిస్తున్న మార్పులు

2022 స్మార్ట్‌ఫోన్ తయారీలో పెద్దగా మార్పులు రాలేదు. అన్నీ బ్రాండ్లు పెద్దగా మార్పులు లేని విభిన్న వెర్షన్ స్మార్ట్ ఫోన్లు అందించాయి. అయితే 2023లో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు నుండి వినియోగదారులు కోరుకునే మార్పులు ఏంటో చూద్దాం.

టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో లోక్‌సభ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో బీజేపీలో, కేంద్ర మంత్రివర్గంలో భారీమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. అంత కంటే ముందే.. ఈ మార్పులు, చేర్పులు చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.

టీ20 సిరీస్‌లో.. ముగ్గురు నయా ప్లేయర్లు

టీమిండియాలో ముగ్గురు జూనియర్ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా జట్టు జనవరిలో మూడు వన్డేలు, మూడు టీ20లను స్వదేశంలో శ్రీలంకతో ఆడనుంది. సీనియర్ ఆటగాళ్ల పక్కను పెట్టి జూనియర్ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. టీ20 కెప్టెన్‌గా హార్థిక్, వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు.

చెడు కొవ్వు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. కొవ్వు పెరగకుండా చేసే దారులు

శరీరంలో చెడు కొవ్వు పెరగడాన్ని నిర్లక్ష్యం చేస్తే అది హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది.

2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), 2022లో పలు ప్రయోజనం చేకూర్చే సానుకూల నిర్ణయాలను తీసుకుంది. '2047 నాటికి అందరికీ బీమా' అనే దృక్పథంతో IRDAI అనేక సంస్కరణలు చేసింది.

'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

భారతీయ జనతా పార్టీ తనకు గురువులాంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాను ఎలా ఉండకూడదో , ఏ పనులు చేయకూడదో.. బీజేపీ నాయకులే తనకు శిక్షణ ఇచ్చినట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్.

ధోని, కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్

రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్, ఫిటినెస్ సమస్యతో బాధపడుతున్నారు. దాని ప్రభావం అతని సంపాదన మీద పడకపోవడం గమనార్హం. సంపాదనలో ఏకంగా ధోని, కోహ్లీని వెనక్కి నెట్టి ఐపీఎల్ లో రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు.

సిక్స్ ప్యాక్ లుక్‌లో అర్జున్ టెండూల్కర్ అదరహో..

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఒకప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేసేవారు. ప్రస్తుతం ఆ జాబితాలోకి యువ క్రికెటర్లు కూడా రాబోతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా సిక్స్ ప్యాక్ బాడిని ఒకప్పుడు ప్రదర్శించారు. వీరి జాబితాలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఈ జాబితాలో చేరిపోయాడు.

2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే?

2022లో కశ్మీర్ లోయలో జరిగిన ఎన్‌కౌంటర్ల వివరాలను అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. కశ్మీర్‌‌లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పేర్కొన్నారు.

పెళ్ళి చేసుకోబోతున్న నరేష్, పవిత్ర.. ముద్దు పెట్టి మరీ ప్రకటన

సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరోల గురించి, హీరోయిన్ల గురించి, క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి అనేక పుకార్లు షికారు చేస్తుంటాయి. కొన్ని కొన్నిసార్లు అవన్నీ పుకార్లుగానే మిగిలిపోతే మరికొన్ని సార్లు అవి నిజాలుగా బయటకు తేలతాయి.

Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్

బిహార్‌కు చెందిన రాజు రామ్ అనే వ్యక్తి డ్రీమ్11 బెట్టింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కేవలం రూ.49లో బెట్టింగ్ పెట్టి రూ.కోటి జాక్ పాట్ కొట్టేశాడు. కొన్ని లక్షల మందిని ఓడించి మరీ.. రాజు రామ్ ఈ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.

కోనేరు హంపి ఆట ఆదుర్స్

ప్రపంచ బ్లిట్జ్ లో కోనేరు హంపి చరిత్రను బద్దలు కొట్టింది. 9రౌండ్లు ముగిసేసరికి 44వ స్థానంలో ఉంది. ఇంకె ఆమె పతకం సాధించదని అందరూ ఓ అంచనాకు వచ్చారు. అయితే అంచనాలను తలకిందులు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫామ్ ఉన్న అమ్మాయిలను వెనక్కి నెట్టి ప్రపంచ బ్లిట్జ్ టోర్నలో పతకం సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్రను తిరగరాసింది.

VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ VIDA V1 కస్టమర్ డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. బ్రాండ్ నుండి మొదటి ఎలక్ట్రిక్ వాహనం బెంగళూరులో డెలివరీ చేశారు. జైపూర్, ఢిల్లీలో డెలివరీలు జరుగుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

2023: కొత్త సంవత్సరంలో కొత్త అలవాట్లు.. మీ డైలీ డైట్ కి వీటిని జోడించండి

కొత్త సంవత్సరాన్ని కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టడానికి అందరూ సిద్ధమైపోయారు. అలాగే కొత్త సంవత్సరంలో ఏమేం చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ తీర్మానించేసుకున్నారు. ఈ తీర్మానాల్లో రోజువారి ఆహారం గురించి తప్పకుండా ఉంటుంది.

సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం

రైళ్లలో ప్రయాణించే మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 15,000 కోచ్‌లను సీసీ కెమెరాల నీడలోకి తేనుంది. ఇందుకోసం కేంద్రం రూ. 705 కోట్లను కేటాయించింది.

గత పదేళ్లలో ఐదు అద్భుత టెస్టు సిరీస్‌లు

టెస్టు మ్యాచ్ ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని మ్యాచ్‌లు ఇప్పటికీ చూసిన ఉత్కంఠను రేపుతాయి.

2023 లో ఇస్రో చేయబోతున్న ప్రయోగాలు

2023 లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, భూమిని పరిశోధించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అక్టోబర్ 2022 నాటికి USA, జర్మనీ, కెనడా, స్వీడన్‌తో సహా 34 దేశాల కోసం దాదాపు 385 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు 2023 లో జరపబోయే మిషన్ల గురించి తెలుసుకుందాం.

చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ

చైనాలో కరోనా విజృంభిస్తోంది. దీంతో బీజింగ్‌పై ఆంక్షలు విధించే దేశాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యూకే, ఫ్రాన్స్, భారత్ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలో చైనాలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలపై తాజాగా నివేదికలను అందించాలని చైనాను డబ్య్లూహెచ్ఓ కోరింది.

రిషబ్ పంత్ డబ్బులు, నగలు కాజేసిన జనాలు

భారత్ యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న భారత్ అభిమానులు అందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, కాళ్లకు, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయ్యాయి.

డిసెంబర్ లో రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు: తగ్గింపులే కారణం

భారతదేశంలో ప్రయాణీకుల వాహనాల (PVS) రిటైల్ విక్రయాలు డిసెంబరులో రికార్డును తాకనున్నాయి. సంవత్సరాంతపు తగ్గింపులు వలన భారీగా అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల రిటైలింగ్ భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో 400,000 మార్కును తాకే అవకాశం ఉంది.

అమెరికాలో వీరసింహారెడ్డి వీరంగం.. వీరయ్యను దాటి

ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద మహా సంబరంగా ఉండనుంది. తెలుగు సినిమా పెద్ద హీరోలు తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీ నుంచి తన స్వగ్రామానికి బయల్దేరాడు. అయితే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో కారును అదుపు చేయలేక ప్రమాదానికి గురైనట్లు పంత్ వెల్లడించారు.

2023లో 5G సేవతో OTA అప్‌డేట్‌ను విడుదల చేయనున్న గూగుల్

గూగుల్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న OTA (Over-The-Air) అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది మొదటి 2023 త్రైమాసికంలో పిక్సెల్ ఫోన్‌లలో 5G సేవలకు మద్దతు ఇస్తుంది.

'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్

ఏ చిన్న అవకాశం వచ్చినా.. పాక్, చైనాపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తాజాగా సైప్రస్‌లోని ప్రవాస భారతీయలను ఊద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్, చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

రోనాల్డ్‌కి బంఫరాఫర్.. సౌథీతో రూ.2వేల కోట్ల డీల్..!

పోర్చుగల్ ఫుట్ బాల్ వీరుడు క్రిస్టియానో రోనాల్డ్ మాంచెస్టర్ యూనైటైడ్ తో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.గతంలో ప్రపంచ కప్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు రోనాల్డ్.. మాంచెస్టర్ యూనైటెడ్ జట్టు, మేనేజర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం అప్పట్లో దూమారం రేపింది.

చలికాలంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులు

చలికాలం కొందరికి సంతోషాలను మిగిల్చితే మరికొందరికి నొప్పులను, శారీరక బాధలను మిగుల్చుతుంది. ఈ కాలంలో మంచి ఆహారాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తారు.

డైరెక్టర్ ఎవరో రివీల్ చేయకుండా నాని 30వ సినిమా ప్రకటన

నేచురల్ స్టార్ నాని, తన 30వ సినిమాను వెల్లడించాడు. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ సినిమాలతో ఓ మోస్తారు విజయాన్ని అందుకుని ప్రస్తుతం దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనకాడటం లేదు.

30 Dec 2022


రిషబ్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లు..!

ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను ఓడిపోయింది. ఈ సిరీస్ లో ఇద్దరు వికెట్ కీపర్లను రంగంలోకి టీమిండియా దింపింది. కేఎల్ రాహుల్ అశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రస్తుతం వన్డేలో వికెట్ కీపర్ స్థానం టీమ్ మేనేజ్ మెంట్ చాలా కష్టపడుతోంది. ప్రపంచకప్‌లో పంత్ ఆడిన 2 మ్యాచ్‌లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.

ఇప్పుడు స్పామ్ కాల్స్ గూర్చి హెచ్చరించే గూగుల్ వాయిస్

గూగుల్ వాయిస్ కాల్‌లకు "అనుమానాస్పద స్పామ్ కాలర్" హెచ్చరికను జోడిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇది అనవసరమైన, అప్రధానమైన కాల్స్ ను ఫిల్టర్ చేస్తుంది. అయితే ఇన్‌కమింగ్ కాల్ స్పామ్ అని వినియోగదారులు ధృవీకరించాలి.

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా 1990 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్నఅంజనీకుమార్‌కు తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.

అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్?

ఓటీటీల్లో అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ గా చెప్పుకునే నెట్ ఫ్లిక్ల్, ప్రస్తుతం తెలుగు సినిమాల మీద, సిరీస్ ల మీద గట్టి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం

ఉక్రెయిన్ యుద్ధం, బలమైన డాలర్, ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రూడ్ దిగుమతిదారు చైనా నుండి డిమాండ్ తగ్గడం వలన చమురు ధరలు శుక్రవారం పెరిగాయి.

న్యూఇయర్ అలర్ట్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెండ్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 10గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

పెట్: ఎలాంటి బ్రీడ్ కుక్కపిల్లను పెంచుకోవాలో మీకు తెలుసా? ఇది తెలుసుకోండి

చాలామందికి పెట్స్ ని పెంచుకోవాలని ఇష్టంగా ఉంటుంది. కొందరు కుక్కలను పెంచుకుంటే కొందరు పిల్లులను పెంచుకుంటారు. కుక్కపిల్లల్ని పెంచుకోవాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

జనవరి 6న బీపీఎల్ సమరం

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సర్వం సిద్ధమైంది. అటగాళ్లను జాబితాను ఆయా జట్టులు ప్రకటించాయి. బీపీఎల్ లీగ్ లో ఏడు జట్లు నువ్వా-నేనా అన్నట్లు గా పోటిపడనున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా బీపీఎల్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం

కంపెనీలోని షార్ట్ సెల్లర్లు-లేదా ఒక ఆస్తి ధర పడిపోయినప్పుడు లాభపడే బేరిష్ పెట్టుబడిదారులు దాదాపు $17 బిలియన్ల మార్కెట్ లాభాలను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. S3 పార్టనర్స్ డేటా ప్రకారం టెస్లా సంవత్సరంలో అత్యంత లాభదాయకమైన స్వల్ప వాణిజ్యంగా మారింది.

భారత్‌తో పోరుకు సై అంటున్న వార్నర్

ఆస్రేలియా డేంజరేస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన వంద టెస్టులో సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫిబ్రవరిలో భారత్తో టెస్టు సిరీస్ జరగనుంది. దీనిపై డేవిడ్ వార్నర్ తాజాగా స్పందించాడు. భారత్ టెస్టు సిరీస్ గొప్ప సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో వైద్య విద్య చదివి.. అర్హత పరీక్ష రాయకుండానే.. ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై సీబీఐ గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మిగతా రాష్ట్రాల్లో 91చోట్ల సోదాలు నిర్వహించింది.

రిషబ్ పంత్ ఊపిరి నిలబడింది

క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు రిషబ్ పంత్ యాక్సిడెంట్ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తున్నారు.

రాశి ఫలాలు: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. ఈ రాశుల వారికి పెళ్ళిళ్ళు

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది కాబట్టి ఆ సంవత్సరం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. రాశిఫలాల ప్రకారం తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ

కన్నతల్లి అంత్యక్రియలు ముగిసి... రెండు గంటలు కూడా గడవలేదు, అప్పుడే విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు.

డిసెంబర్ 30న ఉచిత Fire MAX కోడ్‌లు: ఎలా రీడీమ్ చేయాలి

Garena Free Fire MAXలో ఉచిత కోడ్‌లను రీడీమ్ చేయడానికి వినియోగదారులు కొన్ని నియమాలను పాటించాలి.

ఈ ఏడాది ఎంట్రీతో సత్తా చాటిన బౌలర్లు వీరే..

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాడ్ తరుపున ఆరగ్రేటం చేసిన మ్యాటీ పాట్స్ అద్భుతంగా రాణించాడు. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో విలియమ్సన్ వికెట్ తీసి సత్తా చాటాడు. 4/13 రాణించి టెస్టులో అకట్టుకున్నాడు.

అల్లు అరవింద్ భారీ ఆఫర్.. ఆ సినిమాల్లో హీరో నిఖిల్ కి షేర్

2022సంవత్సరం హీరో నిఖిల్ కి బాగా కలిసొచ్చింది. ఆగస్టులో కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో విజయం అందుకుని, చివర్లో 18 పేజెస్ తో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

2022వ సంవత్సరం ప్రపంచ కుబేరుల లిస్ట్ లోకి గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల స్థాయికి ఎదిగారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్ టెన్‌లో ఈ ఏడాది తన సంపదను పెంచుకున్న ఏకైక వ్యక్తి కూడా అదానీ మాత్రమే.

మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ

మాల్దీవులోని భారత హైకమిషన్‌పై దాడికి ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు అబ్బాస్ ఆదిల్ రిజా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరు దేశాలు అలర్ట్ అయ్యారు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు.

కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత, యశోద సినిమా విడుదల సమయంలో తన అనారోగ్యం గురించి అందరి ముందు బయటపెట్టింది. ఆటో ఇమ్యూన్ వ్యాధిరకమైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది సమంత.

2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి

భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి.

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్య, స్మృతి

ఐసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్యకుమార్ యాదవ్, స్మృతి మందాన నిలిచారు. ఐసీసీఐ ప్రతిపాదించిన పురుషుల జాబితాలో సూర్య, మహిళల జాబితాలో స్మృతి మందాన చోటు దక్కించుకున్నారు.

అన్ స్టాపబుల్: ఢిల్లీ హై కోర్టులో ఆహా పిటీషన్.. అవి తొలగించాలని నిర్ణయం

అన్ స్టాపబుల్: ఏ ముహూర్తంలో ఈ షోకి ఆ పేరు పెట్టారో గానీ నిజంగా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. వ్యాఖ్యాతగా బాలయ్య తనదైన శైలిలో నడిపిస్తున్నారు.

అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్

అప్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ టీ20 కెప్టెన్ గా నియమితులయ్యారు. మహమ్మద్ నబీ స్థానంలో అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు రషీద్ కు జట్టు పగ్గాలను అప్పగించింది.

కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?

కేరళ గురువాయూర్ ఆలయ ఆస్తులపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆలయం పరిధిలో ఎన్ని రూ. కోట్ల డిపాజిట్లు ఉన్నాయి? ఎంత భూమి ఉంది? అనేది బయటి ప్రపంచానికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ విషయం బయటికి వచ్చింది.

పూర్తిగా అమ్ముడుపోయిన Ducati Panigale V4 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా బైక్‌లు

ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించబడిన నెంబర్ తో ఉన్న పరిమిత ఎడిషన్ పనిగేల్ V4 బగ్నాయా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా, పానిగేల్ V4 బౌటిస్టా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా అమ్ముడయ్యాయని Ducati సంస్థ ప్రకటించింది. ఈ సీజన్‌లో MotoGP, WorldSBKలో డుకాటీ విజయాన్ని పురస్కరించుకుని ఈ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది.

బరువు తగ్గడం: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించే ఆయుర్వేద పద్దతులు

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడం అనేది చాలా పెద్ద టాస్క్. దీనికోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా విఫలం అవుతుంటారు.

లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నూమూత

క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. బ్రెజిల్కు మూడుసార్లు కప్పు అందించిన పీలే(82) కన్నుమూశారు. పీలే చాలా సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పీలే మరణాన్ని అతని కుమార్తె కెల్లీ నాసిమెంటో ఇన్ స్టాగ్రామ్‌లో వెల్లడించారు. 1958, 1962, 1970లో బ్రెజిల్‌కు ప్రపంచ కప్పును అందించారు.

మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్

ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబేన్(100) కన్నుమూశారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డాడు. ఆతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చేలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పంత్ తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన రూర్కిలోని నర్సన్ సరిహద్దు సమీపంలోని ఉన్న హమ్మద్ పూర్ట్ ఝల్ రహదారిపై జరిగింది.

వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి

పాన్ కార్డు ఉన్నవారు తమ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, పాన్ పనిచేయదు. PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడతాయి.