03 Jan 2023
'బిహార్లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్పై నడ్డా విమర్శనాస్త్రాలు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్లో పర్యటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత.. నడ్డా బిహార్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్పై నడ్డా విమర్శాస్త్రాలు సంధించారు.
సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సినిమా హాళ్ల లోపల ఆహారం, పానీయాల అమ్మకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను విధించే పూర్తి అర్హత యజమానులకు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
గూగుల్ లో ఈ విషయాలు సెర్చ్ చేస్తే మీ పని అంతే!
టెక్నాలజీ రంగంలో 2023 ఒక ముఖ్యమైన సంవత్సరం. ఇంటర్నెట్ టెక్నాలజీల అభివృద్ధి ఆన్లైన్ ద్వేషపూరిత-సమూహ కార్యకలాపాలకు లేదా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు, సమాచారానికి కారణం అయింది.
'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి
పశ్చిమ బెంగాల్లో హౌరా నుంచి న్యూ జల్పాయిగుఢి మధ్య ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మాల్దా పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలో దాడి జరిగనట్లు అధికారులు చెప్పారు.
నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి
యోగా వల్ల మీ మనసు ప్రశాంతంగా మారడమే కాదు మీ కండరాలకు బలం చేకూరి శరీరానికి శక్తి అందుతుంది. ఇంకా బరువు తగ్గడంలో యోగా చాలా హెల్ప్ చేస్తుంది.
కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్
Poco కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లో ఈరోజే విడుదల చేసింది. Poco C50 పెద్ద 6.5-అంగుళాల డిస్ప్లేతో, 5000mAh బ్యాటరీ, వెనుకవైపు 8-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. స్మార్ట్ఫోన్ కంపెనీలు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో ఎక్కువ ఫోన్లను విడుదల చేయడం లేదు. భారతదేశంలో రూ. 10,000 లోపు ఉన్న ఫోన్ను పొందడం కొనుగోలుదారులకు కష్టమవుతోంది. అయితే, Poco C50తో ఇప్పుడు పరిస్థితి మారబోతుంది.
స్ట్రైక్-రేట్ 135 కంటే తక్కువ ఉంటే జట్టులోకి నో ఎంట్రీ : షాహిద్ ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్ సెలక్టర్గా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చి రాగానే జాతీయ జట్టులో పెను మార్పులను ఆఫ్రిది చేయాలని నిర్ణయించుకున్నాడు.
పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్తో రాజకీయ నాయకులకు ఎర!
పాకిస్థాన్ మిలటరీపై ఆ దేశ రిటైర్ట్ ఆర్మీ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ హనీట్రాప్కు పాల్పడుతోందని చెప్పారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ.. అందంగా ఉండే నటీమణులను ఎగదోస్తుందంటూ తన వీడియో వ్లాగ్లో చెప్పుకొచ్చారు. ఈ హనీ ట్రాప్లో ప్రముఖ పాకిస్థానీ హీరోయిన్ సాజల్ అలీ పేరు కూడా చెప్పినట్లు వార్తలు రావడం గమనార్హం.
కిరణజన్య సంయోగక్రియ నియంత్రణకు కారణమవుతున్న ప్రోటీన్లు
మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ ప్లాంట్ ఫిజియాలజీ పరిశోధకులు, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలోని కాలేజ్ ఆఫ్ నేచురల్ సైన్స్ పరిశోధకులు కలిసి కిరణజన్య సంయోగక్రియ నియంత్రణలో VCCN1, KEA3 అనే రెండు ప్రోటీన్ల ప్రాముఖ్యతను కనుగొన్నారు. మొక్కకు కాంతి పరిస్థితులను మార్చడం ద్వారా, కాంతి, నీడతో కూడిన సహజ పరిస్థితులను కల్పించడం ద్వారా మోడల్ ప్లాంట్-అరబిడోప్సిస్ థాలియానాపై వరుస ప్రయోగాలు చేశారు.
దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్లోకి గంగూలీ రీ ఎంట్రీ
భారత్ క్రికెట్ దిగ్గజం సౌరబ్ గంగూలీ ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ విరమణ పొందారు. మళ్లీ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీ కేపిటల్స్ హెడ్గా వస్తున్నట్లు సమాచారం. 2019 సీజన్లో గంగూలీ ఢిల్లీ కేపిటల్స్ అడ్వైజర్గా పనిచేశాడు. అదే ఏడాది అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడయ్యాక డీసీ అడ్వైజర్ పదవికి గంగూలీ రాజీనామా చేశారు.
దూసుకుపోతున్న బాలయ్య వీరసింహారెడ్డి.. క్రేజీ రికార్డ్ దిశగా పయనం
బాలక్రిష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి సినిమా, రిలీజ్ కి ముందే రికార్డులు రాసే దిశగా దూసుకుపోతుంది. అమెరికాలో ప్రీ సేల్స్ లో లక్ష డాలర్ల మార్కును టచ్ చేసింది.
Bumrah is Back: యార్కర్ల కింగ్ బుమ్రా వచ్చేశాడు
యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రా టీం ఇండియా జట్టులోకి వచ్చేశాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. నాలుగు నెలలుగా టీం ఇండియాకు దూరంగా ఉన్న బుమ్రా.. మళ్లీ జట్టులోకి తిరిగి రావడంతో టీం ఇండియా బౌలింగ్ లో బలపడింది.
ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన
ఎన్టీఆర్30 సినిమా నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు అందరూ ఆశగా ఎదురుచూసారు. రిలీజ్ డేట్ ప్రకటనతో ఆ ఆశ కొంత తీరినప్పటికీ, హీరోయిన్ ఎవరనే విషయం మీద అంతా ఆసక్తిగా ఉన్నారు.
ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!
సాధారణంగా వేసవిలో ఉపయోగించే వస్తువులు చలికాలంలో తక్కువ ధరకు లభిస్తాయి. మార్చి వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధరలు అమాంతం పెరిగిపోతాయి. కానీ ఈసారి మాత్రం రిఫ్రిజిరేటర్ల విషయంలో మాత్రం కొంచెం ముందుగానే ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
80 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత్ ప్లేయర్
భారత్ లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రంజీ టోర్నిలో సంచలన రికార్డును నమోదు చేశారు. ఏ బౌలర్ కి 80 ఏళ్లుగా సాధ్యం కానీ.. రికార్డును నేటితో బద్దలు కొట్టాడు. గతేడాది దేశవాళీ క్రికెట్లో చక్కటి బౌలింగ్ తో అకట్టుకొని 12 ఏళ్ల తరువాత భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్లో ఎంపికై రెండు మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
పాక్ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్
దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఎత్తిచూపారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. పాక్ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే చాలా చిన్నపదం అవుతుందని, అంతకు మించిన కఠిన పదాన్ని వాడాల్సి ఉంటుందన్నారు.
జబర్దస్త్ ఆర్పీ వ్యాపారానికి సమస్య.. చేపల పులుసు కోసం ఆడిషన్
నెల్లూరు గురించి తెలిసిన వారికి అక్కడి చేపల పులుసు గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందుకే నెల్లూరు పేరు చెబితే నోరూరి పోతుంటుంది.
ఆస్ట్రేలియాకు రీ ఎంట్రీ.. మొదటి మ్యాచ్లోనే జకోవిచ్ అద్భుత విజయం
ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్లో నోవాక్ జొకోవిచ్ విజయంతో టోర్నిని ప్రారంభించాడు. కరోనా వ్యాక్సిన్ టీకాను వేసుకోకపోవడంతో గతంలో టోర్నమెంట్స్కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్ ఆడటానికి అవకాశం రాలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్ని నుంచి మాత్రం ఆయనే స్వయంగా తప్పుకున్నాడు.
చౌకైన ఎయిర్పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్
ఆపిల్ చౌకైన ఎయిర్పాడ్స్ ఇయర్బడ్లపై పనిచేస్తోంది, వాటినే "AirPods Lite" అంటారు. AirPods డిమాండ్ 2022లో 73 మిలియన్ యూనిట్ల నుండి 2023లో 63 మిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ సరసమైన ఇయర్బడ్లపై పని చేస్తోందని విశ్లేషకులు సృష్టం చేసారు.
ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్య్ర హక్కు అందరికీ సమానంగా ఉంటుందని చెప్పింది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా దీనికి అతీతం కాదని ధర్మాసనం చెప్పింది. ఆర్టికల్ 19(2) కింద పేర్కొన్నవి తప్ప.. వాక్స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
రోజువారి పనుల్లో ఒత్తిడి ఫీలవుతున్నారా? మీ రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఎదురయ్యే సమస్యలు
రోజుల తరబడి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఒక్కోసారి క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉంది. ఒత్తిడితో ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని యుఎస్ కి చెందిన దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనంలోతేలింది.
టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఆసియా కప్ సమయంలో లంకేయుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేటి నుండి జరిగే శ్రీలంక సిరీస్ టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో అలరిస్తారో లేదో వేచి చూడాలి.
దిల్లీ లిక్కర్ స్కామ్: నిందితులకు బెయిల్ మంజూరు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్లో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. నరేందర్ సింగ్, కుల్దీప్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిల్ళై, సమీర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరు రెగ్యులర్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
శని గ్రహం చుట్టూ ఉండే వలయాల గుట్టు విప్పిన NASA
NASA హబుల్ స్పేస్ టెలిస్కోప్ చాలా సంవత్సరాలుగా శనిగ్రహాన్ని పర్యవేక్షిస్తుంది, ఎందుకంటే ఈ గ్రహం సూర్యుని చుట్టూ 29 సంవత్సరాల సుదీర్ఘ కక్ష్యలో తిరుగుతుంది.
'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా?
గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రచారంతో భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. అయితే ప్రపంచవ్యాప్త డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం ఒత్తిడికి గురవుతుంది. భారతదేశ ఎగుమతి ఆదాయాన్ని దెబ్బతీసి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం రాబోయే బడ్జెట్లో తన విధానాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.
టెన్నిస్ దిగ్గజం మార్టినాకు మరోసారి క్యాన్సర్ ఎటాక్
టెన్నిస్ స్టార్ మార్టినా నవత్రిలోవా మళ్లీ కేన్సర్ బారినపడ్డారు. దీంతో అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం కేన్సర్ తో పోరాడుతున్నానని టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా సోమవారం వెల్లడించారు.
చలికాలంలో అరటిపండు తింటే అనర్థాలు కలుగుతాయా? నిజం తెలుసుకోండి
సాధారణంగా ఎక్కువ మంది తినే పండు అరటిపండు. ఎందుకంటే చాలా సులభంగా మార్కెట్ లో దొరుకుతుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. మిగతా పండ్లతో పోల్చితే చవక కూడా.
చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం
రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్..?
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ స్థానంలో ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది.
కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య..
కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. బీటెక్ చదవుతున్న విద్యార్థిని(19)పై ఆమె స్నేహితుడే దాడికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. ఏకంగా 10 సార్లు ఆమెపై దాడి చేసి.. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థినిని స్మితగా.. ఆమె స్నేహితుడిని పవన్ కల్యాణ్గా గుర్తించారు.
మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు
టెక్ సంస్థలు మళ్ళీ వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే USలోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఈసారి కోతలు మరింత ఎక్కువగా ఉండచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బరువు తగ్గేందుకు కార్బోహైడ్రేట్లు తగ్గించుకుంటున్నారా? దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి
శరీర బరువు పెరగడానికి కారణం కార్బో హైడ్రేట్ ఆహారాలే అని చెప్పి, వాటిని తీసుకోవడం మానేస్తుంటారు. ఐతే వాటిని పూర్తిగా మానేయడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది.
'వన్డే ప్రపంచ కప్ను కచ్చితంగా గెలుస్తాం': హార్ధిక్ పాండ్యా
భారత టీ20 కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్ధిక్ పాండ్యా మీద ప్రస్తుతం ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ముంబై వేదికగా నేడు శ్రీలంకతో తలపడేందుకు హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది.
సమంత శాకుంతలం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ విషయంలో బాధపడుతున్న అభిమానులు
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ ఎక్కువ ఉన్న హీరోయిన్ లలో సమంత మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడు కొత్తవాళ్ళు వస్తున్నప్పటికీ సమంత స్థానం ఇంకా అలాగే ఉంది.
ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే!
టాటా డిజిటల్ ప్రెసిడెంట్ ముఖేష్ బన్సాల్, టాటాNeu రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగినట్లు సమాచారం. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న గందరగోళం గురించి అక్కడ ఉద్యోగుల ద్వారా తెలిసింది
అరుణాచల్ప్రదేశ్లో రాజ్నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం
అరుణాచల్ప్రదేశ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ మంగళవారం, బుధవారం పర్యటించనున్నారు. తవాంగ్ సెక్టార్లోని ఎల్ఎసీ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. రాజ్నాథ్సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
బిగ్ బాష్ లీగ్ మ్యాచ్లపై క్లారిటీ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహాసంగ్రామానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. 2024-2025 సీజన్కు సంబంధించి 43 మ్యాచ్లు వరకూ తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అవెంజర్ యాక్టర్ కి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం
మార్వెల్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మార్వెల్ నుండి ఏ సినిమా వచ్చినా ఎగబడి చూసేస్తుంటారు. దానివల్ల మార్వెల్ సినిమాల్లో నటించే వాళ్ళకు కూడా ప్రపంచ మొత్తం అభిమానులు ఏర్పడ్డారు.
02 Jan 2023
భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం
అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 మధ్య భారతదేశంలో పిల్లలపై లైంగిక దోపిడీ, బలవంతపు నగ్నత్వాన్ని ప్రోత్సహించినందుకు 45,589 ఖాతాలను ట్విట్టర్ నిషేధించింది. దేశంలో తమ వేదికపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 3,035 ఖాతాలను కూడా తొలగించింది. మొత్తంగా, భారతదేశంలో ఈ విషయంపై ట్విట్టర్ 48,624 ఖాతాలను నిషేధించింది.
ఫలానా అమ్మాయి ప్రేమలో నాగశౌర్య.. కొత్త సినిమా ప్రకటన
క్రిష్ణ వ్రింద విహారి సినిమా తర్వాత నాగశౌర్య తన కొత్త సినిమాను ప్రకటించాడు. "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.
'టీమిండియా ఓపెనర్గా అతనే దమ్మునోడు' : గంభీర్
టీమిండియా ఓపెనర్గా యువ ప్లేయర్ ఇషాన్ కిషనే దమ్మున ప్లేయర్ అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్కు సన్నదమవుతున్న టీమిండియా.. ఇషాన్ కిషన్నే తమ ప్రధాన ఓపెనర్గా ఎంచుకోవాలి. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీ చేసి విమర్శకుల నోర్లకు ఇషాన్ మూయించాడని పేర్కొన్నారు.
2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా..
2023 జనవరి 1 రాకతో.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టాయి. ఈఏడాది ఏకంగా 9రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే.. ఈ ఎలక్షన్స్ను సెమీఫైనల్స్గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్
క్రిప్టోకరెన్సీ ప్రధాన డెవలపర్లలో ఒకరైన బిట్కాయిన్ ల్యూక్ డాష్జర్ కు ఈ కొత్త సంవత్సరం అంతగా కలిసిరాలేదు. అతని క్రిప్టో వాలెట్ హ్యాక్ దాడికి గురైంది, అతని వ్యక్తిగత హోల్డింగ్స్ నుండి 216.93 బీట్ కాయిన్ల నష్టానికి దారితీసింది. ఒక్కో బీట్ కాయిన్ ధర $16,570 (దాదాపు రూ. 13.7 లక్షలు)గా ఉంది. అంటే, $3.6 మిలియన్లు (దాదాపు రూ. 30 కోట్లు) నష్టపోయారు.
ఈ ఏడాదైనా భారత్ విజయఢంకా మోగించేనా..?
2022లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన రోహిత్ సేన.. యూఏఈలో జరిగిన ఆసియా కప్లో ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. ఈ ఏడాది ఆరంభంలో సొంత గడ్డ మీద శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన భారత్.. టెస్టు ర్యాకింగ్లో రెండోస్థానంలో ఉంది.
ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
వాల్తేరు వీరయ్య: మేకింగ్ వీడియోలో చిరంజీవి నుండి మరో లీక్
సంక్రాంతి సందర్భంగా థియేటర్ల వద్ద రచ్చ చేయడానికి వాల్తేరు వీరయ్య రెడీ అవుతున్నాడు. ప్రమోషన్ల జోరు చూస్తుంటే ఈ విషయం తెలిసిపోతుంది. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో చివరి పాటను కూడా వదిలే పనిలో ఉన్నారు.
హార్థిక్ పాండ్యాను కెప్టెన్ను చేస్తారా.. ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..!
2022లో టీమిండియా అశించిన విజయాలు సాధించకపోవడంతో సెలెక్టర్లతో పాటు బీసీసీఐకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్లో విఫలం చెందడంతో టీ20 ప్రపంచ కప్లో భారత్ సెమీస్లోనే ఇంటి బాట పట్టింది. వయస్సు మీద పడుతున్న రోహిత్శర్మను తప్పించి కొత్త కెప్టెన్ను నియమించేందుకు బీసీసీఐ నిమగ్నమైంది.
Hyundai మోటార్ ఇండియాకు కొత్త COOగా తరుణ్ గార్గ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా సోమవారం తన సీనియర్ మేనేజ్మెంట్ లీడర్షిప్లో జరిగిన మార్పును ప్రకటించింది. ఇది జనవరి 1, 2023 నుండి అమలులోకి వచ్చింది.
ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా ? అనే అంశాన్ని పరిశీలించేందుకు మాతృ సంస్థ 'మెటా' సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. జనవరి 7న ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మెటా యాజమాన్యం చెప్పింది.
అత్యధిక ధరకు అమ్ముడైన మసూద శాటిలైట్ రైట్స్
2022లో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో మసూద కూడా ఒకటి. తెలుగు తెరమీద హార్రర్ సినిమాలు లేని లోటును తీర్చింది మసూద. రిలీజైన మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.
'థాంక్ గాడ్.. పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు' : కపిల్
నూతన ఏడాది కుటుంబ సభ్యులకు సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు.
పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం చెల్లుబాటు అవుతుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు జడ్జీలు తీర్పు చెప్పారు. జస్టిస్ నాగరత్నం ఒక్కరే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన జడ్జిమెంట్ను రాశారు.
సరిగ్గా ఇదే రోజు.. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ అరంగ్రేటం
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన స్పిన్ మాయజాలంలో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కులు చూపించిన లెజెండ్.. తన 15 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 1992 సరిగ్గా ఇదే రోజున షేన్ వార్న్ భారత్- ఆస్ట్రేలియా తరపున భారత్లో జరిగిన టెస్టు మ్యాచ్లో అరంగేట్రం చేశాడు.
పిల్లల కోసం ప్రత్యేకంగా Tab M9ని లాంచ్ చేసిన Lenovo
చైనీస్ టెక్ దిగ్గజం Lenovo Tab M9 పేరుతో కొత్త టాబ్లెట్ను ప్రవేశపెట్టింది. ఇది ఈ ఏడాది మధ్యలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
ఆడవాళ్ళకు మాత్రమే: మీరు పుట్టిన నెల ప్రకారం మీకుండే లక్షణాలు
పుట్టిన తేదీ, నెల, రోజు ప్రకారం వారికి కొన్ని లక్షణాలు వస్తాయని చెప్పుకుంటారు. ప్రస్తుతం ఏ నెలలో పుట్టిన ఆడవాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో చూద్దాం.
రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన
జమ్ముకశ్మీర్లోని రాజౌరిలో మరో ఉగ్ర పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరిలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 24గంటలు గడవక ముందే రాజౌరిలో మరో పేలుడు సంభవించడంతో కశ్మీర్ లోయలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
నాదల్ రికార్డులపై జకోవిచ్ గురి..!
ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడేందుకు నోవాక్ జొకోవిచ్కు అవకాశం దక్కింది. కరోనా వ్యాక్సిన్ టీకాను వేసుకోకపోవడంతో గతంలో టోర్నమెంట్స్కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్ ఆడటానికి అవకాశం రాలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్ని నుంచి మాత్రం ఆయనే స్వయంగా తప్పుకున్నాడు.
మద్యం ప్రియులకు గుడ్న్యూస్.. లిక్కర్పై పూర్తస్థాయిలో పన్ను రద్దు.. ఎక్కడో తెలుసా?
అద్భుతమై ప్రదేశాలకు నెలవైన దుబాయ్కు పర్యాటకుల తాకిడి నిత్యం ఉంటుంది. అయితే దేశ పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు.. నూతన సంవత్సరం వేళ.. ఆ దేశ రాజ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.
ఫోన్లు కొనడానికి ఫిజికల్ స్టోర్లకే ఓటు వేస్తున్న భారతీయులు
గత దశాబ్దం నుండి ఆన్లైన్ షాపింగ్ భారతదేశంలో పుంజుకుంది. అయితే ముఖ్యంగా గత అయిదారేళ్ళ నుండి అన్ని బ్రాండ్ల మొబైల్ ఫోన్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి.
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..!
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ ఇటీవల జింబాబ్వే పర్యటనకు టీ20 కెప్టెన్గా నియమతులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భవిష్యత్తు క్రికెట్పై నూరుల్ మదనపడుతున్నాడు. దీనికి కారణం తన చూపుడువేలుకు శస్త్ర చికిత్స చేసినా పూర్తిగా నయం కాకపోవడం.
నాకు ఆ టైమ్ ఇప్పుడే వచ్చింది.. హిందీ సినిమాపై నయనతార కామెంట్స్
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన తార, కనెక్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసారు.
ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్
ట్విటర్ చీఫ్ ఎలోన్ మస్క్ జనవరి 2023లో ట్విట్టర్లో నావిగేషన్ రాబోతున్నట్లు ప్రకటించారు. కొత్త ట్విట్టర్ నావిగేషన్ సిస్టమ్ వినియోగదారులను పక్కకు స్వైప్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. రికమెండెడ్ ట్వీట్లు, ట్రెండ్లు, అంశాలకు వారిని తీసుకువెళుతుంది. కొత్త నావిగేషన్ సిస్టమ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎలోన్ మస్క్ సృష్టంగా వెల్లడించనప్పటికీ, జనవరిలో రావచ్చని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?
ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి విస్తరణపై అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరలో ఏపీలో పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలో పార్టీని నడిపే నాయకుల జాబితాను ఇప్పటికే ఖరారు చేశారట. కీలక నాయకుల పేర్లు ఇప్పడు బయటకు వచ్చాయి. వీరందరూ సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇకపై ప్రమాదకరమైన రోడ్ల గురించి అప్డేట్ చేసే Waze యాప్
Waze యాప్ పేరెంట్ సంస్థ అయిన గూగుల్ ట్రాఫిక్ డేటా ఆధారంగా ప్రమాదకరమైన సమీపంలోని రోడ్ల గురించి వినియోగదారులకు హెచ్చరిక చేసే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
చలికాలం: కాపీ తాగడం అలవాటుగా మారిపోయిందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కాఫీ లేదా టీ ఏదైనా సరే.. ఎక్కువ తాగితే అనర్థాలే ఎదురవుతాయి. తాగినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది గానీ అలవాటు వ్యసనంగా మారి అదుపు లేకుండా పోతే ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది.
యోయో ఫిట్నెస్ మళ్లీ వచ్చేసింది..!
ఒకప్పుడు టీమ్ ఇండియా ఎంపికకు తప్పనిసరిగా యోయో ఫిట్ నెస్ పరీక్ష ఉండేది. యోయో ఫిట్నెస్ పరీక్ష మళ్లీ వచ్చేసింది. ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ అర్హత ప్రమాణాల జాబితాలో నిర్ణయించాలని ధ్రువీకరించింది. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసం 20 మందితో కోర్ గ్రూప్ ఏర్పాటు చేసి, అందులోని ఆటగాళ్లను టోర్ని ముందు వరకు రోటెట్ చేయాలనుకుంది. ప్రపంచ కప్ లో ఓటమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త దర్శకుడితో పంజా వైష్ణవ్ ప్రయోగం.. వేసవిలో విడుదల
ఉప్పెన సినిమాతో తెలుగు తెర మీద ఉప్పెన సృష్టించిన హీరో పంజా వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత సరైన విజయం సొంతం చేసుకోలేకపోయాడు. కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు బాక్సఫీసు వద్ద తేలిపోయాయి.
స్వీయ- అభ్యాస బ్రెయిలీ పరికరం 'Annie' గురించి తెలుసుకుందాం
గోవాలోని BITS పిలానీకి చెందిన అమన్ శ్రీవాస్తవ, అతని ముగ్గురు స్నేహితుల మధ్య టిఫిన్ తింటున్నప్పుడు ప్రారంభమైన సంభాషణ ఒక పరిశోధన ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంది. ఆ విధంగా బెంగళూరుకు చెందిన టింకర్బెల్ ల్యాబ్స్ దృష్టి లోపం ఉన్న పిల్లలకు బ్రెయిలీ లిపిని నేర్పడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి స్వీయ-అభ్యాస పరికరం 'Annie'ని అభివృద్ధి చేసింది.
జైలుపై తుపాకులతో రెచ్చిపోయిన సాయుధులు.. 14మంది మృతి
మెక్సికో జుయారెజ్ నగరంలోని జైలుపై గుర్తులు తెలియని సాయుధులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14మంది మృతి చెందగా.. 13 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. చనిపోయిన వారిలో 10మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దాడి నేపథ్యంలో దాదాపు 24మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు వివరించారు.
'టీ20 వరల్డ్ కప్ చాహెల్ అడుంటే ఎక్కవ నష్టం జరిగేది' : దినేష్ కార్తీక్
టీమిండియా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్.. స్పిన్నర్ చాహల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో లెగ్ స్పిన్నర్ చాహల్ ను ఆడించి ఉంటే టీమిండియా ఎక్కువ నష్టం జరిగేదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన పెద్దనోట్ల రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. జస్టిస్ నజీర్, జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత.. ఈ అంశంపై దాదాపు 58 పిటిషన్లు దాఖలయ్యాయి.
భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు
కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు వాహన తయారీదారులు అనేక కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. జనవరి 2023లో భారతదేశంలో ప్రారంభించబోయే టాప్ 5 వాహనాల గురించి తెలుసుకుందాం.
2022: తెలుగు తెరకు పరిచయమైన డబ్బింగ్ హీరోలు.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే
సినిమాలోని ఏదైనా అంశానికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని మోస్తారు. అందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరన్న సంగతి వాళ్ళు పట్టించుకోరు.
బౌండరీ లైన్ బయట క్యాచ్ పట్టినా ఔటిచ్చారు.. ఎందుకు..?
బౌండరీ లైన్ బయట క్యాచ్ పడితే అది సిక్సర్ అవుతుంది. అయితే బౌండరీ లైన్ బయట క్యాచ్ను ఔటిచ్చారు అంపైర్లు.. బిగ్బాష్ లీగ్లో ఓ ఫీల్డర్ పట్టిన క్యాచ్ చర్చనీయాంశమైంది.
ఆహారం: బాదం, వేరుశనగ.. ఆరోగ్యానికి ఏది మంచిది?
ఒక రోజులో 28గ్రాముల గింజలు తింటే అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులను దూరం చేస్తాయి. గింజల్లో ముఖ్యమైనవి బాదం, వేరుశనగ.
చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి
చంద్రబాబు సభల్లో వరుస విషాదాలు టీడీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో మొదటి రోజు గుంటూరు వికాస్నగర్లో జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ మహిళలే. ఇటీవల కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం
కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచే సుంకాల గురించి తాను భయపడుతున్నానని, భారతదేశాన్ని ఇటువంటి చర్యలు అధిక ఖర్చుతో కూడిన దేశంగా మారుస్తుందని. చైనాకు ప్రత్యామ్నాయంగా మారడం మరింత సవాలుగా మారనుందని, టారిఫ్లను పెంచడం వలన భారతదేశంలోకి వచ్చే నిధులు ఆగిపోయే అవకాశం ఉందని మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.