04 Jan 2023

మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై నిషేధం విధించిన ఎయిర్ ఇండియా

న్యూయార్క్ నుంచి దిల్లీ ప్రయాణిస్తున్నవిమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఎయిర్ ఇండియా చర్యలు తీసుకుంది. మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిపై 30 రోజలు పాటు నిషేధం విధించింది. నిషేధం ఉన్నన్ని రోజులు ఎయిర్ ఇండియా విమానంలో అతడు ప్రయాణించడానికి వీలు లేదని ఎయిర్ ఇండియా చెప్పింది.

2022లో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల్లో రికార్డ్

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ అమ్మకాలు 2022 సంవత్సరంలో భీభత్సంగా పెరిగాయి. కానీ అదే టైమ్ లో 2022 డిసెంబర్ లో మాత్రం తగ్గాయి. 2021 డిసెంబర్ లోని అమ్మకాలతో పోల్చితే 2022లో అమ్మకాలు తగ్గినట్లు కనిపిస్తోంది.

వాట్సప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ అదిరిపోయిందిగా..

వాట్సప్ రోజు రోజుకి సరికొత్తగా రూపాంతరం చెందుతోంది. యూజర్లు ఇష్టాలకు అనుగుణంగా వాటిని సరికొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్కైవ్ ఫీచర్ ని ఉపయోగించకుండా వాట్సప్ చాట్ ను చాలామంది దాచాలనుకుంటున్నారు. అయితే అది సాధ్యమయ్యే పని కాదు

మెగాస్టార్ చిరంజీవి చేతిలో మరో సినిమా.. ప్రభుదేవాకు అవకాశం?

వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు బాక్సాఫీసుకు సంక్రాంతి సంబరం తీసుకువచ్చే పనిలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై అభిమానులందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి.

బరువు తగ్గడం: 80-20 రూల్ డైట్ పాటిస్తే వచ్చే లాభాలు

మీరు తినాలనుకున్నది తింటూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చన్న సంగతి మీకు తెలుసా? ఇది ఎవరికైనా చెబితే అసాధ్యం అని అంటారు. కానీ ఇది సాధ్యమే. డైట్ లో 80-20 రూల్ తో ఇది ఈజీగా సాధ్యపడుతుంది.

ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ముంబయి పర్యటనకు వెళ్లారు. గురువారం ఆయన ముంబయిలో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొంటారు. దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగంగానే యోగి దేశమంతా పర్యటించనున్నారు. జనవరి 5 నుంచి జనవరి 27 వరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ముఖ్యమైన నగరాల్లో నిర్వహించే రోడ్ షోల్లో యోగి పాల్గొనున్నారు.

150కిలోమీటర్ల వేగంతో వెన్నులో వణుకు పుట్టించిన ఉమ్రాన్ మాలిక్

భారత్ యువ ఫాస్ట్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ త ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఏకంగా 150 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. బ్యాట్స్ మెన్స్ కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. కాశ్మీర్ కు చెందిన ఈ బౌలర్ ప్రస్తుతం భారత్ తరుపున ఫాస్టెస్ట్ బాల్ వేసి రికార్డు బద్దలు కొట్టాడు.

రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్!

దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా.. తమ వినియోగదారులకు 'ట్రూ 5 జీ' సేవలను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రిలయన్స్ జియోతో జతకట్టింది. ఈ విషయాన్ని బుధవారం ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి.

రిషబ్ పంత్ కోసం ప్రత్యేక విమానం.. ముంబైకి తరలింపు

రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ కు వెళ్తుండుగా.. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

అందం: 2023లో ఈ హెయిర్ స్టైల్స్ తో మీ జుట్టుకు కొత్త అందం తీసుకురండి

జుట్టును ఎన్ని స్టైల్స్ లో అయినా దాన్ని సెట్ చేసుకోవచ్చు. నిజమే.. హెయిర్ స్టైల్స్ వల్ల పూర్తి లుక్ మారిపోతుంది. ఒక్కో స్టైల్ లో ఒక్కో విధంగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం మనమందరం కొత్త సంవత్సరంలో ఉన్నాం.

సూపర్ బౌలింగ్.. అక్షర పటేల్ : సాబా కరీమ్

శ్రీలంకతో జరిగిన టీ20 లో చివరి ఓవర్లో అక్షర్ పటేల్ అధ్బుతంగా బౌలింగ్ చేసి.. భారత్ కు విజయాన్ని అందించాడు. జోరుమీదున్న చమికకు షాట్‌ ఆడే అవకాశం ఇవ్వకుండా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బంతులు వేసి జట్టును గట్టెక్కించాడు.

ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా

చైనాలో కరోనా విరవిహారం చేస్తోంది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి.

సామ్ సాంగ్ మొబైల్: నైట్ విజన్ కెమెరాకు మరిన్ని మెరుగులు.. కొత్త మోడల్ విడుదల

స్మార్ట్ ఫోన్ కంపెనీలు మొబైల్ ఫోన్లలోని యాప్ ల మాదిరిగా ఎప్పటికప్పడు అప్డేట్ అవుతూనే ఉండాలి.

4వేలు పరుగులు సాధించి.. ఖ్వాజా సంచలన రికార్డు

ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా నూతన ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. టెస్టులో 4వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

'క్లౌడ్'తో టెక్నాలజీ రంగంలో పెను మార్పులు: సత్య నాదెళ్ల

టెక్నాలజీ రంగంలో 'క్లౌడ్'తో పెను మార్పులు జరగబోతున్నాయని, దీని వినియోగం కూడా భారీగా పెరిగిందని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో నాదెళ్ల మాట్లాడారు.

భారీ ఆఫర్లను తిరస్కరించి.. చివరకి మెగా డీల్ పట్టిన రొనాల్డ్

ప్రపంచకప్ నుంచి కన్నీటితో నిష్క్రమించిన సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి క్రేజ్ కొంచె కూడా తగ్గలేదు. ప్రస్తుతం సౌది అరేబియాకు చెందిన అల్-నాసర్ జట్టు క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ చూసి పిచ్చెక్కిపోయింది.

నిర్మాత సురేష్ బాబుపై ప్రశంసల వర్షం.. ట్రాఫిక్ క్లియరెన్స్ వీడియో వైరల్

గొప్పవాళ్ళు కావడానికి పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదు. నిజానికి చిన్న చిన్న పనులను కూడా బాధ్యాతయుతంగా చేస్తారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లో జరిగిన ఒక సంఘటన పై వాక్యాన్ని నిజం చేస్తోంది.

అన్ స్టాపబుల్: బాలయ్య షోలో సందడి చేయనున్న రామ్ చరణ్, కేటీఆర్?

ఆహా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నుండి రోజుకో కొత్త న్యూస్ బయటకు వస్తోంది. బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో, జెట్ స్పీడులో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ చెలరేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?

ఓ వ్యక్తి పీకల దాకా తాగి.. ఆ మత్తులో తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇది జరిగింది.. బస్సులో కాదు, ట్రైన్‌లో కాదు. అమెరికా నుంచి దిల్లీకి వస్తున్న ఢిల్లీ ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఎయిర్ ఇండియా అధికారులు ధృవీకరించారు.

విజయంతో పీలేకు నివాళి

ఫుట్‌బాల్ ఆటలో బాగా రాణిస్తూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. కానీ తన ఆట వల్ల ఫుట్‌బాల్ ఆటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినవాడు మాత్రం పీలే ఒక్కడే.. మంగళవారం స్పానిష్ కప్ రోడ్రిగ్ ఒక గోల్ చేసి, కాసెరెనోపై 1-0 తేడాతో విజయం సాధించారు. ఈ విజయాన్ని పీలేకు అంకితం చేస్తున్నట్లు రోడ్రిగో ప్రకటించారు.

సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు.. చిత్రీకరించింది ఎవరో తెలుసా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అమ్మవారు మూల విరాట్టు వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు దుర్గ గుడి ఈవో భ్రమరాంబ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విచారణకు ఆదేశించారు.

చర్మ సంరక్షణ: మీరు వాడుతున్న సన్ స్క్రీన్ ఎలర్జీ కలుగజేస్తుందని తెలిపే సంకేతాలు

చర్మ సంరక్షణలో సన్ స్క్రీన్ పాత్ర చాలా ఉంటుంది. సూర్యుడి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలు చర్మాన్ని పాడుచేయకుండా సన్ స్క్రీన్ లోషన్ కాపాడుతుంది. ఐతే చర్మానికి వాడే ఏ సాధనమైనా అది హాని చేయకుండా చూసుకోవాలి.

హడలెత్తించిన మావి.. భారత్ థ్రిలింగ్ విన్

కొత్త ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన టీ20లో బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు రాణించారు. డెబ్యూ బౌలర్ శివమ్‌మావి లంక బ్యాటర్లకు చుక్కులు చూపించాడు. నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి.. నాలుగు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠను రేపింది.

కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు షాకిచ్చారు. బుధవారం నుంచి మూడు రోజుల‌పాటు చంద్రబాబు కుప్పంలో రోడ్‌షోలు, బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.

03 Jan 2023

'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత.. నడ్డా బిహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్‌పై నడ్డా విమర్శాస్త్రాలు సంధించారు.

సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సినిమా హాళ్ల లోపల ఆహారం, పానీయాల అమ్మకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను విధించే పూర్తి అర్హత యజమానులకు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

గూగుల్ లో ఈ విషయాలు సెర్చ్ చేస్తే మీ పని అంతే!

టెక్నాలజీ రంగంలో 2023 ఒక ముఖ్యమైన సంవత్సరం. ఇంటర్నెట్ టెక్నాలజీల అభివృద్ధి ఆన్‌లైన్ ద్వేషపూరిత-సమూహ కార్యకలాపాలకు లేదా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు, సమాచారానికి కారణం అయింది.

'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి

పశ్చిమ బెంగాల్‌లో హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మాల్దా పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలో దాడి జరిగనట్లు అధికారులు చెప్పారు.

నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి

యోగా వల్ల మీ మనసు ప్రశాంతంగా మారడమే కాదు మీ కండరాలకు బలం చేకూరి శరీరానికి శక్తి అందుతుంది. ఇంకా బరువు తగ్గడంలో యోగా చాలా హెల్ప్ చేస్తుంది.

కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఈరోజే విడుదల చేసింది. Poco C50 పెద్ద 6.5-అంగుళాల డిస్ప్లేతో, 5000mAh బ్యాటరీ, వెనుకవైపు 8-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఎక్కువ ఫోన్‌లను విడుదల చేయడం లేదు. భారతదేశంలో రూ. 10,000 లోపు ఉన్న ఫోన్‌ను పొందడం కొనుగోలుదారులకు కష్టమవుతోంది. అయితే, Poco C50తో ఇప్పుడు పరిస్థితి మారబోతుంది.

స్ట్రైక్-రేట్ 135 కంటే తక్కువ ఉంటే జట్టులోకి నో ఎంట్రీ : షాహిద్ ఆఫ్రిది

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్ సెలక్టర్‌గా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చి రాగానే జాతీయ జట్టులో పెను మార్పులను ఆఫ్రిది చేయాలని నిర్ణయించుకున్నాడు.

పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర!

పాకిస్థాన్ మిలటరీపై ఆ దేశ రిటైర్ట్ ఆర్మీ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ హనీట్రాప్‌కు పాల్పడుతోందని చెప్పారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ.. అందంగా ఉండే నటీమణులను ఎగదోస్తుందంటూ తన వీడియో వ్లాగ్‌లో చెప్పుకొచ్చారు. ఈ హనీ ట్రాప్‌లో ప్రముఖ పాకిస్థానీ హీరోయిన్ సాజల్ అలీ పేరు కూడా చెప్పినట్లు వార్తలు రావడం గమనార్హం.

కిరణజన్య సంయోగక్రియ నియంత్రణకు కారణమవుతున్న ప్రోటీన్లు

మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ ప్లాంట్ ఫిజియాలజీ పరిశోధకులు, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలోని కాలేజ్ ఆఫ్ నేచురల్ సైన్స్ పరిశోధకులు కలిసి కిరణజన్య సంయోగక్రియ నియంత్రణలో VCCN1, KEA3 అనే రెండు ప్రోటీన్ల ప్రాముఖ్యతను కనుగొన్నారు. మొక్కకు కాంతి పరిస్థితులను మార్చడం ద్వారా, కాంతి, నీడతో కూడిన సహజ పరిస్థితులను కల్పించడం ద్వారా మోడల్ ప్లాంట్-అరబిడోప్సిస్ థాలియానాపై వరుస ప్రయోగాలు చేశారు.

దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ

భారత్ క్రికెట్ దిగ్గజం సౌరబ్ గంగూలీ ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ విరమణ పొందారు. మళ్లీ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీ కేపిటల్స్ హెడ్‌గా వస్తున్నట్లు సమాచారం. 2019 సీజన్‌లో గంగూలీ ఢిల్లీ కేపిటల్స్ అడ్వైజర్‌గా పనిచేశాడు. అదే ఏడాది అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడయ్యాక డీసీ అడ్వైజర్ పదవికి గంగూలీ రాజీనామా చేశారు.

దూసుకుపోతున్న బాలయ్య వీరసింహారెడ్డి.. క్రేజీ రికార్డ్ దిశగా పయనం

బాలక్రిష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి సినిమా, రిలీజ్ కి ముందే రికార్డులు రాసే దిశగా దూసుకుపోతుంది. అమెరికాలో ప్రీ సేల్స్ లో లక్ష డాలర్ల మార్కును టచ్ చేసింది.

Bumrah is Back: యార్కర్ల కింగ్ బుమ్రా వచ్చేశాడు

యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రా టీం ఇండియా జట్టులోకి వచ్చేశాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. నాలుగు నెలలుగా టీం ఇండియాకు దూరంగా ఉన్న బుమ్రా.. మళ్లీ జట్టులోకి తిరిగి రావడంతో టీం ఇండియా బౌలింగ్ లో బలపడింది.

ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన

ఎన్టీఆర్30 సినిమా నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు అందరూ ఆశగా ఎదురుచూసారు. రిలీజ్ డేట్ ప్రకటనతో ఆ ఆశ కొంత తీరినప్పటికీ, హీరోయిన్ ఎవరనే విషయం మీద అంతా ఆసక్తిగా ఉన్నారు.

ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!

సాధారణంగా వేసవిలో ఉపయోగించే వస్తువులు చలికాలంలో తక్కువ ధరకు లభిస్తాయి. మార్చి వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధరలు అమాంతం పెరిగిపోతాయి. కానీ ఈసారి మాత్రం రిఫ్రిజిరేటర్ల విషయంలో మాత్రం కొంచెం ముందుగానే ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

80 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత్ ప్లేయర్

భారత్ లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రంజీ టోర్నిలో సంచలన రికార్డును నమోదు చేశారు. ఏ బౌలర్ కి 80 ఏళ్లుగా సాధ్యం కానీ.. రికార్డును నేటితో బద్దలు కొట్టాడు. గతేడాది దేశవాళీ క్రికెట్లో చక్కటి బౌలింగ్ తో అకట్టుకొని 12 ఏళ్ల తరువాత భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో ఎంపికై రెండు మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్

దాయాది దేశం పాకిస్థాన్‌ కుట్రలను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఎత్తిచూపారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే చాలా చిన్నపదం అవుతుందని, అంతకు మించిన కఠిన పదాన్ని వాడాల్సి ఉంటుందన్నారు.

జబర్దస్త్ ఆర్పీ వ్యాపారానికి సమస్య.. చేపల పులుసు కోసం ఆడిషన్

నెల్లూరు గురించి తెలిసిన వారికి అక్కడి చేపల పులుసు గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందుకే నెల్లూరు పేరు చెబితే నోరూరి పోతుంటుంది.

ఆస్ట్రేలియాకు రీ ఎంట్రీ.. మొదటి మ్యాచ్‌లోనే జకోవిచ్ అద్భుత విజయం

ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్లో నోవాక్ జొకోవిచ్‌ విజయంతో టోర్నిని ప్రారంభించాడు. కరోనా వ్యాక్సిన్ టీకాను వేసుకోకపోవడంతో గతంలో టోర్నమెంట్స్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్‌ ఆడటానికి అవకాశం రాలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్ని నుంచి మాత్రం ఆయనే స్వయంగా తప్పుకున్నాడు.

చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్

ఆపిల్ చౌకైన ఎయిర్‌పాడ్స్ ఇయర్‌బడ్‌లపై పనిచేస్తోంది, వాటినే "AirPods Lite" అంటారు. AirPods డిమాండ్ 2022లో 73 మిలియన్ యూనిట్ల నుండి 2023లో 63 మిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కంపెనీ సరసమైన ఇయర్‌బడ్‌లపై పని చేస్తోందని విశ్లేషకులు సృష్టం చేసారు.

ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్య్ర హక్కు అందరికీ సమానంగా ఉంటుందని చెప్పింది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా దీనికి అతీతం కాదని ధర్మాసనం చెప్పింది. ఆర్టికల్ 19(2) కింద పేర్కొన్నవి తప్ప.. వాక్‌స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.

రోజువారి పనుల్లో ఒత్తిడి ఫీలవుతున్నారా? మీ రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఎదురయ్యే సమస్యలు

రోజుల తరబడి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఒక్కోసారి క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉంది. ఒత్తిడితో ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని యుఎస్ కి చెందిన దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనంలోతేలింది.

టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?

ఆసియా కప్ సమయంలో లంకేయుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేటి నుండి జరిగే శ్రీలంక సిరీస్‌ టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో అలరిస్తారో లేదో వేచి చూడాలి.

దిల్లీ లిక్కర్ స్కామ్: నిందితులకు బెయిల్ మంజూరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్‌లో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. నరేందర్ సింగ్, కుల్దీప్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిల్ళై, సమీర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరు రెగ్యులర్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

శని గ్రహం చుట్టూ ఉండే వలయాల గుట్టు విప్పిన NASA

NASA హబుల్ స్పేస్ టెలిస్కోప్ చాలా సంవత్సరాలుగా శనిగ్రహాన్ని పర్యవేక్షిస్తుంది, ఎందుకంటే ఈ గ్రహం సూర్యుని చుట్టూ 29 సంవత్సరాల సుదీర్ఘ కక్ష్యలో తిరుగుతుంది.

'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా?

గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రచారంతో భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. అయితే ప్రపంచవ్యాప్త డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం ఒత్తిడికి గురవుతుంది. భారతదేశ ఎగుమతి ఆదాయాన్ని దెబ్బతీసి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం రాబోయే బడ్జెట్‌లో తన విధానాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.

టెన్నిస్ దిగ్గజం మార్టినాకు మరోసారి క్యాన్సర్ ఎటాక్

టెన్నిస్ స్టార్ మార్టినా నవత్రిలోవా మళ్లీ కేన్సర్ బారినపడ్డారు. దీంతో అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం కేన్సర్ తో పోరాడుతున్నానని టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా సోమవారం వెల్లడించారు.

చలికాలంలో అరటిపండు తింటే అనర్థాలు కలుగుతాయా? నిజం తెలుసుకోండి

సాధారణంగా ఎక్కువ మంది తినే పండు అరటిపండు. ఎందుకంటే చాలా సులభంగా మార్కెట్ లో దొరుకుతుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. మిగతా పండ్లతో పోల్చితే చవక కూడా.

చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం

రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్..?

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ స్థానంలో ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది.

కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య..

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. బీటెక్ చదవుతున్న విద్యార్థిని(19)పై ఆమె స్నేహితుడే దాడికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. ఏకంగా 10 సార్లు ఆమెపై దాడి చేసి.. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థినిని స్మితగా.. ఆమె స్నేహితుడిని పవన్ కల్యాణ్‌గా గుర్తించారు.

మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు

టెక్ సంస్థలు మళ్ళీ వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే USలోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఈసారి కోతలు మరింత ఎక్కువగా ఉండచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బరువు తగ్గేందుకు కార్బోహైడ్రేట్లు తగ్గించుకుంటున్నారా? దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి

శరీర బరువు పెరగడానికి కారణం కార్బో హైడ్రేట్ ఆహారాలే అని చెప్పి, వాటిని తీసుకోవడం మానేస్తుంటారు. ఐతే వాటిని పూర్తిగా మానేయడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది.

'వన్డే ప్రపంచ కప్‌ను కచ్చితంగా గెలుస్తాం': హార్ధిక్ పాండ్యా

భారత టీ20 కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్ధిక్ పాండ్యా మీద ప్రస్తుతం ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ముంబై వేదికగా నేడు శ్రీలంకతో తలపడేందుకు హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది.

సమంత శాకుంతలం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ విషయంలో బాధపడుతున్న అభిమానులు

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ ఎక్కువ ఉన్న హీరోయిన్ లలో సమంత మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడు కొత్తవాళ్ళు వస్తున్నప్పటికీ సమంత స్థానం ఇంకా అలాగే ఉంది.

ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే!

టాటా డిజిటల్ ప్రెసిడెంట్ ముఖేష్ బన్సాల్, టాటాNeu రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగినట్లు సమాచారం. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న గందరగోళం గురించి అక్కడ ఉద్యోగుల ద్వారా తెలిసింది

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం

అరుణాచల్‌ప్రదేశ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం, బుధవారం పర్యటించనున్నారు. తవాంగ్ సెక్టార్‌లోని ఎల్‌ఎసీ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లపై క్లారిటీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహాసంగ్రామానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. 2024-2025 సీజన్‌కు సంబంధించి 43 మ్యాచ్‌లు వరకూ తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అవెంజర్ యాక్టర్ కి యాక్సిడెంట్.. పరిస్థితి విషమం

మార్వెల్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మార్వెల్ నుండి ఏ సినిమా వచ్చినా ఎగబడి చూసేస్తుంటారు. దానివల్ల మార్వెల్ సినిమాల్లో నటించే వాళ్ళకు కూడా ప్రపంచ మొత్తం అభిమానులు ఏర్పడ్డారు.